E-Paper
Advertisement

Rahul Gandhi: చైనా రోబోలు పట్టుకొచ్చి.. మనవని చెప్తారా? కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: చైనా రోబోలు పట్టుకొచ్చి.. మనవని చెప్తారా? కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi: కృత్రిమ మేధ (AI) విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యావత్ ప్రపంచం ముందు భారతదేశాన్ని అపహాస్యం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. దేశ రాజధాని దిల్లీ (Delhi)లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో చైనా రోబోట్లను మన సొంత రోబోలుగా చిత్రీకరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే విషయంపై చైనా మీడియా భారత దేశాన్ని ఎగతాళి చేసిందని పేర్కొన్నారు. ఇది దేశానికే సిగ్గుచేటని ఎక్స్ వేదికగా ఆరోపించారు.

కేంద్రం మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఇదే అబద్దంలో మునిగి తేలుతుండటం మరింత సిగ్గుచేటని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భారత సమ్మిట్ లో చైనా రోబ్ లను ప్రచారం చేయడాన్ని ఈ సందర్భంగా రాహుల్ తీవ్రంగా తప్పుబట్టారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా చేసిన పోస్టును రీ-ట్వీట్ చేస్తూ.. రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Advertisement

చైనా రోబోల వాడకం గురించి ప్రస్తావిస్తూ.. అంతముందు కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టింది. ‘మోదీ ప్రభుత్వం దేశ ప్రతిష్టకు కోలుకోలేని నష్టం కలిగించింది. వారు ఏఐ సమ్మిట్ అపహాస్యంగా మార్చారు. మనకు ఉన్న డేటా శక్తితో భారత్ ప్రపంచ శక్తిగా ఎదగగలదు’ అంటూ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

Advertisement

భారత్ కు చెందిన గల్గోటియా విశ్వవిద్యాలయం (Galgotia University) దిల్లీలోని ఏఐ సమ్మిట్ లో పాల్గొని ‘ఒరియన్’ లేబుల్ కలిగిన ఓ రోబోటిక్ డాగ్ ను ప్రదర్శించింది. అది అచ్చం చైనాకు చెందిన రోబోటిక్ డాగ్ ఆకృతిలో ఉండటంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. ఇది చైనాలో ఆవిష్కరించబడిన ‘Unitree Go2’ రొబోటిక్ శ్రేణికి చెందినది విమర్శకులు ఆరోపిస్తున్నారు.

Also Read: Viral Video: ఇదెక్కడి పైత్యం.. బతికున్న భర్తను తల వరకూ పూడ్చి.. నెత్తిన పాలాభిషేకం చేసిన భార్య

అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఏఐ సమ్మిట్ ఎక్స్‌పోలో ఉన్న గల్గోటియా యూనివర్శిటీ స్టాల్ ను వెంటనే తొలగించాలని నిర్వాహకులు ఆదేశించినట్లు సమాచారం. తద్వారా ఈ వివాదానికి ముంగింపు పలికించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

Also Read: International Fleet Review – 2026: విశాఖలో విశ్వ నౌకల వేడుక.. పాల్గొన్న రాష్ట్రపతి, సీఎం చంద్రబాబు.. 71 యుద్ధ నౌకలతో..

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×