E-Paper
Advertisement

GPS Spoofing: ఎయిర్ పోర్టులపై కొత్త కుట్ర, అదే జరిగితే ప్రయాణీకుల ప్రాణాలు గాల్లోనే..

GPS Spoofing: ఎయిర్ పోర్టులపై కొత్త కుట్ర, అదే జరిగితే ప్రయాణీకుల ప్రాణాలు గాల్లోనే..

GPS Spoofing Airports: గత కొద్ది నెలలుగా దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టుల మీద సరికొత్త కుట్రలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌ కతా, అమృత్‌ సర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాలతో సహా ప్రధాన భారతీయ విమానాశ్రయాల సమీపంలో జీపీఎస్ స్పూఫింగ్ కోసం కొంత మంది దుండగులు ప్రయత్నించారు.  వాటిని ఎయిర్ పోర్టు రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. రన్‌ వేల మీదకి వచ్చే విమానాల కోసం GPS ఆధారిత ల్యాండింగ్ విధానాలను ఉపయోగిస్తారు. ఆగంతకులు ఆ వ్యవస్థకు తప్పుడు సంకేతాలు ఇచ్చి, నావిగేషన్ వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు.

జీపీఎస్ స్పూఫింగ్ పై కేంద్రం కీలక ప్రకటన

జీపీఎస్ స్పూఫింగ్ కు సంబంధించి పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. “కొన్ని విమానాలు న్యూఢిల్లీలోని IGIA పరిసరాల్లో GPS ఆధారిత ల్యాండింగ్ విధానాలను ఉపయోగిస్తున్నప్పుడు GPS స్పూఫింగ్ కు కొంత మంది పాల్పడినట్లు రిపోర్టు వచ్చింది. రన్ వే 10కి విమానాలు సమీపిస్తున్నప్పుడు జీపీఎస్ స్పూఫింగ్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ స్ఫూపింగ్ విమానాల కదలికలపై ఎటువంటి ప్రభావం చూపించలేదు. వీటిని ఎదుర్కొనేందుకు రన్‌ వే చివరిలో ఉన్న సంప్రదాయ నావిగేషన్ వ్యవస్ధలు సాయం చేశాయి” అని వివరించారు. ప్రభుత్వం వైర్‌ లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ (WMO)ని స్పూఫింగ్ కు ఎవరు పాల్పడుతున్నారో గుర్తించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. కోల్‌కతా, అమృత్‌సర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల నుండి జీపీఎస్ స్పూఫింగ్ నివేదికలు అందుతున్నట్లు నాయుడు చెప్పారు.

స్పూఫింగ్ ఎందుకు ప్రమాదకరం అంటే?   

ఎయిర్ పోర్టు సమీపం నుంచి కొంత మంది ఫేక్ GPS సిగ్నల్స్ ను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తప్పుడు నావిగేషన్ డేటా ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, విమానయాన సంస్థలు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. సిస్టమ్ ఫెయిల్యూర్ జరుగుతుంది. ఆ తర్వాత విమానాలు ఫేక్ సంకేతాల అనుసరించి ఘోర ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. GPS స్పూఫింగ్ ప్రయత్నాలు పైలట్లు, ఆన్‌ బోర్డ్ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. తప్పుడు హెచ్చరికలు, సూచనలు విమానాల క్రాష్ కు కారణం అయ్యే అవకాశం ఉంటుంది.

GPS స్పూఫింగ్‌పై  DGCA కీలక సూచన   

GPS స్పూఫింగ్‌ వ్యవహారలపై DGCA కీలక సూచన చేసింది. స్పూఫింగ్ ఘటన జరిగిన 10 నిమిషాల్లోపు నివేదించాలని ఏవియేషన్ వాచ్‌ డాగ్  పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు (ATC)కు సూచించింది. గ్రౌండ్ బేస్డ్ నావిగేషన్, సర్వైలెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో కూడిన మినిమమ్ ఆపరేటింగ్ నెట్‌ వర్క్ (MON)ను ఉపయోగించుకోవాలన్నది. ప్రస్తుతం  విమానయాన రంగానికి ప్రపంచ సైబర్ భద్రతా ముప్పు, రాన్సమ్‌ వేర్, మాల్వేర్ రూపంలో ఉన్నట్లు వెల్లడించింది. వీటిని ఎదుర్కొనేందుకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐటీ నెట్‌ వర్క్‌ ప్రత్యేక సైబర్ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.  సైబర్ ముప్పు, స్వభావం, రకం మారుతున్న కొద్దీ, కొత్త రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

Read Also: ఎయిర్‌ బస్ A320 విమానాల రీకాల్.. కారణం ఏంటంటే?

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×