E-Paper
Advertisement

Korutla Bus Stand incident: బుర్కా వేసుకుని బస్సెక్కిన యువకుడు.. మహిళల మధ్య కూర్చుని ఫోన్ మాట్లాడటంతో..

Korutla Bus Stand incident: బుర్కా వేసుకుని బస్సెక్కిన యువకుడు..  మహిళల మధ్య కూర్చుని ఫోన్ మాట్లాడటంతో..

Korutla Bus Stand incident: జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో చోటుచేసుకున్న ఓ వింత ఘ‌ట‌న స్థానికంగా కలకలం సృష్టించింది. ఒక యువకుడు బుర్కా ధరించి బస్సులో మహిళల మధ్య కూర్చుని ప్రయాణించేందుకు ప్రయత్నించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆ వ్యక్తి తన ఫోన్‌కు వచ్చిన కాల్ ఎత్తి మాట్లాడుతుండగా అసలు విషయం బయటపడింది. బుర్కా లోపల నుంచి మగ గొంతు వినిపించడంతో అప్రమత్తమైన ప్రయాణికులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వెంటనే ఆర్టీసీ సిబ్బందికి సమాచారాన్ని అందించారు.

సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని విచారించారు. బుర్కా ఎందుకు ధరించావని వారు అడిగిన ప్రశ్నలకు ఆ యువకుడు పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. అధికారులు నిలదీస్తున్నా ఏ మాత్రం భయం లేకుండా నవ్వుతూ సమాధానాలను దాటవేయడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. అతని ప్రవర్తన వింతగా ఉండటంతో ఏదైనా నేరపూరిత ఆలోచనతో ఇలా చేశాడా లేక ఉద్దేశపూర్వకంగానే మహిళా ప్రయాణికులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని గమనించిన సిబ్బంది తదుపరి విచారణ కోసం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సాధారణంగా మహిళలు మాత్రమే ఉండే సీట్లలో బుర్కా ధరించిన వ్యక్తి అనుమానాస్పదంగా కూర్చోవడంతో తోటి ప్రయాణికులకు మొదట అనుమానం కలగలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అడ్డుపెట్టుకుని ఇలా బుర్కా వేషంలో ప్రయాణించేందుకు సాహసించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళలకు మాత్రమే వర్తించే ఈ ఉచిత ప్రయాణ వెసులుబాటును అక్రమంగా పొందాలనే ఆలోచనతో ఈ వేషధారణ వేసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే కేవలం ప్రయాణం కోసమే కాకుండా మహిళల మధ్యకు చేరి దొంగతనాలకు పాల్పడే ముఠాలో సభ్యుడా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి ఘటనలు జరగడం పట్ల మహిళా ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని అతని నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు. గతంలో ఇటువంటి పనులు ఏవైనా చేశాడా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బస్టాండ్‌లు బస్సుల వంటి రద్దీ ప్రదేశాలలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

Read Also: Viral Video: ఇదెక్కడి పైత్యం.. బతికున్న భర్తను తల వరకూ పూడ్చి.. నెత్తిన పాలాభిషేకం చేసిన భార్య

Related News

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

Big Stories

×