Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రోజుకో బాంబు పేలుస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీకి ముందు తన టార్గెట్ ఎవరో సిగ్నల్స్ ఇస్తున్నారా ఏంటా అన్నది చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు వైసీపీలో సజ్జల టార్గెట్ గా ఓ లెటర్ రిలీజ్ చేశారు VS రెడ్డి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సజ్జల గేమ్ ప్లాన్ మొదలైందని, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు జగన్ను కలిసే అవకాశం లేకుండా అడ్డుకున్నారని లేఖలో చెప్పుకొచ్చారు. 2020 తర్వాత తన బాధ్యతలు ఒక్కొక్కటిగా తగ్గించారని.. కోర్ కమిటీ నుంచి కూడా తొలగించారని చెబుతున్నారు. అంతేకాదు.. 2022 మంగళగిరి ప్లీనరీలో తనపై సజ్జల భౌతికంగా దాడి చేశారని, ఈ విషయం జగన్కు తెలిసినా రియాక్ట్ అవలేదని విజయసాయి ఆరోపించారు.
ఇది కేవలం వ్యక్తిగత విభేదమా? లేక వైసీపీలో పెరిగిన కోటరీ రాజకీయాల ఫలితమా? నంబర్-2 ఎవరనే పోరాటమే గ్యాప్కు కారణమా అన్న చర్చ అయితే నడుస్తోంది. విజయసాయి త్వరలో మరిన్ని నిజాలు చెబుతానన్న నేపథ్యంలో.. వైసీపీ రాజకీయాల్లో ఇంకెన్ని ప్రకంపనలు రానున్నాయి?