E-Paper
Advertisement

Vande Bharat Sleeper Train: అయ్య బాబోయ్.. వందేభారత్ స్లీపర్ కోచ్ ధర అంత ఉంటుందా?

Vande Bharat Sleeper Train: అయ్య బాబోయ్.. వందేభారత్ స్లీపర్ కోచ్ ధర అంత ఉంటుందా?

Vande Bharat Sleeper Train: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించబోతున్నాయి. హౌరా- గౌహతి మార్గంలో దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టడానికి ఇండియన్ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సెమీ హై స్పీడ్ రైలు సేవను ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) రైల్వే నడపబోతోంది. ICF టెక్నాలజీ సాయంతో BEML ఈ రైలును నిర్మించింది. ఆరెంజ్, గ్రే కలర్ లో ఉన్న ఈ రైలు గంటకు 180 కిలో మీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీయనుంది.

వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ

రైల్వే శాఖ వందేభారత్ ట్రైన్ సెట్స్ తయారీ వేగవంతం చేయాలని BEMLకు సూచించింది. ప్రస్తుతం 200 వందే భారత్ రైళ్లు తయారవుతున్నాయి. 2026లో ఇండియన్ రైల్వే దేశ వ్యాప్తంగా 12 వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

వందేభారత్ స్లీపర్ కోచ్ తయారీ ఖర్చు ఎంత?   

వందేభారత్ స్లీపర్ రైలు త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ రైళ్లపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ రైళ్ల తయారీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి ఒక్కో కోచ్ ధర దాదాపు రూ. 8 నుండి రూ. 8.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక్కో రైలు కోచ్ ధర సాధారణంగా రూ. 10 నుంచి రూ. 10.5 కోట్ల మధ్య ఉండే మెట్రో కోచ్‌ల ధర కంటే తక్కువగా ఉంటుందన్నారు. ఈ కోచ్‌లను ICF(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) టెక్నాలజీని ఉపయోగించి BHEL అభివృద్ధి చేసింది. BHEL 16 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేస్తుంది.

Read Also: 2026లో మార్కెట్లో అడుగు పెట్టబోతున్న.. లో కాస్ట్ యూత్ అట్రాక్షన్ బైక్స్!

వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి కీలక విషయాలు

⦿ మొత్తం కోచ్‌లు 16 ఉంటాయి. 11 కోచ్‌లు 3 టైర్, 4 కోచ్‌లు 2 టైర్, 1 కోచ్ 1AC ఉంటుంది.

⦿ ఒక్కో స్లీపర్ రైలులో ప్రయాణీకుల సామర్థ్యం 823 ఉంటుంది. 3 టైర్ లో 611 మంది, 2 టైర్ లో 188 మంది, 1 ఏసీలో 24 మంది ప్రయాణీకులు ఉంటారు.

⦿ గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణం చేస్తుంది.

⦿ మెరుగైన కుషనింగ్‌తో ఎర్గోనామిక్‌గా రూపొందించిన బెర్త్‌లు మంచి కంఫర్ట్ ను అందించనున్నాయి.

⦿ ఈజీ రాకపోకల కోసం వెస్టిబ్యూల్స్‌ తో ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి.

⦿ సుపీరియర్ సస్పెన్షన్, తక్కువ సౌండ్ తో మెరుగైన ప్రయాణ అనుభవం లభిస్తుంది.

⦿ కవచ్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ సిస్టమ్ తీసుకొచ్చారు.

⦿ అధునాతన కంట్రోల్, భద్రతా వ్యవస్థలతో లోకో పైలెట్ క్యాబిన్ ఏర్పాటు చేశారు.

Read Also:  రైల్వే గుడ్ న్యూస్.. ఆ యాప్ లో టికెట్లు బుక్ చేస్తే 3% డిస్కౌంట్!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×