ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 32 మంది డాక్టర్లను బురిడీ కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. డాక్టర్లను టార్గెట్ చేసి వంద కోట్లు కొల్లగొట్టారు. వరంగల్లో జరిగిన ఈ మోసం సంచలనం సృష్టిస్తోంది.
పెట్టుబడులతో భారీ లాభాలంటూ డాక్టర్లపై వల విసిరారు సైబర్ నేరగాళ్లు. MONARCH FIN యాప్ ద్వారా.. డబ్బులు పెట్టుబడి పెట్టాలని కోరారు కేటుగాళ్లు. సైబర్ వలలో చిక్కుకుని.. కోట్లకు కోట్లు సమర్పించుకున్నారు డాక్టర్లు. ఒక్కో డాక్టర్ నుంచి దాదాపు రూ.3 కోట్ల చొప్పున వసూలు చేశారు.
ఇప్పటి వరకూ 32 మంది డాక్టర్లు వలలో పడ్డట్లు పోలీసులు గుర్తించారు.
ఇటీవలే హైదరాబాద్లో రూ.14 కోట్లకు పైగా ఇలానే నష్టపోయారు డెంటల్ డాక్టర్. వరంగల్లో ఏకంగా 32 మంది డాక్టర్లు మోసపోవడం.. సంచలనం సృష్టిస్తోంది. పరువు పోతుందన్న భయంతో.. సైబర్ మోసంపై మాట్లాడడానికి వెనుకడుగు వేస్తున్నారు డాక్టర్లు.