E-Paper
Advertisement

రైలులో లిక్కర్ తీసుకెళ్లొచ్చా? ఈ రూల్స్ తెలియకపోతే చిక్కుల్లో పడటం పక్కా!

రైలులో లిక్కర్ తీసుకెళ్లొచ్చా? ఈ రూల్స్ తెలియకపోతే చిక్కుల్లో పడటం పక్కా!
Advertisement

Indian Railways Alcohol Rules: రైలు ప్రయాణంలో మద్యం తీసుకెళ్లాలని అనుకుంటున్నారా? అయితే, ముందు కొన్ని కీలక నిబంధనల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, రైలులో మద్యం తీసుకెళ్లడంపై దేశ వ్యాప్తంగా ఒకే విధమైన పరిమితులు, నియమాలు లేవు. ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభిస్తున్నారు? ఏ రాష్ట్రాల మీదుగా వెళ్తున్నారు?  చివరికి ఎక్కడ దిగుతున్నారు? అనే విషయాలపై రూల్స్ ఆధారపడి ఉంటాయి. మద్యం విషయంలో ప్రతి రాష్ట్రానికి వేర్వేరు ఎక్సైజ్ చట్టాలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో నిర్ణీత పరిమాణంలో సీల్ చేసిన మద్యం సీసాలను తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. అయితే, మరికొన్ని రాష్ట్రాల్లో మద్యం కలిగి ఉండటం, రవాణా చేయడంపై కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి.

సీల్ చేసిన బాటిల్ ఉంటే సమస్య ఉండదా?

అలాంటి నిబంధన ఏమీ లేదు. సీల్ చేసిన మద్యం సీసా ఉన్నంత మాత్రాన అన్ని రాష్ట్రాల్లో దాన్ని తీసుకెళ్లడం చట్టబద్ధం కాదు. బీహార్, గుజరాత్ వంటి మద్యపాన నిషేధ చట్టాలు అమలులో ఉన్న రాష్ట్రాల్లో మద్యం విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. మద్యం చట్టబద్ధంగా కొనుగోలు చేసినా, నిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలోకి దానిని తీసుకెళ్లడం చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు.

రైలులో మద్యం తాగితే?

Advertisement

మద్యం సీసా తీసుకెళ్లడం వేరు, రైలులో మద్యం తాగడం వేరు. రైలు ప్రయాణంలో మద్యం సేవించి ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, గొడవలు చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం నేరంగా పరిగణిస్తారు. రైల్వే చట్టం, 1989లోని సెక్షన్ 145 ప్రకారం రైల్వే ప్రాంగణంలో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగించిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ.500 వరకు జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ విధించవచ్చు.

సీల్ ఓపెన్ చేసిన మద్యం బాటిల్ ఉంటే?   

ప్రయాణ సమయంలో సీల్ తీసిన మద్యం సీసా ఉండటం పరిస్థితిని మరింత సీరియస్ గా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మద్యం సేవిస్తూ కనిపించినా, మద్యం మత్తులో ఇతరులకు ఇబ్బంది కలిగించినా రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటారు. రైల్వే పోలీసులు, RPF అధికారులు పరిస్థితిని బట్టి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అందువల్ల రైలు ప్రయాణంలో మద్యం సేవించకుండా ఉండటం సురక్షితమైన మార్గం.

మెట్రోకూ ఇవే నిబంధనలు ఉంటాయా?

Advertisement

ఢిల్లీ మెట్రోలో అమలయ్యే మద్యం నిబంధనలు భారతీయ రైల్వేకు వర్తించవు. ఢిల్లీ మెట్రో కొన్ని షరతులతో సీల్ చేసిన రెండు మద్యం సీసాల వరకు అనుమతించినప్పటికీ, అది కేవలం మెట్రో వ్యవస్థకు మాత్రమే వర్తిస్తుంది. మద్యం తీసుకెళ్లే విషయంలో సీసాల సంఖ్యతో పాటు వయస్సు కూడా ముఖ్యమే. మేజర్లు మాత్రమే మద్యం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, ప్రయాణానికి ముందు సంబంధిత రాష్ట్రాల నియమాలను తెలుసుకోవడం మంచిది.

Read Also: ఈ రైల్వే స్టేషన్‌ నుంచి నడుచుకుంటూ పక్క దేశానికి వెళ్లిపోవచ్చు!

Tags

Related News

ఈ రైల్వే స్టేషన్‌ నుంచి నడుచుకుంటూ పక్క దేశానికి వెళ్లిపోవచ్చు!

రాత్రికి రాత్రే 83 గ్రామాల ప్రజలు అదృశ్యం.. ఇంతకీ ఆ రోజు కుల్ధారాలో ఏం జరిగింది?

పై నుంచి చూస్తే దీన్ని అడవి అనుకుంటారు.. కానీ, అది అతి పెద్ద చెట్టు, ఎక్కడుందంటే?

రైల్వే స్టేషన్లలో కొత్త రూల్స్.. ఈ పనులు చేశారో జేబుకు చిల్లు తప్పదు!

ఏపీలో కొత్త హైస్పీడ్ కారిడార్.. అరకు నుంచి నూజివీడు వరకు మారనున్న రవాణా ముఖచిత్రం!

మంచు ఖండంలో భారత్ మరో రీసెర్చ్ సెంటర్.. ఇంతకీ మైత్రి-2తో కలిగే లాభం ఏంటి?

నేపాల్ విలయానికి చైనానే కారణమా? ముందే హెచ్చరిక ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదా?

Big Stories

Advertisement
×