Kaushik Reddy: ఈ ఏడాది మార్చి 29న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పాడి కౌశిక్ రెడ్డి అనుచితంగా వ్యవహరించారన్న ఇష్యూపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. సభలో బెదిరింపు సంకేతాలు చేశారంటూ కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. కడియంను తుపాకీతో కాల్చి చంపుతానని పాడి కౌశిక్ రెడ్డి బెదిరించారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణకు కమిటీ రంగంలోకి దిగింది. వచ్చే సమావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే చట్టసభలో హద్దులు దాటితే.. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? రాజకీయ విభేదాలు ఉండొచ్చు.. కానీ వ్యక్తిగత దూషణలు, అనుచిత ప్రవర్తనకు అసెంబ్లీలో చోటుండాలా? అన్న చర్చ జరుగుతోంది. ఎథిక్స్ కమిటీ త్వరలో ఏం తేల్చబోతోంది? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయం చుట్టూ పెద్ద డిబేటే నడుస్తోంది. వేటు గ్యారెంటీ అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. చట్టసభలో మాటకు స్వేచ్ఛ ఉండొచ్చు.. కానీ ప్రవర్తనకు హద్దులు ఉండాల్సిందే కదా? మరేం జరుగుతుందో చూడాలి.