Vande Bharat Sleeper: భారతీయ రైల్వే సాంకేతికతలో మరో కీలకమైన మెట్టు ఎక్కింది. ఇప్పటికే ప్రజల మన్ననలు పొందిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన వందే భారత్ స్లీపర్ ట్రైన్ రూపంలో అందుబాటులోకి రాబోతుంది. వేగవంతమైనదిగా, హైసేఫ్టీ, హైకంఫర్ట్ ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఈ ట్రైన్ను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ట్రైన్ను ఎంచుకునే వారు ప్రయాణానికి ముందు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం.
ముందస్తు రిజర్వేషన్ తప్పనిసరి
వందే భారత్ ట్రైన్లు సర్వసాధారణంగా హైడిమాండ్లో ఉంటాయి. టికెట్లను చివరి నిమిషంలో పొందడం చాలా కష్టం. అందుకే మీరు మీ ప్రయాణ తేదీ నిర్ణయించుకున్న వెంటనే IRCTC వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవాలి. గ్రూప్ ట్రావెల్ అయినా, ఫ్యామిలీ ట్రిప్ అయినా, ముందస్తుగా ప్లాన్ చేసుకుంటే ప్రయాణం హాయిగా సాగుతుంది.
మోడ్రన్ సౌకర్యాలు
ఈ ట్రైన్లో అందుబాటులో ఉండే సౌకర్యాలు సాధారణ స్లీపర్ ట్రైన్లను మించిపోయే విధంగా ఉంటాయి. మృదువైన బర్త్లు, పిల్లోస్, కంబళ్లు, బెడ్ షీట్స్ లభ్యమవుతాయి. LED లైటింగ్, వ్యక్తిగత రీడింగ్ లాంపులు, USB ఛార్జింగ్ పాయింట్లు, బయో టాయిలెట్లు వంటి సదుపాయాలు రాత్రి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. ప్రతి కోచ్లో క్లాస్కు అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్ కల్పించబడుతుంది.
హైజీనిక్ ఆహారం.. కేటరింగ్ సేవలు
వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రయాణికులకు IRCTC ఆధ్వర్యంలో శుభ్రతతో కూడిన హైజీనిక్ ఆహారం అందించబడుతుంది. ప్రీమియం క్లాస్ ప్రయాణికులకు ఫుడ్ ఛార్జ్ టికెట్తో పాటు ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, డిన్నర్, టీ, నాన్వెజ్, వెజ్ ఆప్షన్లు మీ బుకింగ్ సమయంలో ఎంపిక చేసుకోవచ్చు. అప్డేటెడ్ మెనూలతో సేవ అందించడానికి రైల్వే కేటరింగ్ విభాగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
సురక్షిత ప్రయాణానికి అధునాతన భద్రతా చర్యలు
ప్రతి కోచ్లో సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్లు, ఫైర్ అలార్మ్ వ్యవస్థలు అమలు చేయబడ్డాయి. మహిళల కోసం ప్రత్యేకంగా రిజర్వ్డ్ కోచ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సెక్యూరిటీ గార్డులు, మరియు శీఘ్ర స్పందన బృందం ప్రయాణికుల భద్రతకు మోహరించబడతారు.
క్లాస్ ఎంపిక
వందే భారత్ స్లీపర్ ట్రైన్లో మూడు తరహాల క్లాసులు అందుబాటులో ఉంటాయి. 1AC, 2AC, మరియు 3AC. 1ACలో ప్రైవేట్ కాబిన్లు, స్లైడింగ్ డోర్లు ఉండగా, 2ACలో కర్టెన్తో కూడిన బర్త్లు ఉంటాయి. 3AC క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండి, హైక్వాలిటీ శీటింగ్ మరియు బెడ్డింగ్ అందిస్తుంది. మీ బడ్జెట్, ప్రయాణ దూరాన్ని బట్టి క్లాస్ను ఎంపిక చేసుకోవచ్చు.
పర్యావరణ అనుకూల ప్రయాణం
ఈ ట్రైన్ పూర్తిగా విద్యుత్ ఆధారంగా నడుస్తుంది. పర్యావరణానికి హాని కలిగించని బయో టాయిలెట్లు, శబ్దరహిత మొవ్మెంట్, కార్బన్ ఉద్గారాలను తగ్గించే టెక్నాలజీ వాడకంతో ఈ ట్రైన్ గ్రీన్ ట్రావెల్ను ప్రోత్సహిస్తుంది. ఇది భవిష్యత్ రైలు ప్రయాణానికి ఒక సరైన మార్గదర్శిగా నిలుస్తుంది.
Also Read: Skin Care: ముఖం తెల్లగా మెరిసిపోవాలా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
ముఖ్యమైన మార్గాలు
ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ ట్రైన్ తొలిదశగా 3 ప్రధాన మార్గాల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతుంది. ఢిల్లీ – ముంబై, బెంగళూరు – హైదరాబాద్, విశాఖపట్నం – చెన్నై మార్గాలకు స్లీపర్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి వస్తుండగా, ఈ మార్గాలలో ప్రయాణ సమయాన్ని దాదాపు 30% వరకు తగ్గించగల సామర్థ్యం ఈ ట్రైన్కు ఉంది.
హైటెక్ భద్రతా వ్యవస్థలు
అత్యాధునిక బ్రేకింగ్ సిస్టమ్, ఆంటీ-కోలిషన్ టెక్నాలజీ, GPS బేస్డ్ ట్రాకింగ్ వంటి సాంకేతికత వలన ప్రమాద నివారణ వ్యవస్థ మరింత బలంగా ఉంటుంది. ఫైర్ డిటెక్షన్, ఆటోమేటిక్ స్మోక్ అలారమ్ వంటి వ్యవస్థలు కూడా అమలులో ఉంటాయి.
వందే భారత్ స్లీపర్ ట్రైన్ భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక అడుగు. ఇది కేవలం హైస్పీడ్ ట్రైన్ మాత్రమే కాదు, నైట్ జర్నీకి కొత్త ఒరవడిని తీసుకొచ్చే ప్రయోగం. భారతదేశపు వివిధ ప్రాంతాలను వేగంగా, సురక్షితంగా, హాయిగా కలుపుతూ.. ఇది రైలు ప్రయాణంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మీరు టూరిస్టా అయినా, బిజినెస్ ట్రావెలర్ అయినా, ఈ ట్రైన్లోని ప్రతి ప్రయాణం ఒక ప్రత్యేక అనుభూతిగా మిగిలిపోతుంది.