E-Paper
Advertisement

Weather Report: ఈసారి వానలు ఆలస్యం.. ఎండ మరింత కాలం.. ఎల్‌నినో కూడా!

Weather Report: ఈసారి వానలు ఆలస్యం.. ఎండ మరింత కాలం.. ఎల్‌నినో కూడా!
Advertisement

Weather Report: రోహిణి రాకముందే రోకళ్లు పగులుతున్నాయి. ఏపీలో టెంపరేచర్ హాఫ్ సెంచరీ టచ్ అవుతోంది. తెలంగాణలో 45 డిగ్రీలు దాటేసింది. ఎండ మండుతోంది. బయటికొస్తే మాడు పగులుతోంది. రోహిణి కార్తె వస్తే ఇంకెలా ఉంటుందో పరిస్థితి. ఈ ఎండ వేడి తగ్గాలంటే.. ఒక్కటే మార్గం. వానలు పడాలి. వానలు పడాలంటే.. రుతుపవనాలు రావాలి. కానీ, ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతుందని భారత వాతావరణ విభాగం-IMD వాన కబురు వేడిగా చెప్పింది.

అవును, ఈసారి మాన్‌సూన్స్ లేట్ అవుతాయట. జూన్ 4న కేరళ తీరాన్ని తాకే ఛాన్స్ ఉందట. జూన్ 4 అనేది ఓ అంచనా మాత్రమే. రియల్‌గా మరింత ఆలస్యమయ్యే అవకాశామే ఎక్కువ. ఈ న్యూసే ఇప్పుడు భగ్గు మంటోంది.

Advertisement

మామూలుగా అయితే జూన్ 1న కేరళను టచ్ చేయాలి నైరుతి రుతుపవనాలు. 2020లో జూన్ 1న, 2021లో జూన్ 3న, 2022లో మే 29 నాటికే కేరళ తీరానికి చేరుకున్నాయి మాన్‌సూన్స్. కానీ, గతానికి భిన్నంగా ఈసారి సుమారు 4 రోజులు ఆలస్యం కానున్నాయని IMD చెబుతోంది. అంటే, ఈ ఎండలను మరింత కాలం భరించాల్సిందేనా?

ఎందుకు ఆలస్యం అంటే.. ఎల్‌‌నినో వల్లే అంటోంది వాతావరణ శాఖ. ఈ పదం వినగానే బెంబేలవుతున్నారు జనం. అసలే ఫుల్ ఎండలు.. ఇక ఎల్‌నినో కూడా తోడైతే..? వానలు కూడా పడకపోతే..? పరిస్థితి ఇంకెంత అధ్వాన్నంగా ఉంటుందో?

Advertisement

అయితే, అంతగా భయపడాల్సిన పనిలేదంటోంది ఐఎమ్‌డి. ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పటికీ.. దేశంలో ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పడం కాస్త ఊరట.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×