E-Paper
Advertisement

Secunderabad: ఇద్దరు దొంగలను చితకబాది.. స్తంభానికి కట్టేసి..? సికింద్రాబాద్‌లో ఘటన

Secunderabad: ఇద్దరు దొంగలను చితకబాది.. స్తంభానికి కట్టేసి..? సికింద్రాబాద్‌లో ఘటన

Secunderabad News: సికింద్రాబాద్, బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంసాలి బజారులో దొంగతనాలు చేస్తూ అడ్డంగా దొరికిన ఇద్దరు వ్యక్తులకు స్థానికులు తగిన బుద్ధి చెప్పారు. రామాలయం సమీపంలోని ఓ ఇంట్లో వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి, అనంతరం స్తంభానికి కట్టేసి బాదిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కంసాలి బజారులోని రామాలయం వద్ద ఉన్న ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని దొంగలు శనివారం రోజు మొదటిసారి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ దొంగతనంలో ప్రధానంగా దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రిని ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. దొంగలు మరోసారి మంగళవారం రాత్రి కూడా అదే ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చారు. అయితే, ఇంటి యజమాని, పరిసర ప్రాంతాల వారు అప్పటికే అప్రమత్తంగా ఉన్నారు.

వరుస దొంగతనాలతో విసిగిపోయిన స్థానికులు, ఎలాగైనా దొంగలను పట్టుకోవాలని పక్కా ప్రణాళికతో కాపు గాశారు. మంగళవారం రాత్రి వారు దొంగతనానికి వస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు ఏకమై వారిని చుట్టుముట్టారు. దొంగలు పారిపోయే ప్రయత్నం చేసినా.. స్థానికుల ఉద్దేశపూర్వక చర్యల ముందు వారి ప్రయత్నం ఫలించలేదు.

స్థానికులు ఈ ఇద్దరు దొంగలను పట్టుకుని, దొంగతనాలకు పాల్పడినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చితకబాదినట్లు సమాచారం. అంతేకాకుండా, ఇతరులకు గుణపాఠం చెప్పే ఉద్దేశంతో వారిద్దరిని సమీపంలోని స్తంభానికి కట్టివేశారు. అనంతరం, బోయిన్‌పల్లి పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల నుండి వివరాలు సేకరించి దొంగలను అదుపులోకి తీసుకున్నారు.

దొంగల నుంచి 12 కిలోల బరువున్న మూడు ఇత్తడి తాంబాలాలను స్వాధీనం చేసుకున్నట్టు  స్థానికులు తెలిపారు. దొంగిలించబడిన ఈ సామాగ్రిని ఫతేనగర్ ప్రాంతంలోని ఓ షాపు నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుబడిన దొంగలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాత్రి వేళల్లో పెరిగిన దొంగతనాలను అరికట్టడానికి పోలీసులు మరింత నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ALSO READ: KVS NVS Notification: రూ.2 లక్షల జీతంతో టీచర్ ఉద్యోగాలు.. రేపటి నుంచే దరఖాస్తు ప్రారంభం, బంగారం లాంటి అవకాశం

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×