E-Paper
Advertisement

Indian Railway: పట్టాల మీద సెల్ఫీ దిగితే, జైల్లో చిప్పకూడు తినాల్సిందే.. ఇండియన్ రైల్వే సీరియస్ వార్నింగ్!

Indian Railway: పట్టాల మీద సెల్ఫీ దిగితే, జైల్లో చిప్పకూడు తినాల్సిందే.. ఇండియన్ రైల్వే సీరియస్ వార్నింగ్!
Advertisement

ఈ రోజుల్లో యువతకు స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారింది. చీటికి మాటికి సెల్ఫీలు తీసుకోవడం, సోషల్ మీడియాలో షేర్ చేయడం కామన్ అయ్యింది. సెల్ఫీల పిచ్చి కారణంగా చాలా మంది యువతీ, యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ట్రాక్‌ల దగ్గర సెల్ఫీలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) కీలక ప్రకటన విడుదల చేసింది.

ట్రాక్ ల మీద సెల్ఫీలు తీసుకుంటే జైలు శిక్ష!

Advertisement

రైల్వే స్టేషన్లలో, ట్రాక్‌ లపై సెల్ఫీలు తీసుకోవడం,  సోషల్ మీడియాలో పెట్టడం సరదాగా అనిపించవచ్చు. కానీ, ఇది చాలా ప్రమాదకరం. గత కొద్ది సంవత్సరాలలో రైల్వే ట్రాక్ ల మీద, రైలు వచ్చే సమయంలో సెల్ఫీలు తీసుకుంటూ పలువురు   ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలకు అడ్డుకట్ట వేయాలనే ఆలోచనతో రైల్వే అధికారులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. రైల్వే యాక్ట్ లోని సెక్షన్ 147, 153 ప్రకారం, రన్నింగ్ ట్రైన్స్ దగ్గర, రైల్వే ట్రాక్‌ ల మీద సెల్ఫీలు తీసుకుంటూ పట్టుబడిన వారికి భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా విధించబడుతుందని హెచ్చరించారు. ఫోటోల కోసం ప్రాణాలు పణంగా పెట్టడం సరికాదని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.

రైల్వే అధికారుల మార్గదర్శకాలు

Advertisement

⦿ ట్రాక్‌ ల మీద సెల్ఫీలు తీసుకోకూడదు: రైల్వే ట్రాక్‌ ల మీద లేదంటే సమీపంలో ఎప్పుడూ సెల్ఫీలు తీసుకోకూడదు. ఫోటోల కంటే ప్రాణాలు చాలా ముఖ్యమైనవి.

⦿ చట్టపరమైన చర్యలు: రైల్వేలోని  ప్రమాదకరమైన ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకున్న వారికి జరిమానాలు విధించడంతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలు

⦿ సోషల్ మీడియా పోస్ట్ కంటే మీ జీవితం చాలా విలువైనది. మీ ప్రాణాలను పణంగా పెట్టి ఫోటోలు దిగేందుకు ప్రయత్నించకండి.

⦿ స్కూల్, కాలేజీ విద్యార్థులు రైల్వే ప్రమాదాల గురించి అవగాణ పెంచుకోవాలి. రైల్వే స్టేషన్లు,  రైల్వే ట్రాక్‌ ల వంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకోవడం వల్ల ఇతరులతో పాటు మీకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది.

⦿ రైల్వే ప్రమాదాలకు సంబంధించి తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించి చెప్పాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు భద్రతా మార్గదర్శకాలను పాటించేలా చూడాలి.

⦿ ఈస్ట్ కోస్ట్ రైల్వే రైల్వే ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తున్నది. పత్రికల ద్వారా ప్రకటనలు, టీవీ ప్రకటనలు, పబ్లిక్ ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నది. మీ ప్రాణాలను కాపాడుకునేందుకు రైల్వే స్టేషన్లు, ట్రాక్ ల మీద సెల్ఫీలు తీసుకోవడం మానుకోండి. ముఖ్యంగా టీనేజర్లు తమ భవిష్యత్ గురించి ఆలోచించండి.. అంటూ ఈస్ట్ కోస్ట్ రైల్వే తన పరిధిలో ప్రచారాలు నిర్వహిస్తున్నది. కఠిన నిబంధనల గురించి అవగాహన కల్పిస్తున్నది. కొద్ది రోజుల పాటు ప్రచారం కల్పించి, ఆ తర్వాత చర్యలకు దిగనున్నట్లు వెల్లడించింది. అటు రైల్వే అధికారులు చేపట్టిన ఈ ప్రచారంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Read Also:  మీరు కళాకారులా? రైల్వే ప్రయాణంలో 75 శాతం రాయితీ పొందచ్చు, ఎలాగో తెలుసా?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×