E-Paper
Advertisement

Railway New Timetable: ఏపీ, తెలంగాణ మీద నుంచి వెళ్తే ఈ రైళ్ల వేళలు మారాయ్.. వెంటనే చెక్ చేసుకోండి

Railway New Timetable: ఏపీ, తెలంగాణ మీద నుంచి వెళ్తే ఈ రైళ్ల వేళలు మారాయ్.. వెంటనే చెక్ చేసుకోండి
Advertisement

Indian Railway new timetable 2025: ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే పలు రైళ్ల టైమ్ టేబుల్ మారిపోయింది. కొత్త షెడ్యూల్ ఆగస్టు 15 నుంచి అమలులోకి రానుంది. టైమింగ్స్ మారినవా? లేదంటే మీ రైలు నంబర్‌ మారిపోయిందా? మీ ప్రయాణానికి ఇబ్బంది లేకుండా.. ఓసారి షెడ్యూల్ చెక్ చేసుకోండి!

రైల్వే ప్రయాణాల్లో సంచలనాత్మక మార్పులు రానున్నాయి. ఈస్టర్న్ కోస్ట్ రైల్వే (ECoR) తాజాగా ప్రకటించిన కొత్త రైల్వే టైం టేబుల్ ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ఈ కొత్త షెడ్యూల్‌లో 34 రైళ్ల టైమింగులు మారనుండగా, పలు రైళ్ల సేవలు పొడిగించబడ్డాయి. అలాగే కొన్ని రైళ్ల సంఖ్యలు మార్చబడ్డాయి. కొన్ని రైళ్ల సర్వీసుల సంఖ్య పెరిగింది. కొత్తగా కొన్ని రైళ్లు కూడా చేర్చబడ్డాయి. ఇవన్నీ ప్రయాణికుల సౌకర్యార్థం చేపట్టిన చర్యలే.

Advertisement

ముందుగా రైళ్ల టైమింగుల విషయానికి వస్తే, ఈ కొత్త షెడ్యూల్‌లో మొత్తం 34 రైళ్ల సమయాలను మారుస్తున్నారు. ప్రయాణికులకు మరింత అనుకూలంగా, గమ్యస్థానాలకు సమయానికి చేరుకునేలా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు, కొన్ని రైళ్ల బయలుదేరే సమయం ముందు జరగగా, కొన్ని రైళ్ల గమ్యం చేరే సమయం ముందుకు లేదా వెనక్కు వెళ్లేలా షెడ్యూల్ మార్చబడింది. ఇది ప్రధానంగా ట్రాక్స్ పై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు, ఇతర రైళ్ల డీలేలను నివారించేందుకు రైల్వే తీసుకున్న కీలక నిర్ణయం.

ఇక రూట్ పొడిగింపు విషయానికి వస్తే, గౌహతి – తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ (12507/12508) ఇప్పుడు శిల్చార్ వరకు పొడిగించబడింది. అంటే ఈ రైలు ఇకపై శిల్చార్ నుంచి బయలుదేరి తిరువనంతపురం వరకు నడుస్తుంది. ఇదే విధంగా కామాఖ్యా–బెంగుళూరు కాంట్ ఎక్స్‌ప్రెస్ (12503/12504) అగర్తల వరకు పొడిగించబడింది. గౌహతి – చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ (15630/15629), డిబ్రూగఢ్ – చెన్నై ఎక్స్‌ప్రెస్ (15930/15929) సేవలు తాంబరమ్ వరకు పొడిగించబడ్డాయి. ఈ మార్పుల వలన నార్త్ ఈస్ట్రన్ రాష్ట్రాలకు సౌత్ ఇండియా మధ్య ప్రయాణించేవారికి మరింత లింకింగ్ కలగనుంది.

Advertisement

కొన్ని రైళ్ల ఫ్రీక్వెన్సీ కూడా పెంచారు. ఉదాహరణకు, రౌర్‌కెలా – సంబల్‌పూర్ – రౌర్‌కెలా MEMU (68027/68028) రైలు వారం రోజులలో 6 రోజులపాటు నడుస్తుండగా, కొత్త టైం టేబుల్‌లో ఇది ప్రతిరోజూ నడవనుంది. ఇది రోజువారీ ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు వంటి వారు దీనివల్ల లాభపడతారు.

