E-Paper
Advertisement

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌పై షర్మిల కామెంట్స్.. ఆయన స్వయంగా వచ్చి చెప్పారు

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌పై షర్మిల కామెంట్స్.. ఆయన స్వయంగా వచ్చి చెప్పారు
Advertisement

Phone Tapping:  తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ఓ కుదుపు కుదిపేస్తోందా? ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విపక్షాల మెడకు చుట్టుకుందా? ఈ వ్యవహారంలో వైస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ అయినట్టు వార్తల వెనుక ఏం జరుగుతోంది? ఏపీ, తెలంగాణలో దాదాపు 1000 మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయా? అవుననే సమాధానాలు వస్తున్నాయి.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ వ్యవహారం లో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తొలి రోజు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు పేర్లు వెలుగులోకి రాగా,  ఇప్పుడు పవన్ కల్యాణ్, వైఎస్ షర్మిల పేర్లు సైతం బయటకు వచ్చాయి. ట్యాపింగ్ వ్యవహారంలో తీగలాడితే డొంక కదులుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

ఈ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నోరు విప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికీ నిజమన్నారు. అప్పటి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషనా?  అనేది తనకు తెలీదన్నారు. ఒక్కమాట అయితే ఆమె స్పష్టంగా చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్ ఎంతమంది మీద జరిగిందో తనకు తెలీదుగాని.., తనది, భర్త, బంధువుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్టు స్పష్టంగా తెలిసిందన్నారు. మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్న విషయాన్ని నిర్ధారించింది వైవీ సుబ్బారెడ్డి అని తేల్చేశారు. ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి ఓ రోజు హైదరాబాద్‌లోని మాఇంటికి వచ్చి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

Advertisement

ALSO READ: గూగుల్లో ఇలా సెర్చ్ చేయండి.. ఇంట్రెస్టింగ్ మేటర్ చెప్పిన సీఎం రేవంత్

ఆడియో క్లిప్పింగ్‌ను తనకు వినిపించారని వివరించారు షర్మిల. ఈ విషయం వైవీ సుబ్బారెడ్డి అంగీకరిస్తారా? లేదా అనేది తనకు తెలీదని, అనుమానమేనని తెలిపారు. ఎందుకంటే జగన్.. తన మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా సాయిరెడ్డి, సుబ్బారెడ్డిలను ఎలా ఒత్తిడి చేశారో? మీడియా ముందు ఎలా అబద్దాలు చెప్పించారో సాయిరెడ్డి స్వయంగా వెల్లడించారని తెలిపారు.

మరోవైపు ఇదే వ్యవహారంపై సిట్ ముందు బాధితులు వస్తున్నారు. వారి నుంచి వాంగ్మూలాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల సమయంలో తనకు ఎదురైన అనుభవాలను ఆయన దర్యాప్తు అధికారుల దృష్టికి తెచ్చారు.

కేవలం కాంగ్రెస్ నేతలకు చెందినవే కాకుండా బీజేపీ, టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిన విషయాన్ని మీడియా ముందు చెప్పుకొచ్చారు. కేవలం రాజకీయ నేతలే కాకుండా వ్యాపారవేత్తలు, ఉద్యోగుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. వారిని సైతం విచారించేందుకు సిద్ధమయ్యింది సిట్.

దీంతో బీఆర్ఎస్, వైసీపీ కీలక నేతలకు వణుకు మొదలైంది. అసలే అధికారం పోయి ఇబ్బందిపడుతున్న నేతలను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పుండు మీద కారం మాదిరిగా మారింది. దీని గురించి కొత్త కొత్త విషయాలు రావడం వారికి మింగుడు పడడం లేదు.  రేపటి రోజున ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పేర్లు, బాధితులు సిట్ ముందుకు వస్తారో చూడాలి.

 

 

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×