E-Paper
Advertisement

Special Trains: దీపావళికి వైజాగ్ వెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!

Special Trains: దీపావళికి వైజాగ్ వెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!

Diwali Special Trains:

దీపావళి పండుగ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా తమ సొంత ప్రాంతాలకు వెళ్లేలా తగి చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ECoR ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అక్టోబర్ 18 (శనివారం) నుంచి 19 (ఆదివారం) వరకు ఈ రైళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది.

పండుగ రద్దీ నేపథ్యంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఇవే!

⦿ రైలు నెం 02811- భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ స్పెషల్

పండుగ నేపథ్యంలో భువనేశ్వర్, యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ రైలు శనివారం సాయంత్రం 7.15 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరుతుంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో  యశ్వంత్‌ పూర్ కు చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 02831- ధన్‌బాద్-భువనేశ్వర్ స్పెషల్

ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 18, 19 తేదీల్లో అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ధన్‌బాద్-భువనేశ్వర్ స్పెషల్ సాయంత్రం 4 గంటలకు ధన్‌బాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 02832-  భువనేశ్వర్-ధన్‌బాద్  స్పెషల్

ఈ రైలు అక్టోబర్ 18, 19 తేదీలలో రాత్రి 8.25 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ధన్‌బాద్ చేరుకుంటుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.

⦿ రైలు నెం. 08439-  పూరి-పాట్నా స్పెషల్

ఈ రైలు అక్టోబర్ 18న మధ్యాహ్నం 2.55 గంటలకు పూరి నుండి బయల్దేరుతుంది. ఆదివారం ఉదయం 10.45 గంటలకు పాట్నా చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో (రైలు నెం. 08440, పాట్నా-పూరి) స్పెషల్ అక్టోమర్ 19న మధ్యాహ్నం 1.30 గంటలకు పాట్నా నుంచి బయల్దేరి అక్టోబర్ 20న ఉదయం 9.45 గంటలకు పూరికి చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 08581- విశాఖపట్నం- SMVB (బెంగళూరు) స్పెషల్

ఈ రైలు అక్టోబర్ 19(ఆదివారం) మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. అక్టోబర్ 20(సోమవారం) మధ్యాహ్నం 12.45 గంటలకు బెంగళూరు SMVB చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 08580- చర్లపల్లి-విశాఖపట్నం స్పెషల్

ఈ రైలు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 18న(శనివారం) మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం నాడు విశాఖపట్నం చేరుకుంటుంది. పండుగకు హైదరాబాద్ నుంచి వైజాక్ కు వెళ్లాలనుకునే వారికి ఈ రైలు అనుకూలంగా ఉంటుంది.

Read Also: దీపావళికి కన్ఫార్మ్ టికెట్లు కావాలా? ఈ 5 టిప్స్ పాటించాల్సిందే!

ప్రయాణీకులకు ఇబ్బంది లేని,  సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను జరుపుకునేందుకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రజలు ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకొని హాయిగా జర్నీ చేయాలని సూచించారు.

Read Also:  పండుగ సీజన్ లో టికెట్ కన్ఫార్మ్ కావాలా? సింపుల్ గా ఈ స్కీమ్ ట్రై చేయండి!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×