E-Paper
Advertisement

Trains Cancellations: యూపీ ఎఫెక్ట్.. దేశ వ్యాప్తంగా పలు రైళ్లు రద్దు!

Trains Cancellations: యూపీ ఎఫెక్ట్.. దేశ వ్యాప్తంగా పలు రైళ్లు రద్దు!
Advertisement

Trains Cancellations in May 2026:  ఈ నెలలో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నవారిని రైల్వేశాఖ అలర్ట్ చేసింది. రైల్వే పనుల కారణంగా పలు రైళ్లను క్యాన్సిల్ చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారిమళ్లించినట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ లోని జౌన్‌ పూర్ స్టేషన్‌ లో  జరుగుతున్న పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వెల్లడించింది. యార్డ్‌ పునర్నిర్మాణం భాగంగా కీలక పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలు మరింత వేగంగా, సజావుగా సాగేందుకు నాన్-ఇంటర్‌లాకింగ్  పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనుల కారణంగా 40కి పైగా రైళ్లు ఎఫెక్ట్ అవుతున్నట్లు వెల్లడించారు.

వందేభారత్ పైనా ప్రభావం

తాజా మార్పుల కారణంగా కొన్ని రైళ్లను దారి మళ్లించడం, కొన్ని స్టేషన్లలో ఆగకపోవడం, ఇంకొన్ని రైళ్లను మధ్యలోనే నిలిపివేయడం,  రద్దు చేయడం కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో వందేభారత్ రైలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. 22435 పాట్నా–గోమతినగర్ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ కొద్ది రోజుల పాటు కొత్త మార్గంలో నడవనుంది.  పాత మార్గం జాఫరాబాద్–షాహగంజ్–అయోధ్య కాగా, ఇప్పుడు జాఫరాబాద్–సుల్తాన్‌పూర్–అయోధ్య కంటోన్మెంట్ మార్గంలో ప్రయాణించనుంది. ఈ సమయంలో అయోధ్య ధామ్ స్టేషన్‌ లో ఈ రైలు ఆగదు.

పలు రైళ్లు దారిమళ్లింపు

Advertisement

పలు ముఖ్య రైళ్లు కూడా దారిమళ్లింపును కొనసాగిస్తున్నాయి. బల్లియా–ఆనంద్ విహార్, సూరత్–ఛప్రా, బరౌని–గోండియా, లోకమాన్య తిలక్–గోరఖ్‌పూర్, షాలిమార్–గోరఖ్‌పూర్ లాంటి ఎక్స్‌ ప్రెస్ రైళ్లపైనా ఈ ప్రభావం పడనుంది. వీటిలో చాలా రైళ్లు జౌన్‌ పూర్, జంగై, మరియాహు లాంటి స్టేషన్లలో ఆగకుండా వెళ్లిపోతాయి. దారి మళ్లింపుల కారణంగా పలు స్టేషన్లలో హాల్టింగ్ రద్దు చేశారు. జౌన్‌ పూర్, జాఫరాబాద్, మరియాహు, జంగై, ప్రయాగ్రాజ్ ఛెయోకి, వింధ్యాచల్, మిర్జాపూర్, షాహగంజ్ లాంటి స్టేషన్లలో కొన్ని రైళ్లు ఆగవు. అందువల్ల ఈ స్టేషన్ల నుంచి ప్రయాణం చేసే వారు ముందుగా తమ రైలు వివరాలు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

MEMU రైళ్లపైనా తీవ్ర ప్రభావం

ఇక కొన్ని MEMU రైళ్లు కూడా పూర్తిగా నడవడం లేదు. ఘాజీపూర్ సిటీ–జౌన్‌ పూర్ రూట్‌ లో నడిచే కొన్ని రైళ్లు ముఫ్తీగంజ్ వరకు మాత్రమే పరిమితం అవుతాయి. కొన్ని తేదీల్లో ఈ రూట్‌ లో రైళ్లు పూర్తిగా రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు కీలక సూచనలు చేశారు. స్టేషన్‌కు వెళ్లే ముందు ఆన్‌ లైన్‌ లో రైలు  స్టేటస్ తెలుసుకోవాలన్నారు.  రైలు రూట్, ఆగే స్టేషన్లు మారాయా? లేదా? అనేది చెక్ చేసుకోవాలన్నారు. అవసరమైతే అదనపు సమయం కేటాయించాలన్నారు. చివరి నిమిషంలో ఇబ్బందులు రాకుండా ముందుగానే పూర్తి వివరాలను తెలుసుకోవాలన్నారు. ప్రయాణికులు అలర్ట్ గా ఉండాలని సూచించారు.

Advertisement

Read Also: జమ్మూ నుంచి శ్రీనగర్‌ కు డైరెక్ట్ ట్రైన్.. దశాబ్దాల కల సాకారం!

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×