E-Paper
Advertisement

కౌశిక్ రెడ్డి పదవికి గండం.. స్పీకర్ యాక్షన్ తీసుకుంటారా?

కౌశిక్ రెడ్డి పదవికి గండం.. స్పీకర్ యాక్షన్  తీసుకుంటారా?
Advertisement

Kaushik Reddy: ఈ ఏడాది మార్చి 29న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పాడి కౌశిక్ రెడ్డి అనుచితంగా వ్యవహరించారన్న ఇష్యూపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. సభలో బెదిరింపు సంకేతాలు చేశారంటూ కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. కడియంను తుపాకీతో కాల్చి చంపుతానని పాడి కౌశిక్ రెడ్డి బెదిరించారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణకు కమిటీ రంగంలోకి దిగింది. వచ్చే సమావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

బాధ్యత ఎవరిది?

Advertisement

ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే చట్టసభలో హద్దులు దాటితే.. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? రాజకీయ విభేదాలు ఉండొచ్చు.. కానీ వ్యక్తిగత దూషణలు, అనుచిత ప్రవర్తనకు అసెంబ్లీలో చోటుండాలా? అన్న చర్చ జరుగుతోంది. ఎథిక్స్ కమిటీ త్వరలో ఏం తేల్చబోతోంది? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయం చుట్టూ పెద్ద డిబేటే నడుస్తోంది. వేటు గ్యారెంటీ అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. చట్టసభలో మాటకు స్వేచ్ఛ ఉండొచ్చు.. కానీ ప్రవర్తనకు హద్దులు ఉండాల్సిందే కదా? మరేం జరుగుతుందో చూడాలి.

Tags

Related News

రాయదుర్గంలో భూమికి కళ్లు చెదిరే ధర.. రూ.269 కోట్ల రికార్డు బిడ్!

కమిటీల లెక్క తేలేదెప్పుడు..

విజయసాయి లేఖ వెనుక అసలు వ్యూహం ఇదేనా?

కవిత కామెంట్స్‌తో బీఆర్ఎస్ వారసత్వంపై కొత్త రచ్చ

వెలిగొండ ప్రాజెక్ట్‌పై క్రెడిట్ వార్

కొండగట్టు కొట్లాట పొన్నంపై పవన్ వార్!

రేవంత్ సర్కార్ ఫార్ములా మహారాష్ట్రను ఒప్పిస్తుందా?

Big Stories

Advertisement
×