E-Paper
Advertisement

Rahul Gandhi: చైనా రోబోలు పట్టుకొచ్చి.. మనవని చెప్తారా? కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: చైనా రోబోలు పట్టుకొచ్చి.. మనవని చెప్తారా? కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: కృత్రిమ మేధ (AI) విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యావత్ ప్రపంచం ముందు భారతదేశాన్ని అపహాస్యం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. దేశ రాజధాని దిల్లీ (Delhi)లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో చైనా రోబోట్లను మన సొంత రోబోలుగా చిత్రీకరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే విషయంపై చైనా మీడియా భారత దేశాన్ని ఎగతాళి చేసిందని పేర్కొన్నారు. ఇది దేశానికే సిగ్గుచేటని ఎక్స్ వేదికగా ఆరోపించారు.

కేంద్రం మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఇదే అబద్దంలో మునిగి తేలుతుండటం మరింత సిగ్గుచేటని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భారత సమ్మిట్ లో చైనా రోబ్ లను ప్రచారం చేయడాన్ని ఈ సందర్భంగా రాహుల్ తీవ్రంగా తప్పుబట్టారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా చేసిన పోస్టును రీ-ట్వీట్ చేస్తూ.. రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చైనా రోబోల వాడకం గురించి ప్రస్తావిస్తూ.. అంతముందు కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టింది. ‘మోదీ ప్రభుత్వం దేశ ప్రతిష్టకు కోలుకోలేని నష్టం కలిగించింది. వారు ఏఐ సమ్మిట్ అపహాస్యంగా మార్చారు. మనకు ఉన్న డేటా శక్తితో భారత్ ప్రపంచ శక్తిగా ఎదగగలదు’ అంటూ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

భారత్ కు చెందిన గల్గోటియా విశ్వవిద్యాలయం (Galgotia University) దిల్లీలోని ఏఐ సమ్మిట్ లో పాల్గొని ‘ఒరియన్’ లేబుల్ కలిగిన ఓ రోబోటిక్ డాగ్ ను ప్రదర్శించింది. అది అచ్చం చైనాకు చెందిన రోబోటిక్ డాగ్ ఆకృతిలో ఉండటంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. ఇది చైనాలో ఆవిష్కరించబడిన ‘Unitree Go2’ రొబోటిక్ శ్రేణికి చెందినది విమర్శకులు ఆరోపిస్తున్నారు.

Also Read: Viral Video: ఇదెక్కడి పైత్యం.. బతికున్న భర్తను తల వరకూ పూడ్చి.. నెత్తిన పాలాభిషేకం చేసిన భార్య

అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఏఐ సమ్మిట్ ఎక్స్‌పోలో ఉన్న గల్గోటియా యూనివర్శిటీ స్టాల్ ను వెంటనే తొలగించాలని నిర్వాహకులు ఆదేశించినట్లు సమాచారం. తద్వారా ఈ వివాదానికి ముంగింపు పలికించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

Also Read: International Fleet Review – 2026: విశాఖలో విశ్వ నౌకల వేడుక.. పాల్గొన్న రాష్ట్రపతి, సీఎం చంద్రబాబు.. 71 యుద్ధ నౌకలతో..

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×