E-Paper
Advertisement

Mallareddy: శివుని అనుగ్రహంతోనే ఎల్లంపేట మున్సిపాలిటీ కైవసం : మాజీ మంత్రి మల్లారెడ్డి

Mallareddy: శివుని అనుగ్రహంతోనే ఎల్లంపేట మున్సిపాలిటీ కైవసం : మాజీ మంత్రి మల్లారెడ్డి
Advertisement

Mallareddy: అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపేటతో పాటు మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలను చేజిక్కించుకునేందుకు పలు కుటిల ప్రయత్నాలు చేసిందని మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి (Mallareddy) ఆరోపించారు. ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన మాట్లాడారు. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని మల్లారెడ్డి విమర్శించారు. అయినప్పటికీ శివుడి అనుగ్రహం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో ఎల్లంపేట, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుందని తెలిపారు. ఈ ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ మద్దతు కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు.

Also Read: Jagtial BJP: బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి.. కారణం ఏంటంటే.?

మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ ఆధిపత్యం

Advertisement

ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్‌గా శ్రీదేవి, వైస్ చైర్మన్‌గా బీజేపీకి చెందిన మేకల రజిత ఎన్నిక కావడం ద్వారా మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ ఆధిపత్యం నిలిచిందన్నారు. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్‌ఎస్ విజయాన్ని అడ్డుకోలేకపోయిందని ఆయన స్పష్టం చేశారు. ఎల్లంపేట మున్సిపాలిటీని రాష్ట్రంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సమిష్టిగా కృషి చేస్తారని మల్లారెడ్డి పేర్కొన్నారు.

Also Read: Kadiyam Srihari: ఘనపూర్‌లో గెలిచిన కౌన్సిలర్లకు అండగా ఉంటూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తాం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×