E-Paper
Advertisement

Special Trains: దీపావళికి వైజాగ్ వెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!

Special Trains: దీపావళికి వైజాగ్ వెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!
Advertisement

Diwali Special Trains:

దీపావళి పండుగ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా తమ సొంత ప్రాంతాలకు వెళ్లేలా తగి చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ECoR ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అక్టోబర్ 18 (శనివారం) నుంచి 19 (ఆదివారం) వరకు ఈ రైళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది.

పండుగ రద్దీ నేపథ్యంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఇవే!

⦿ రైలు నెం 02811- భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ స్పెషల్

పండుగ నేపథ్యంలో భువనేశ్వర్, యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ రైలు శనివారం సాయంత్రం 7.15 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరుతుంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో  యశ్వంత్‌ పూర్ కు చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 02831- ధన్‌బాద్-భువనేశ్వర్ స్పెషల్

Advertisement

ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 18, 19 తేదీల్లో అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ధన్‌బాద్-భువనేశ్వర్ స్పెషల్ సాయంత్రం 4 గంటలకు ధన్‌బాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 02832-  భువనేశ్వర్-ధన్‌బాద్  స్పెషల్

ఈ రైలు అక్టోబర్ 18, 19 తేదీలలో రాత్రి 8.25 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ధన్‌బాద్ చేరుకుంటుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.

⦿ రైలు నెం. 08439-  పూరి-పాట్నా స్పెషల్

Advertisement

ఈ రైలు అక్టోబర్ 18న మధ్యాహ్నం 2.55 గంటలకు పూరి నుండి బయల్దేరుతుంది. ఆదివారం ఉదయం 10.45 గంటలకు పాట్నా చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో (రైలు నెం. 08440, పాట్నా-పూరి) స్పెషల్ అక్టోమర్ 19న మధ్యాహ్నం 1.30 గంటలకు పాట్నా నుంచి బయల్దేరి అక్టోబర్ 20న ఉదయం 9.45 గంటలకు పూరికి చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 08581- విశాఖపట్నం- SMVB (బెంగళూరు) స్పెషల్

ఈ రైలు అక్టోబర్ 19(ఆదివారం) మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. అక్టోబర్ 20(సోమవారం) మధ్యాహ్నం 12.45 గంటలకు బెంగళూరు SMVB చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 08580- చర్లపల్లి-విశాఖపట్నం స్పెషల్

ఈ రైలు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 18న(శనివారం) మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం నాడు విశాఖపట్నం చేరుకుంటుంది. పండుగకు హైదరాబాద్ నుంచి వైజాక్ కు వెళ్లాలనుకునే వారికి ఈ రైలు అనుకూలంగా ఉంటుంది.

Read Also: దీపావళికి కన్ఫార్మ్ టికెట్లు కావాలా? ఈ 5 టిప్స్ పాటించాల్సిందే!

ప్రయాణీకులకు ఇబ్బంది లేని,  సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను జరుపుకునేందుకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రజలు ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకొని హాయిగా జర్నీ చేయాలని సూచించారు.

Read Also:  పండుగ సీజన్ లో టికెట్ కన్ఫార్మ్ కావాలా? సింపుల్ గా ఈ స్కీమ్ ట్రై చేయండి!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×