E-Paper
Advertisement

Vande Bharat Train: ఆ రూట్‌లో వందే భారత్ రైలు బోగీల తగ్గింపు.. ఈ తేదీ నుంచే అమలు!

Vande Bharat Train: ఆ రూట్‌లో వందే భారత్ రైలు బోగీల తగ్గింపు.. ఈ తేదీ నుంచే అమలు!
Advertisement

Vande Bharat Train Coaches Reduce: అత్యాధునిక సౌకర్యాలు, అత్యంత వేగవంతమైన ప్రయాణం అందించే వందేభారత్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 5 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే, డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో వందేభారత్ కోచ్ ల సంఖ్య పెంచి, ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న రూట్లలో కోచ్ ల సంఖ్య తగ్గిస్తున్నారు రైల్వే అధికారులు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే ఓ రైలు కోచ్ లు తగ్గించగా, ఇప్పుడు మరో రైలు కోచ్ లు తగ్గించబోతున్నారు. ఇంతకీ ఆ రైలు ఏ రూట్ లో నడుస్తుందంటే..

20 కోచ్ ల నుంచి 8 కోచ్ లకు కుదింపు

Advertisement

నాగపూర్- సికింద్రాబాద్ మధ్య రాకపోకలు కొనసాగించే వందేభారత్ రైలు కోచ్ లు గణనీయంగా తగ్గిస్తున్నారు. ఫిబ్రవరి 19 నుంచి కోచ్ ల తగ్గింపు అమల్లోకి రానుంది.దేశంలో మొట్టమొదటి 20 కోచ్‌ల వందే భారత్ రైలు అయిన నాగ్‌పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ను ఏకంగా 8 కోచ్‌లకు తగ్గించనున్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (PCOM)  కోచింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. తక్కువ ఆక్యుపెన్సీ రేట్ కారణంగా రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేవలం 25% ఆక్యుపెన్సీ ఉండటంతో కీలక నిర్ణయం

Advertisement

గత సెప్టెంబర్‌ లో ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును అట్టహాసంగా ప్రారంభించారు. అయితే, తొలి నుంచి ప్రయాణీకులను ఆకర్షించడంలో ఇబ్బంది పడింది. ఈ రూట్ లో ఆక్యుపెన్సీ రేట్ కేవలం 25% ఉంది. నాగ్‌పూర్ నుంచి తెల్లవారుజామున   5 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం సమయంలో సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. అయితే, ఈ టైమ్ ప్రజలకు పెద్దగా అనుకూలంగా లేదు. అదే సమయంలో  ఇతర మెయిల్/ఎక్స్‌ ప్రెస్ రైళ్లతో పోలిస్తే ప్రీమియం ఛార్జీ..  ప్రయాణ సమయంలో స్వల్ప తగ్గింపును ఉండటంతో ప్రయాణీకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూసుకుంటున్నారు. సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్లు సుమారు 8 గంటలు ప్రయాణిస్తే, వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు  7 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది.

ప్రయత్యామ్నాయ రైలును ఎంచుకుంటున్న ప్రయాణీకులు

ప్రయాణీకులు ఎక్కువ సౌలభ్యం కోసం రాత్రిపూట ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వందేభారత్ రైలు ప్రయాణం చేయాలనుకునే వాళ్లు నాగపూర్- బిలాస్‌ పూర్ వందే భారత్ ను ఎంచుకుంటున్నారు. ఈ రైలు కోచ్ లు కూడా త్వరలో తగ్గనున్నాయి. ఈ రైలు ప్రారంభంలో 16-కోచ్‌ లతో ఎంట్రీ ఇచ్చింది.  కానీ, ఆ తర్వాత తక్కువ డిమాండ్ కారణం గా  త్వరలో 8 కోచ్‌లకు తగ్గించబడింది.

విశాఖ-దుర్గ్ వందేభారత్ కోచ్ లు సగానికి తగ్గింపు

రీసెంట్ గా విశాఖపట్నం-దుర్గ్  రైలు కోచ్ లు సగానికి సగం తగ్గించారు. ఈ రూట్ లో పెద్దగా ప్రయాణీకుల నుంచి డిమాండ్ లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 16న విశాఖ-దుర్గ్((20829/20830) రైలును అధికారులు ప్రారంభించారు. 16 కోచ్ లతో ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ రూట్ లో అనుకున్న స్థాయిలో ప్రయాణీకుల నుంచి ఆదరణ లభించడం లేదు. కేవలం 40 నుంచి 45 శాతం ఆక్యుపెన్సీ ఉంటుంది. అటు దుర్గ్ నుంచి విశాఖ వచ్చే సమయంలో రాయగఢ వరకు 50 శాతం ఆక్యుపెన్సీ ఉంటుండగా, ఆ తర్వాత విశాఖ వరకు కేవలం 20 నుంచి 25 శాతం ఆక్యుపెన్సీ ఉంటున్నది. కోచ్ లన్నీ ఖాళీగానే దర్శనం ఇచ్చాయి.

Read Also: ఈ రైల్లో వెళ్లేందుకు టికెట్ అవసరం లేదు, 75 ఏండ్లుగా ఫ్రీ సర్వీస్ అందిస్తున్న ట్రైన్ గురించి మీకు తెలుసా?

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×