Mallareddy: అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపేటతో పాటు మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలను చేజిక్కించుకునేందుకు పలు కుటిల ప్రయత్నాలు చేసిందని మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి (Mallareddy) ఆరోపించారు. ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన మాట్లాడారు. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని మల్లారెడ్డి విమర్శించారు. అయినప్పటికీ శివుడి అనుగ్రహం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో ఎల్లంపేట, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుందని తెలిపారు. ఈ ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ మద్దతు కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు.
Also Read: Jagtial BJP: బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి.. కారణం ఏంటంటే.?
ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్గా శ్రీదేవి, వైస్ చైర్మన్గా బీజేపీకి చెందిన మేకల రజిత ఎన్నిక కావడం ద్వారా మున్సిపాలిటీపై బీఆర్ఎస్ ఆధిపత్యం నిలిచిందన్నారు. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేకపోయిందని ఆయన స్పష్టం చేశారు. ఎల్లంపేట మున్సిపాలిటీని రాష్ట్రంలో నంబర్ వన్గా తీర్చిదిద్దేందుకు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సమిష్టిగా కృషి చేస్తారని మల్లారెడ్డి పేర్కొన్నారు.