E-Paper
Advertisement

New Vande Bharat: ఒక వందేభారత్, రెండు అమృత్ భారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్!

New Vande Bharat: ఒక వందేభారత్, రెండు అమృత్ భారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్!
Advertisement

New Vande Bharat from Secunderabad: భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా ఓ వందేభారత్ రైలుతో పాటు రెండు అమృత భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించి రూట్, షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. వాస్తవానికి ఉభయ తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే వందేభారత్ రైళ్తో పాటు అమృత్ భారత్ రైళ్లకు మంచి ఆదరణ పెరిగింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ కు అనుణంగా ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో పలు వందేభారత్ రైళ్ల పరుగులు

వాస్తవానికి ఉభయ తెలుగు రాష్ట్రాలను కలుగుపుతూ ఇప్పటికే లు వందేభారత్ రైలు సర్వీసులు నడుస్తున్నాయి. ఈ రైళ్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇంకా కొన్ని రైళ్లు కావాలని ప్రయాణీకుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రైల్వేశాఖ.. కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రైల్వే ఆమోదం లభించినా అందుబాటులోకి రాని విజయవాడ-బెంగళూరు వందేభారత్ రైలు పైనా ఈ వారంలోనే రైల్వే అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో సికింద్రాబాద్ నుంచి నాందేడ్ వరకు కొత్త వందేభారత్ సర్వీసును తీసుకురావాలని అధికారులు నిర్ణయించింది.

ఇకపై జస్ట్ మూడు గంటల ప్రయాణం

Advertisement

సికింద్రాబాద్- నాందేడ్ నగరాల మధ్య దూరం 280 కిలో మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం సాధారణ రైళ్లలో ఈ నగరాల మధ్య ప్రయాణం కొనసాగించాలంటే ఏకంగా 7 గంటల సమయం పడుతుంది. కొత్తగా వందేభారత్ రైలు అందుబాటు లోకి వస్తే, ప్రయాణ సమయం ఏకంగా మూడు గంటలకు తగ్గనుంది.  అటు చర్లపల్లి- షాలీమార్, చర్లపల్లి – గోరఖ్ పూర్ నడుమ రెండు అమృత్ భారత్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల చివరిలోగా ఈ రైళ్లు ప్రారంభం అవుతాయని రైల్వే అధికారులు ఇప్పటికే వెల్లడించారు.

ప్రయాణీకులకు మరింత వెసులుబాటు

త్వరలోనే ఈ కొత్త రైళ్లకు సంబంధించిన అధికారికంగా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, యశ్వంత్ పూర్ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్ రైలు 575 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. జస్ట్ 7.15 గంటల్లో ఈ ప్రయాణం పూర్తి అవుతుంది. ఇప్పటికే ఉన్న ఈ వందే భారత్ రైళ్లతో పాటు సికింద్రాబాద్-నాందేడ్ వందే భారత్ రైలు ప్రారంభం అయితే, ప్రయాణీకులకు మరింత లాభం కలగనుంది.

Advertisement

అటు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న విజయవాడ-బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ కూడా త్వరలోనే పట్టాలు ఎక్కే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో విశాఖ నుంచి బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ పైన సమాచాలోచలు చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపైనా అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

Read Also:  కాశీ To అయోధ్య… IRCTC అద్భుతమైన యాత్ర ప్యాకేజీ!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×