Fastag Scam | దేశంలో సైబర్ దొంగతనాలు, ఆన్లైన్ స్కామ్ల సంఖ్య రోజురోజకీ పెరుగిపోతోంది. సైబర్ మోసగాళ్లు పెట్టే ఆన్లైన్ లింక్లను ప్రజలు తెలిసీతెలియక నొక్కేస్తున్నారు. ఆ తరువాత వారి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులన్నీ మాయమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా నమోదవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ‘ఫాస్ట్టాగ్’ నెపంతో ఒక దుండగుడు ఏకంగా 2.4లక్షలు
Fastag Scam | దేశంలో సైబర్ దొంగతనాలు, ఆన్లైన్ స్కామ్ల సంఖ్య రోజురోజకీ పెరుగిపోతోంది. సైబర్ మోసగాళ్లు పెట్టే ఆన్లైన్ లింక్లను ప్రజలు తెలిసీతెలియక నొక్కేస్తున్నారు. ఆ తరువాత వారి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులన్నీ మాయమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా నమోదవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ‘ఫాస్ట్టాగ్’ నెపంతో ఒక దుండగుడు ఏకంగా 2.4లక్షలు దోచేశాడు.
వివరాల్లోకి వెళితే.. ముంబై మహానగరంలోని నల్లాసోపారా ప్రాంతానికి చెందిన ఓ 47ఏళ్ల వ్యక్తి.. తన ఫాస్టాగ్ అకౌంట్ను రీఛార్జ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఏదో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమస్యను పరిష్కరించడానకి గూగుల్లో సెర్చ్ చేశాడు. అక్కడ ఒక ఫోన్ నెంబర్ దొరికింది. ఆ నెంబర్కు కాల్ చేసి, తన ఫాస్టాగ్ రిఛార్జ్ కావడంలేదని..
సమస్య గురించి చెప్పాడు. కానీ అవతలి వ్యక్తి ఒక మోసగాడని ఆ సమయంలో అతనికి తెలియదు.
ఆ తరువాత ఆ మోసగాడు ఫాస్టాగ్ సమస్య పరిష్కారం కావాలంటే వెంటనే ఓ యాప్ డౌన్లోడ్ చేయమన్నాడు. బాధితుడు ఆ యాప్ డౌన్లోడ్ చేసి.. అతని బ్యాంక్ వివరాలు ఆ యాప్లో నింపాడు. ఇది జరిగిన ఒక్క నిమిషం లోపే బాధితుడి ఫోన్కి వరుసగా 6 మెసేజ్లు వచ్చాయి. అతని బ్యాంక్ అకౌంట్ నుంచి 6 ట్రాన్సాక్షన్స్తో మొత్తం రూ. 2.4లక్షలు ఖాళీ అయ్యాయి. ఇది చూసిన బాధితుడు మళ్లీ అదే ఫోన్ చేయాలని ప్రయత్నించాడు. కానీ అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది.
ఏం చేయాలో తోచని స్థితిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఇంతవరకు ఆ సైబర్ దొంగని పట్టుకోలేకపోయారు.
ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగకుండా ఉండాలంటే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ మెయిల్స్, మెసేజస్లలో వచ్చే ఆన్లైన్ లింక్లను ఓపెన్ చేయకూడదు. వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ చెప్పకూడదు. ముఖ్యంగా తెలియని వారికి ఈ వివరాలు ఇవ్వకూడదు. ఏ బ్యాంకు, లేదా ఆన్లైన్ లావాదేవి సంస్థ వ్యక్తిగత వివరాలు అడగదు. అలా అడిగితే ఆ వ్యక్తి ఓ దుండగుడని అర్థం.