ఇకపోతే కొన్ని ప్యాసింజర్ రైళ్లను MEMU (Mainline Electric Multiple Unit) రైళ్లుగా మార్చారు. అందుచేత వాటి సంఖ్యలు కూడా మార్చబడ్డాయి. ఉదాహరణకు, బ్రహ్మపూర్ -కటక్ – బ్రహ్మపూర్ ప్యాసింజర్ (58534/58533) రైలు ఇప్పుడు 68434/68433గా మారింది. అలాగే పూరీ-అంగుళ్-పురీ ప్యాసింజర్ (58422/58421) 68022/68021గా మారింది. రౌర్‌కెలా-సంబల్‌పూర్-రౌర్‌కెలా ప్యాసింజర్ (78103/78104) 68027/68028గా, జార్సుగుడా-సంబల్‌పూర్-జార్సుగుడా (58135/58136) 68033/68034గా, మరో జార్సుగుడా-సంబల్‌పూర్ (58137/58138) 68031/68032గా మారాయి. ఈ మార్పులు మెమూ ట్రైన్ల వేగం, సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ప్రయాణాల సమయంలో సౌలభ్యాన్ని కలిగిస్తాయి.

Also Read: Vijayawada Metro: విజయవాడకు మెట్రో స్పెషల్ గిఫ్ట్.. ఎన్ని స్టేషన్ల నిర్మాణమో తెలుసా!

ఇవన్నీ కాకుండా, మొత్తం 84 రైళ్ల టైమింగ్స్‌ను వివిధ స్టేషన్లలో సరిచేశారు. ఉదాహరణకు, కొన్ని రైళ్లు మునుపటికి వింత సమయాల్లో ఏ స్టేషన్‌కు చేరుతున్నాయో గమనించాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఆ టైమింగులను మరింత స్పష్టంగా, ప్రయాణికులకు ఉపయోగపడేలా మార్చారు. ఇది ట్రాక్ నిర్వహణ, ప్యాసింజర్ కంఫర్ట్, ఇతర రైళ్ల సమన్వయం వంటి అంశాలపై పాజిటివ్ ప్రభావం చూపనుంది.

ఈ మార్పులన్నింటి గురించి ప్రయాణికులు ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం. రైలు బుకింగ్ చేసుకునే ముందు కొత్త టైం టేబుల్‌ను పరిశీలించాలి. ఇందుకోసం ECoR ప్రయాణికులకు రైల్వే స్టేషన్ల వద్ద షెడ్యూల్ చెక్ చేయండి లేదా 139 నెంబర్‌కు కాల్ చేసి పూర్తి సమాచారం పొందండి. ఇక IRCTC లేదా ఇతర అధికారిక రైల్వే యాప్స్‌ ద్వారా కూడా తాజా మార్పుల వివరాలను తెలుసుకోవచ్చని సూచించింది.

ఈ మార్పులన్నింటి వలన దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్ మరింత సమర్థంగా, వేగవంతంగా పనిచేయనుంది. ప్రయాణికులకు ఇది ప్రయాణాల్లో వేచి చూసే సమయాన్ని తగ్గించడంతో పాటు, గమ్యస్థానాలకు సమయానికి చేరుకునే అవకాశాన్ని మెరుగుపరచనుంది. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి దక్షిణ భారతానికి వెళ్లే వారికీ, రోజు రోజుకీ ప్రయాణించే ఉద్యోగులకీ, విద్యార్థులకీ ఇది మంచి పరిష్కారంగా మారనుంది.

ప్రయాణికులు ఈ కొత్త షెడ్యూల్ మార్పులను గమనించి తమ ట్రిప్ ప్లాన్‌లు ముందుగానే సర్దుబాటు చేసుకోవాలి. ఒక్కసారి రైలు మిస్ అయితే మరో సదవకాశం దొరకడం కష్టం కావచ్చు. కాబట్టి తాజా మార్పులపై అప్డేటెడ్‌గా ఉండటం అవసరం.

మొత్తంగా చెప్పాలంటే, ఈ కొత్త రైల్వే టైం టేబుల్ ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న కీలక అడుగు. ఇది నూతన మార్గదర్శకాలను సూచించడమే కాక, రాబోయే రోజుల్లో మెరుగైన రైలు ప్రయాణానికి బీజం పడినట్లు చెప్పవచ్చు.

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×