E-Paper
Advertisement

Goa Tour: కేవలం రూ.13వేలతో సముద్రంలో విహారయాత్ర.. బుకింగ్స్ మొదలయ్యాయి

Goa Tour: కేవలం రూ.13వేలతో సముద్రంలో విహారయాత్ర.. బుకింగ్స్ మొదలయ్యాయి

Goa Tour: గోవా పేరు వినగానే మనసు సముద్రపు అలల్లా ఉప్పొంగిపోతుంది. తెల్లటి ఇసుక బీచ్‌లు, నైట్ లైఫ్, సంగీతం, వేడుకలు, కళ్ళ ముందే సినిమా సన్నివేశంలా నిలుస్తాయి. కానీ సముద్రాన్ని తీరంలోనుండి చూడటం ఒక అనుభవమైతే, అలల మధ్యలో ప్రయాణిస్తూ గోవాను చూడటం మరో ప్రపంచమే. భారీ తెల్లటి క్రూయిజ్ నౌకపై అడుగుపెట్టిన క్షణం నుంచే జీవితం కొత్త రంగుల్లో మెరుస్తుంది. నౌక మెల్లగా కదులుతూ అలలను చీల్చుకుంటూ ముందుకు వెళ్లే దృశ్యం, పైన డెక్ మీద నిలబడి ముఖాన్ని తాకే సముద్రపు గాలి, చుట్టూ నీలిరంగుతో మెరిసిపోతున్న నీరు… ఆ క్షణాలు మనసును పూర్తిగా మైమరపిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో ఆకాశం నారింజ రంగుతో నిండిపోతూ అదే రంగు సముద్రంపై ప్రతిబింబించినప్పుడు ఆ దృశ్యాన్ని చూస్తూ చేతిలో డ్రింక్ పట్టుకుని నిలబడి ఉంటే, మాటల్లో చెప్పలేని మాయలోకి మనసు జారిపోతుంది.

క్రూయిజ్ యాత్ర జీవతంలో గుర్తుండిపోయే జ్ఞాపకం

రాత్రి వెలుతురు ప్రారంభమయ్యే సమయానికి అసలు క్రూయిజ్ దాని మ్యాజిక్ రూపం తెరపెడుతుంది. సంగీతం ఉరుముతుంది, రంగుల లైట్లు ఆకాశాన్నే ఉత్సవంలా మార్చేస్తాయి, డ్యాన్స్ షోలు మొదలవుతాయి, లైవ్ మ్యూజిక్ బ్యాండ్స్ వేదికను కదిలిస్తాయి, నక్షత్రాలు సముద్రం మీద జారుతున్న వెండి బొమ్మల్లా మెరిసిపోతాయి. ఈ సమయంలో సముద్రపు నిశ్శబ్దం, సంగీతం కలిసిపోయి మనసు అందమైన కలల లోకంలోకి వెళ్లిపోతుంది. కపుల్స్ ఒకరికొకరు చేతులు పట్టుకుని అలలను చూస్తూ నవ్వుకుంటూ గడిపే క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. పిల్లలు గేమ్ ఏరియాలో ఆడుకుంటూ ఆనందపడుతుంటే, పెద్దలు లౌంజ్‌లో రిలాక్స్ అవుతారు, యువత పార్టీ నైట్‌లో ఎనర్జీతో డ్యాన్స్ చేస్తుంటారు. అందరికి ప్రత్యేకమైన సంతోషంగా మారుతుంది.

Also Read: Samsung New 5G Phone: కేవలం రూ.13వేలలోపే శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్.. అదికూడా 7000mAh బ్యాటరీతో..

కళ్లు తెరిచే సరికి గొప్ప అనుభూతి

ఉదయం నిద్రలేచిన వెంటనే కిటికీ ఓపెన్ చేస్తే నీలిరంగు అలలు బంగారు వెలుతురులో తళతళా మెరిసిపోతూ కళ్లను ఆనందాన్ని కలిగిస్తాయి. అలల శబ్దం నెమ్మదిగా చెవుల్లో మోగుతుంటే ప్రపంచంలో ఇంత ప్రశాంతమైన క్షణం ఇంకెక్కడ ఉంటుంది అని అనిపిస్తుంది. క్రూయిజ్ గోవా తీరానికి దగ్గరగా వచ్చినప్పుడు బంగారు రంగు ఇసుక తీరాలు దూరం నుంచి కనిపించడం మనసులో అసూయ కలిగించేంత అందంగా ఉంటుంది. క్రూయిజ్ ప్యాకేజీలోనే గోవాలోని ప్రసిద్ధ చర్చిలు, బీచ్‌లు, అడ్వెంచర్ గేమ్స్ అయిన కయాకింగ్, బనానా రైడ్, జెట్ స్కీ అనుభవాలు కూడా ఉంటాయి. జీవితాన్ని ఆనందంతో నింపే అన్ని అనుభూతులు ఒకే ప్రయాణంలో కలిసి వస్తాయి.

క్రూయిజ్ ప్యాకేజీ ధర ఎంతంటే?

ఈ మొత్తం అనుభవాన్ని అందించే గోవా క్రూయిజ్ ప్యాకేజీ ధర రూ.12577 నుండి ప్రారంభమవుతోంది. ఈ మొత్తంలో భోజనం, డ్రింక్స్, షోలు, వినోద కార్యక్రమాలు, గదులు, క్రూయిజ్ టూర్, గోవా లోకల్ టూర్స్ అన్నీ కలుపుకుని ఇస్తారు. అదనపు ఖర్చు కోసం టెక్షన్ పడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ నెల నుండి అధికారిక సైలింగ్స్ (Sailing) ప్రారంభం కానున్నాయి, నూతన సంవత్సర సీజన్ దగ్గర్లోనే ఉండటంతో స్లాట్లు వేగంగా ఫుల్ అవుతున్నాయి, అందుకే ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. బుకింగ్ కోసం Cordelia Cruises అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా రిజర్వేషన్ చేసుకోవచ్చు, లేదా మీకు తెలిసినన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా సహాయం పొందవచ్చు. బుకింగ్ వివరాలు, తేదీలు, కేబిన్ ఎంపికలు అన్నీ అక్కడే అందుబాటులో ఉంటాయి.

అలల మధ్య ఆనందం

జీవితంలో ఒకసారి తప్పక అనుభవించాల్సిన జ్ఞాపకం అంటే ఇది. సముద్రం మధ్యలో నిలబడి అలలను చూస్తూ మనసు కొత్తగా పుడుతుంది. ప్రపంచం ఎంత అందంగా ఉందో మనం తిరిగి గుర్తుకుంటాం, సంతోషం అంటే ఏమిటో మనసు మళ్ళీ తెలుసుకుంటుంది. నవ్వులు, సంగీతం, అలలు, వెలుగులు, గాలి వీటన్నింటి కలయికే గోవా క్రూయిజ్.

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×