E-Paper
Advertisement

New Vande Bharat: ఒక వందేభారత్, రెండు అమృత్ భారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్!

New Vande Bharat: ఒక వందేభారత్, రెండు అమృత్ భారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్!
Advertisement

New Vande Bharat from Secunderabad: భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా ఓ వందేభారత్ రైలుతో పాటు రెండు అమృత భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించి రూట్, షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. వాస్తవానికి ఉభయ తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే వందేభారత్ రైళ్తో పాటు అమృత్ భారత్ రైళ్లకు మంచి ఆదరణ పెరిగింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ కు అనుణంగా ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో పలు వందేభారత్ రైళ్ల పరుగులు

వాస్తవానికి ఉభయ తెలుగు రాష్ట్రాలను కలుగుపుతూ ఇప్పటికే లు వందేభారత్ రైలు సర్వీసులు నడుస్తున్నాయి. ఈ రైళ్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇంకా కొన్ని రైళ్లు కావాలని ప్రయాణీకుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రైల్వేశాఖ.. కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రైల్వే ఆమోదం లభించినా అందుబాటులోకి రాని విజయవాడ-బెంగళూరు వందేభారత్ రైలు పైనా ఈ వారంలోనే రైల్వే అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో సికింద్రాబాద్ నుంచి నాందేడ్ వరకు కొత్త వందేభారత్ సర్వీసును తీసుకురావాలని అధికారులు నిర్ణయించింది.

ఇకపై జస్ట్ మూడు గంటల ప్రయాణం

Advertisement

సికింద్రాబాద్- నాందేడ్ నగరాల మధ్య దూరం 280 కిలో మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం సాధారణ రైళ్లలో ఈ నగరాల మధ్య ప్రయాణం కొనసాగించాలంటే ఏకంగా 7 గంటల సమయం పడుతుంది. కొత్తగా వందేభారత్ రైలు అందుబాటు లోకి వస్తే, ప్రయాణ సమయం ఏకంగా మూడు గంటలకు తగ్గనుంది.  అటు చర్లపల్లి- షాలీమార్, చర్లపల్లి – గోరఖ్ పూర్ నడుమ రెండు అమృత్ భారత్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల చివరిలోగా ఈ రైళ్లు ప్రారంభం అవుతాయని రైల్వే అధికారులు ఇప్పటికే వెల్లడించారు.

ప్రయాణీకులకు మరింత వెసులుబాటు

త్వరలోనే ఈ కొత్త రైళ్లకు సంబంధించిన అధికారికంగా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, యశ్వంత్ పూర్ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్ రైలు 575 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. జస్ట్ 7.15 గంటల్లో ఈ ప్రయాణం పూర్తి అవుతుంది. ఇప్పటికే ఉన్న ఈ వందే భారత్ రైళ్లతో పాటు సికింద్రాబాద్-నాందేడ్ వందే భారత్ రైలు ప్రారంభం అయితే, ప్రయాణీకులకు మరింత లాభం కలగనుంది.

Advertisement

అటు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న విజయవాడ-బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ కూడా త్వరలోనే పట్టాలు ఎక్కే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో విశాఖ నుంచి బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ పైన సమాచాలోచలు చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపైనా అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

Read Also:  కాశీ To అయోధ్య… IRCTC అద్భుతమైన యాత్ర ప్యాకేజీ!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×