Voter Awareness: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత రావు కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మొదటి విడతలో పోలింగ్ జరిగే 6 మండలాల్లో శుక్రవారం ఉదయం ఓటు హక్కు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మండల కేంద్రాల్లో మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. కళాకారుల చేత ఓటు హక్కుపై ఓటర్లకు అర్థం అయ్యేలా ప్రదర్శనలు ఇచ్చారు. జిల్లాలో మొదటి విడతలో ఆలేరు , ఆత్మకూరు, బొమ్మలరామారం,రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో ఈ నెల 11 న పోలింగ్ జరుగుతుంది. ఈ 6 మండలాల్లోని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి కలెక్టర్ అన్నారు.
గ్రామాల్లో ఎన్నికల్లో నిలబడే వ్యక్తులు ఎలాంటి ప్రలోభాలకి గురిచేసినా ఎవరు తమ ఓటును అమ్ముకోకుండా నిజాయితీతో గ్రామాల అభివృద్ధి కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలి సూచించారు. నేను ఓటు వేయకపోతే ఏమౌతుంది నా ఒక్క ఓటు తో ఏమైనా మార్పు వస్తుందా? అని ఏ ఒక్క ఓటరు కూడా అనుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరారు. ఒక్క ఓటుతో గెలుపు ఓటములు నిర్ణయించబడతాయన్నారు.
Also Read: Minister Komatireddy: సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి కోమటిరెడ్డి.. గ్లోబల్ సమ్మిట్కు రావాలని పిలుపు
బొమ్మల రామారం మండల కేంద్రంలో మహిళల చేత నేను నా యొక్క ఓటును డబ్బుకి, బిర్యానీకి ,మద్యానికి కానీ, కులం కోసం కానీ, మతం కోసం కానీ అమ్ముకోకుండా నిజాయితీ గల గ్రామ అభివృద్ధికి పాటుపడే వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకుంటానని కలెక్టర్ ప్రమాణం చేయించారు.