తక్కువ ధరలో అద్భుతమైన టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చే IRCTC, భక్తి యాత్రకు శ్రీకారం చుట్టింది. గంగా సాగర్ దివ్య కాశీ యాత్ర పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా భారతీయ రైల్వే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయిన అయోధ్య, కాశీతో పాటు అనేక నగరాలకు తీసుకెళ్తుంది. సరసమైన ధరలో IRCTC ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 11 రాత్రులు, 12 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన సౌకర్యాలు, టికెట్ ధరలు, దర్శించుకోబోయే పుణ్యక్షేత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ తీర్థయాత్ర ప్యాకేజీ పూణే, లోనావాలా, కర్జాత్, పన్వేల్, కళ్యాణ్, నాసిక్, మన్మాడ్, చాలిస్గావ్ జంక్షన్, భూసావల్, అకోలా, బద్నేరా, వార్ధా, నాగ్ పూర్ నుంచి ప్రారంభమవుతుంది. అంటే, భక్తులు ఈ అన్ని స్టేషన్ల నుంచి ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా పూణే, పూరి, గంగాసాగర్, వైద్యనాథ్, వారణాసి, అయోధ్యను దర్శించుకునే అవకాశం ఉంది. ప్యాకేజీ 11 రాత్రులు, 12 పగళ్లు ఉంటుంది. మార్చి 7 నుంచి ఈ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. ప్యాకేజీలో రైలు ప్రయాణం, సందర్శనా స్థలాల కోసం బస్సు సేవ ఉచితంగా ఉంటాయి. ఈ ప్యాకేజీని పూరి గంగాసాగర్ దివ్య కాశీ యాత్ర అని పిలుస్తారు.
Read Also: హోలీ వేళ తెలుగు రాష్ట్రాలకు 132 ప్రత్యేక రైళ్లు.. ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!
⦿ స్లీపర్ కోచ్ లకు ప్యాకేజీ ధర రూ. 19,660.
⦿ 3AC కోచ్లకు ప్యాకేజీ రుసుము రూ.34,860.
⦿ 2AC కోచ్లో ప్రయాణించడానికి మొత్తం ప్యాకేజీ ధర రూ. 46,020.
ఈ యాత్రలో భాగంగా రౌండ్ ట్రిప్ రైలు టికెట్ తో పాటు పలు సౌకర్యాలు కల్పిస్తారు. అధికారిక భారతీయ రైల్వే వెబ్సైట్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.
Read Also: నిజంగా వండర్.. ఇక్కడ రైళ్లు సముద్రంలో పరిగెడుతున్నట్లు కనిపిస్తాయి!
⦿ రైలులో శాఖాహార భోజనం అందిస్తారు.
⦿ అన్ని రవాణా, సందర్శనా స్థలాలకు బస్సు సౌకర్యం కల్పిస్తారు.
⦿ ప్రయాణికులకు ప్రయాణ బీమా కూడా అందిస్తారు.
⦿ రైల్లో పూర్తి భద్రత అందించబడుతుంది.
అన్ని రకాల పన్నులు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. ఆహార ఖర్చులు కూడా ప్యాకేజీలోనే చేర్చారు. బడ్జెట్ టూర్ ప్యాకేజీ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.
Read Also: హోలీ వేళ తెలుగు రాష్ట్రాలకు 132 ప్రత్యేక రైళ్లు.. ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!