E-Paper
Advertisement

దేశమంతా తిరుగుతా.. మోదీని గద్దె నుంచి దింపుతా, వీహెచ్ సంచలన ప్రకటన

దేశమంతా తిరుగుతా.. మోదీని గద్దె నుంచి దింపుతా, వీహెచ్ సంచలన ప్రకటన
Advertisement

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు (వీహెచ్) పోరాట బాట పట్టారు. జాతీయ స్థాయిలో చేపట్టబోయే జనగణనలో భాగంగా బీసీ కులగణనను కూడా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని తన నివాసంలో ఉదయం పదిన్నర గంటలకు ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. బీసీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపిస్తూ ఆయన ఈ నిరసన చేపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

బీసీల కాలమ్ లేకపోవడంపై ధ్వజం

Advertisement

దీక్ష సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన ఫారమ్‌లో బీసీల కోసం ప్రత్యేక కాలమ్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేస్తున్నప్పుడు దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు ఎందుకు కనబడటం లేదని ఆయన ప్రశ్నించారు. ఏటా బీసీల జనాభా పెరుగుతున్నా వారికి దక్కాల్సిన వాటా మాత్రం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం లెక్కలు తేలితేనే విద్య, ఉద్యోగాల్లో బీసీలకు సరైన న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రధానికి లేఖలు.. ఎంపీలకు హెచ్చరిక

Advertisement

బీసీ కులగణనపై ప్రధాని మోడీకి ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాసినట్లు వీహెచ్ వెల్లడించారు. ఆ లేఖలకు ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోడీ తరచూ తనను తాను బీసీ బిడ్డగా చెప్పుకుంటారని.. మరి అదే బీసీలకు న్యాయం చేయడంలో ఎందుకు వెనుకాడుతున్నారని నిలదీశారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు ఈ విషయంలో ప్రధానిపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. బీసీల హక్కుల కోసం బీజేపీ నాయకులు నోరు విప్పకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

రాజకీయ విమర్శలు – మహిళా రిజర్వేషన్లు

బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశాన్ని ముక్కలు చేసేలా ఉన్నాయని వీహెచ్ ఆరోపించారు. మతపరమైన అంశాలతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా బీసీ మహిళలకు ప్రత్యేక కోటా కేటాయించకపోవడం అన్యాయమని అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో గట్టిగా పోరాడారని గుర్తు చేశారు. బీసీల పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రిజర్వేషన్లలో ఉప కోటా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ పర్యటనపై అల్టిమేటం..

బీసీల డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రధాని మోడీ తెలంగాణలో అడుగుపెట్టాలని వీహెచ్ స్పష్టం చేశారు. ఒకవేళ బీసీ కులగణనపై స్పష్టత ఇవ్వకుండా రాష్ట్రానికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పర్యటనకు వస్తే దేశవ్యాప్తంగా పర్యటించి బీజేపీ అసలు రంగును ఎండగడతానని ప్రకటించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని.. ఈ దీక్ష ఒక ప్రారంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

ALSO READ: అప్పుల కుంపటిపై భాగ్యనగరం.. రూ.6,553 కోట్ల భారం.. ఇదిగో పూర్తి లెక్కలు..!

Related News

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Big Stories

Advertisement
×