E-Paper
Advertisement

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు!

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు!

Vasthu Changes for Secretariat: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు చేస్తున్నారు. ఇప్పటివరకు సచివాలయ ప్రధాన ద్వారం నుంచి ముఖ్యమంత్రి కాన్వాయ్ లోపలికి వస్తున్నది. అయితే, ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి, నార్త్ ఈస్ట్ గేట్ గుండా సీఎం కాన్వాయ్ బయటకు వెళ్లిపోనున్నది. సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు రాకపోకలు కొనసాగించనున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి వాస్తు మార్పులు చేస్తున్నారు. గతంలో సీఎం కార్యాలయంను ఆరో అంతస్తు నుంచి తొమ్మిదో అంతస్తుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తొమ్మిదో అంతస్తులో పనులు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉంటే, గడిచిన రెండుమూడు రోజులుగా కురిసిన వర్షాలు, వచ్చే మూడునాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు సరఫరా చేసినటువంటి పచ్చరొట్ట, ప్రత్తి విత్తనాల ప్యాకెట్లను రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందేలా చూడాలని ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఆయన కోరారు.

అదేవిధంగా పలు ప్రాంతాల్లో పచ్చి రొట్ట విత్తనాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, మన రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నవారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అనుమతి లేకుండా ప్రత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయిస్తున్నవారిపై కేసులు పెట్టినట్లు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నవారిపై కూడా కేసులు నమోదు చేశామని అధికారులు తెలియజేసినట్లు తెలుస్తోంది.

Also Read: మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్.. రేపు సాయంత్రం ?

ప్రత్తి విత్తనాలు అవసరంమేర అందుబాటులో ఉన్నాయని, రైతులు అధికృత డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×