E-Paper
Advertisement

Utham Kumar Reddy: జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష

Utham Kumar Reddy: జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష

Utham Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం (నవంబర్ 22) హైదరాబాద్‌లోని జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బోస్ (BOCE) కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులు, నూతన ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి చర్చించారు

తుమ్మడిహెట్టి నుంచి 80 టీఎంసీల నీటిని ఏవిధంగా వాడుకోవాలనే అంశంపై చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తుమ్మడిహెట్టికి సంబంధించి ఎత్తు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరుపాలని ఇంజనీర్లతో కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు.  అదేవిధంగా సవరించిన అంచనాల ప్రతిపాదనలు (Revised Estimates), భూసేకరణ (Land Acquisition), పునరావాస (R&R) సమస్యలపై కూడా చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో ప్రధానంగా ప్రాజెక్టుల వారీగా ప్రాధాన్యతలను గుర్తించడంపై మంత్రి దృష్టి సారించారు. రాబోయే 6 నుండి 36 నెలల కాలంలో కొత్తగా ఆయకట్టును (Ayacut) అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్టుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే,  సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో పర్యావరణ అనుమతుల అంశాన్ని కూడా ఈ సమీక్షలో మంత్రి పరిశీలించారు.

Read Also: I Bomma Ravi: ఐబొమ్మ రవి విలాసాల చిట్టా విప్పిన పోలీసులు.. నెదర్లాండ్స్‌లో సర్వర్లు, 20 రోజులకోసారి విదేశీ యాత్ర!

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×