E-Paper
Advertisement

Indian Railways services: ఒక్క క్లిక్ తో టికెట్ రిజర్వేషన్.. రైల్వే సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఈ ఛాన్స్ మాత్రం వారికే!

Indian Railways services: ఒక్క క్లిక్ తో టికెట్ రిజర్వేషన్.. రైల్వే సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఈ ఛాన్స్ మాత్రం వారికే!
Advertisement

Indian Railways services: ఇకపై రైలు టికెట్ బుకింగ్ కోసం క్యూలలో నిలబడటం, ఫోన్ చేసి రిజర్వేషన్ చేయించుకోవడం ఇలాంటి కష్టాలు వారికి దూరం. ఇండియన్ రైల్వే ఇప్పుడు వారికి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ రూపొందిస్తోంది. దేశానికి ప్రతినిధులైన పార్లమెంట్ సభ్యుల ప్రయాణాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగేందుకు ఈ కొత్త అడుగు వేస్తున్న రైల్వే, డిజిటల్ సౌకర్యాల రంగంలో మరో ముందడుగుగా నిలుస్తోంది.

ఎంపీల కోసం ప్రత్యేక పోర్టల్
దేశంలోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తరచుగా అధికారిక కార్యక్రమాల కోసం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వీరికి రైలు టికెట్లు IRCTC సైట్ లేదా కౌంటర్ ద్వారా బుక్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి రాబోతోంది. దీని ద్వారా ఎంపీలు స్వయంగా టికెట్లు రిజర్వ్ చేసుకోవడం, క్యాన్సిల్ చేయడం చాలా సులభం కానుంది.

Advertisement

రైల్వే మంత్రిత్వ శాఖ సమాచారం
జూలై 23న లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ MK రాఘవన్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. ఎంపీలు, మాజీ ఎంపీల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అభివృద్ధి జరుగుతోంది. దీని ద్వారా వారు ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.

ఎంపీల ప్రత్యేక హక్కులు
ఇండియన్ రైల్వే ప్రకారం ఎంపీలు ఫస్ట్ క్లాస్ AC లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించగలరు. ఎంపీతో పాటు భార్య, భర్త కూడా ఈ సౌకర్యాన్ని పొందుతారు. అదనంగా, ఎంపీతో పాటు మరొక వ్యక్తికి AC 2-టియర్ ఉచిత పాస్ అందుతుంది. ఇంకా ఎంపీ భార్య, భర్త హోమ్‌టౌన్ నుండి ఢిల్లీకి ఎన్ని సార్లు అయినా ప్రయాణించవచ్చు, అది పార్లమెంట్ సెషన్ ఉన్నా లేకపోయినా వర్తిస్తుంది.

Advertisement

పోర్టల్ వల్ల కలిగే సౌకర్యాలు
ఈ కొత్త పోర్టల్ వల్ల ఎంపీలు ఎక్కడ ఉన్నా సెల్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు. కౌంటర్‌లో లైన్లు వేసే పని, టైమ్ వేస్ట్ అన్నీ తగ్గిపోతాయి. ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కారం దొరుకుతుంది.

Also Read: EQ Railway Rules: అత్యవసర టికెట్ కావాలా? టైమింగ్స్ మార్చేశారు.. మిస్ అయితే ఇక అంతే!

రైల్‌వన్ యాప్‌తో సేవలు విస్తృతం
ఇదే సమయంలో రైల్వే ప్రయాణికుల కోసం రైల్‌వన్ (RailOne) యాప్‌ను ఇటీవల ప్రారంభించింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) రూపొందించిన ఈ యాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి.
⦿ రిజర్వ్‌డ్ టికెట్ బుకింగ్
⦿ అన్‌రిజర్వ్‌డ్ UTS టికెట్లు
⦿ లైవ్ ట్రైన్ ట్రాకింగ్
⦿ ఇ-కేటరింగ్ ఆర్డర్లు
⦿ పోర్టర్ బుకింగ్
⦿ గ్రీవెన్స్ సెల్.. ఈ యాప్ రైల్వే డిజిటల్ సర్వీసులకు ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఎంపీల కోసం ప్రత్యేక పోర్టల్ కూడా ఈ డిజిటల్ మార్పులో భాగమేనని రైల్వే అంటోంది.

ఎంపీల ప్రయాణం మరింత సులభం
రైల్వే మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్ ద్వారా ఎంపీల ప్రయాణాలను ఒక క్లిక్ దూరంలో తీసుకురావాలని భావిస్తోంది. ఇక భవిష్యత్తులో ఎంపీల కోసం 24×7 కస్టమర్ సపోర్ట్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది. దీని వల్ల ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కారం అందుతుంది.

రైల్వే డిజిటల్ మార్పులు కేవలం సాధారణ ప్రయాణికులకు మాత్రమే కాదు, దేశ ప్రతినిధులైన ఎంపీలకు కూడా సమయాన్ని ఆదా చేస్తాయి. ఎంపీల కోసం ప్రత్యేక పోర్టల్ రావడం వల్ల వారి ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయి. అయితే సాధారణ ప్రయాణికులకు కూడా ఇలాంటి వేగవంతమైన డిజిటల్ సర్వీసులు మరింత మెరుగుపరచాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు.

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×