E-Paper
Advertisement

Hyderabad News: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు.. శనివారం నుంచి అమలు

Hyderabad News: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు.. శనివారం నుంచి అమలు
Advertisement

Hyderabad News: హైదరాబాద్ మెట్రో రైళ్లలో నిత్యం ప్రయాణించేవారికి ఊహించని శుభవార్త. మెట్రో రైలు ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఇది వరకు ప్రకటించింది యాజమాన్యం. తగ్గిన ఛార్జీలు శనివారం నుండి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రయాణికులపై చాలావరకు ఆర్థిక భారం తగ్గనుంది.ప్రయాణికులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

కొద్దిరోజుల కిందట హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచింది ఆ సంస్థ. మరి ఏమనుకుందో తెలీదుగానీ పెంచిన ఛార్జీలను సవరించింది. కొత్తగా సవరించిన ధరల ప్రకారం కనీస ఛార్జీ రూ.11, గరిష్ఠ ఛార్జీ రూ.69లుగా నిర్ధారించారు అధికారులు. తగ్గించిన ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి.

Advertisement

వివిధ దూరాలకు అనుగుణంగా ఛార్జీల తగ్గింపు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రెండు కిలోమీటర్ల వరకు ప్రయాణానికి అంతకుముందు రూ.12 ఛార్జీని శనివారం నుంచి రూ.11 లకు తగ్గించారు. రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరానికి 18 రూపాయల నుండి రూ.17 లకు తగ్గించారు. నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.30 బదులుగా రూ.28 ప్రస్తుతం ధరగా పేర్కొన్నారు.

ఇక ఆరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల మధ్య దూరానికి రూ.40 నుండి రూ.37లకు తగ్గించారు. తొమ్మిది నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు రూ.50లకు గాను రూ.47 చెల్లిస్తే సరిపోతుంది. పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్లకు రూ.55 నుంచి రూ.51కి తగ్గింది. పదిహేను నుంచి పద్దెనిమిది కిలోమీటర్లకు రూ.60 బదులు రూ.56 వసూలు చేయనున్నారు.

Advertisement

ALSO READ: వందే భారత్ స్లీపర్‌లో ప్రయాణానికి సిద్ధమా? ఆ విషయాలు తెలుసుకోండి?

పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్లకు రూ.66 నుంచి రూ.61 లకు ఛార్జీని తగ్గించారు. ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు రూ.70 కి బదులుగా రూ.65 తగ్గించారు. ఇరవై నాలుగు కిలోమీటర్లకు పైబడిన దూరానికి ప్రయాణిస్తే గరిష్ఠ ఛార్జీ రూ.75 ఉండేది. దాన్ని రూ.69కి తగ్గించారు. ఈ లెక్కన కనీస ఛార్జీ 11 రూపాయలు పేర్కొన్నారు. గరిష్ఠ ఛార్జీ 69 రూపాయలుగా ప్రస్తావంచారు.

 

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×