E-Paper
Advertisement

Train Accident: లోకల్ ట్రైన్ నుంచి జారి పడి.. ఐదుగురు మృతి

Train Accident: లోకల్ ట్రైన్ నుంచి జారి పడి.. ఐదుగురు మృతి
Advertisement

Train Accident: ముంబైలోని లోకల్ ట్రైన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది.

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మిన‌స్‌కు వెళుతుండగా.. ముంబ్రా-దివా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ సంఘటన సమయంలో, పుష్పక్ ఎక్స్ ప్రెస్-కసారా లోకల్ ఒకదానికొకటి దాటుతున్నాయి.

Advertisement

ముంబైలో విపరీతమైన రద్దీ కారణంగా.. లోకల్ ట్రైన్ ప్రయాణికులు ఫుట్ హబోర్డింగ్‌లో ప్రయాణించడం సర్వసాధారణం. అయితే ఈరోజు సోమవారం కావడంతో మరింత రద్దీ ఏర్పడింది. ప్యాసింజర్లు డోర్లకు వేలాడుతూ ప్రయాణించారు. ట్రైన్ ప్రారంభమైన కొద్ది సేపటికి.. కదులుతున్న రైలు నుంచి ప్రయాణికులు అదుపుతప్పి జారి కిందపడ్డారు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మందికి తీవ్రగాయాలు అయ్యాయు. మృతుల్లో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం.. సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టినట్టు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

కాగా ఇలాంటి ఘటనలు తరుచూ.. ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో.. 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు.

Also Read: కేదార్నాథ్, సోమనాథ్, కోణార్క్ హంపి.. ఆ ఆలయాలు విశిష్టత ఏంటి? బడ్జెట్ ప్లాన్ ఎంతంటే?

ఇలాంటి ఘటనలు తరచుగా జరగడం, లోకల్ రైళ్లలో భద్రతా చర్యలు తక్కువగా ఉండడం.. ప్రజలలో ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం.. తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×