E-Paper
Advertisement

India Flights: వెంటాడుతున్న భయం.. ఆ నగరాలకు విమాన రాకపోకలు రద్దు

India Flights: వెంటాడుతున్న భయం.. ఆ నగరాలకు విమాన రాకపోకలు రద్దు

India Flights: ఉత్తరాదిలో విమానాలు తిరుగుతున్నాయా? పౌర విమానయాన శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇ‌చ్చినా ఆలోచనలో పడ్డాయి కీలకమైన ఎయిర్ లైన్స్ సంస్థలు? రాత్రి సాంబా సెక్టార్‌లో పాకిస్తాన్ డ్రోన్లు రావడమే కారణమా? ఈ రోజు గమనించిన తర్వాత బుధవారం నుంచి నడపాలో లేదో నిర్ణయం తీసుకోనున్నాయా? అవుననే అంటున్నాయి ఎయిరిండియా, ఇండిగో విమాన సంస్థలు.

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు విమానయాన సంస్థ ఆలోచనలో పడ్డాయి. ఒకటి ఎయిరిండియా, మరొకటి ఇండిగో. గగనతల ఆంక్షలు, భద్రతా చర్యల నేపథ్యంలో ఈ రెండు సంస్థలు మే 13(నేటి వరకు) ఉత్తరాది, పశ్చిమ భారత్‌లోని దాదాపు ఏడు నగరాలకు విమాన కార్యకలాపాలను నిలిపివేశాయి. ఈ విషయాన్ని ఆయా సంస్థలు స్వయంగా వెల్లడించాయి.

సోమవారం ప్రధాని మోదీ ప్రసంగం, ఆ తర్వాత సాంబా సెక్టార్‌లోని దాయాది దేశానికి చెందని డ్రోన్లు రావడంతో ఎయిరిండియా, ఇండిగో సంస్థలు ఆలోచనలో పడ్డాయి. తమ సేవలను మంగళవారం రద్దు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు ఎయిరిండియా, ఇండిగో సంస్థ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాయి. జరుగుతున్న పరిణామాలు నేపథ్యంలో ప్రయాణికుల భద్రత తొలి ప్రాధాన్యంగా రాసుకొచ్చాయి.

జమ్మూ, అమృత్ సర్, చండీగఢ్‌, లెహ్, శ్రీనగర్, రాజ్‌కోట్‌కు మే 13న (మంగళవారం) రాకపోకలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఎయిరిండియా ఎనిమిది నగరాలకు విమానాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రయాణాలు సిద్ధం చేసుకున్నవారి పరిస్థితి అర్థం చేసుకోగలరని పేర్కొన్నాయి.

ALSO READ: ఆధార్ ఒక్కటే కాదు.. వాటితోనూ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు

జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించాయి. ప్రస్తుతం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపాయి. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే తెలియజేస్తామన్నారు. అలాగే ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేముందు విమానం స్టేటస్‌ మా వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో చెక్‌ చేసుకోగలరని తెలియజేశాయి. ప్రయాణికులకు సాయం అందించేందుకు నిత్యం అందుబాటులో ఉంటామని పేర్కొన్నాయి.

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా విమానాలు నడుపుకోవచ్చని పౌర విమానయాన శాఖ సోమవారం నోటమ్ జారీ చేసింది. ఉత్తరాది, పశ్చిమ వైపు 32 నగరాల్లో విమాన శాఖ విధించిన ఆంక్షలను ఎత్తేసింది. దీంతో విమానాలు పునఃప్రారంభం అవుతాయని ప్రయాణికులు, టూరిస్టులు భావించారు. అయితే మంగళవారం పరిస్థితి గమనించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ట్రావెలర్లు ఆలోచనలో పడ్డారు.

 

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×