E-Paper
Advertisement

Ward Meetings: అలియాబాద్‌లో ప్రజా పాలన సభలు.. మున్సిపల్ చైర్మన్ హడావుడి!

Ward Meetings: అలియాబాద్‌లో ప్రజా పాలన సభలు.. మున్సిపల్ చైర్మన్ హడావుడి!

Ward Meetings: స్వేచ్చ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అలియాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 12వ వార్డు యాడారం, 13వ వార్డు మురహరిపల్లి గ్రామాల్లో శుక్రవారం వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.

అభివృద్ధి పనులు..

ఈ సందర్భంగా అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వార్డు సభల ద్వారా ప్రజల అవసరాలను నేరుగా తెలుసుకుని ప్రాధాన్యత ఆధారంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి పౌరుడు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని కోరారు.

Also read: రేవంత్‌కు క్లోజ్‌గా ఉండటంతో.. నా ఫోనూ ట్యాప్ చేశారు.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ..

సభల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించడం, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దోమల నివారణ చర్యలు, మురుగు కాలువల నిర్వహణ, తాగునీటి సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం మురహరిపల్లి గ్రామ సమీపంలోని రాజీవ్ రహదారిపై నిర్మించనున్న బస్‌షెల్టర్‌కు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బస్‌షెల్టర్ నిర్మాణంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, ఇతర ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పురపాలక సంఘం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటరెడ్డి, కౌన్సిలర్లు యూసుఫ్ బాబా, హనుమాన్ దాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Also read: భారీ శబ్దంతో చీలిపోయిన రైలు బోగి.. భయంతో ప్రయాణికుల పరుగులు!

Related News

Revenue Corruption: పైకి నెంబర్ వన్ అధికారి.. లోపల రైతుల రక్తం తాగుతున్న వైనం.. ఆ తహసీల్దార్ అసలు రంగు ఇదీ!

Vamsi Goud: నల్గొండ జిల్లా గీత కార్మికుడి కొడుకు.. తెలంగాణ తరపున ఢిల్లీలో సంచలనం..!

విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు పొడగింపు.. ఎప్పటివరకు అంటే?

భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. దంచికొడుతున్న భారీ వర్షం!

కేటీఆర్, కవితలపై రఘునందన్ రావు ఫైర్.. 2007లో ఎక్కడున్నారు? అంటూ ప్రశ్నల వర్షం!

CJP Protest: ఢిల్లీలో మారుమోగిన నినాదాలు.. ముగిసిన సీజేపీ నిరసన కార్యక్రమం..!

రేవంత్‌కు క్లోజ్‌గా ఉండటంతో.. నా ఫోనూ ట్యాప్ చేశారు.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Big Stories

×