IRCTC Free Food: రైలు ప్రయాణాల్లో ‘ఆలస్యం’ అనే మాట తరచూ వినిపిస్తుంటుంది. అదే మనం ఎక్కాల్సిన ట్రైన్ ఆలస్యం అని తెలిస్తే.. ఇక అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందా? అని చెవులు పెద్దవి చేసుకుని వింటుంటాం. అలాగే వాచ్, ఫ్లాట్ ఫామ్ పై బోర్డులు పదే పదే చూస్తుంటాం. రైల్వే ప్రయాణాల్లో కొన్ని రూల్స్ ప్రయాణికుల పక్షాన కూడా ఉంటాయ్. ఒకవేళ ట్రైన్ ఆలస్యం అయితే కొన్ని రైళ్ల ప్రయాణికులు ఉచితంగా ఆహారం అందిస్తారు.
ఐఆర్సీటీసీ క్యాటరింగ్ ప్రకారం.. రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లు.. వాటి షెడ్యూల్ కంటే రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ప్రయాణికులు ఉచిత భోజనం పొందేందుకు అర్హులు. ఈ రూల్ పై ఇటీవల ఓ ప్రయాణికుడు ఎక్స్ వేదికగా పోస్టు చేశాడు.
జనవరి 8న ఓ ప్రయాణికుడు.. రాజధాని ఎక్స్ప్రెస్లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ఆ రైలు ఆరు గంటలు ఆలస్యం అయింది. దీంతో తనకు ఉచితంగా భోజనం లభించిందని వెల్లడించాడు. “మీ రైలు 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే.. మీకు ఉచిత భోజనం (అల్పాహారం/భోజనం/విందు) లభిస్తుంది” అని ప్రయాణికుడు తెలిపారు.
ఐఆర్సీటీసీ క్యాటరింగ్ ప్రకారం.. ప్రీమియం రైళ్లు ఆలస్యంగా నడిస్తే ప్రయాణికులు ఆహారాన్ని ఉచితంగా అందిస్తారు.
Also Read: IRCTC దుబాయ్ టూర్, తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేయండి గురూ!
రైలు ఎక్కువ సమయం ఆలస్యం అయితే.. ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చు. డబ్బులు మొత్తం వాపస్ ఇస్తారు. రైళ్లు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే ఈ సదుపాయం కల్పిస్తారు. ఎక్కడ బుక్ చేసుకుంటే.. అదే ప్లాట్ఫామ్ లో వాపస్ ప్రాసెస్ చేస్తారు. ప్రయాణికులు ఎటువంటి ఎక్స్ ట్రా ఛార్జీ చెల్లించకుండా వెయిటింగ్ హాల్లను యాక్సెస్ చేయవచ్చు. ఫుడ్ కౌంటర్లను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచుతారు.