E-Paper
Advertisement

Water on Coal: రైల్వే వ్యాగన్లలో బొగ్గు తరలించేటప్పుడు నీళ్లు చల్లుతారు, ఎందుకో తెలుసా?

Water on Coal:  రైల్వే వ్యాగన్లలో బొగ్గు తరలించేటప్పుడు నీళ్లు చల్లుతారు, ఎందుకో తెలుసా?

Water Spray On Coal:

భారతీయ రైల్వేకు ఎక్కువ ఆదాయాన్ని అందించడంలో సరుకు రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇస్తూనే, అదే సమయంలో సరుకు రవాణాకు తగిన ప్రాధాన్యత ఇస్తుంది ఇండియన్ రైల్వే. సరుకు రవాణాలో ఎక్కువ భాగం బొగ్గు రవాణా ఉంటుంది. దేశ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గును సమకూర్చడంలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2025 నాటికి, బొగ్గు రవాణా రైల్వే ఆదాయంలో సుమారు 45%  ఉంది. ఈ రవాణా పర్యావరణ, ఆర్థిక, లాజిస్టిక్ సవాళ్లతో పాటు దేశ విద్యుత్ శక్తి భద్రతకు ఎంతో ముఖ్యమైనది.

భారతీయ రైల్వే బొగ్గు రవాణా గురించి..

2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే సుమారు 817 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేశాయి. ఇది FY24లో 781 మిలియన్ టన్నులుగా ఉంది. ఏడాది కాలంలో ఏకంగా 16% పెరుగుదలను నమోదు చేసింది. రోజు వారీ సగటున 440 రేక్‌లు పవర్ ప్లాంట్లకు బొగ్గును సరఫరా చేస్తున్నాయి. ఒక్కో రేక్ సుమారు 4,000 నుంచి 4,500 టన్నుల బొగ్గును తీసుకెళ్తుంది. ఆదాయం పరంగా చూస్తే FY25లో రైల్వే ఫ్రీట్ ఆదాయం సుమారు రూ.2.62 లక్షల కోట్లు. ఇందులో బొగ్గు రవాణా ప్రధాన భాగంగా ఉంది.

బొగ్గు తరలింపు సమయంలో నీళ్లు ఎందుకు చల్లుతారు?

బొగ్గు గనుల నుంచి రైలు వ్యాగన్లలో బొగ్గును తరలించే సమయంలో బొగ్గు మీద నీళ్లును చల్లుతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి చల్లే వ్యవస్థ కింది నుంచి బోగీలు వెల్లడం ద్వారా బొగ్గు బాగా తడిసిపోతుంది. అయితే, నీటిని చల్లడం వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ ధూళి నియంత్రణ

బొగ్గు లోడ్ చేసే సమయంలో, రవాణా సమయంలో గాలి వల్ల బొగ్గు ధూళి ఎగిరిపోతుంది. ఇది పర్యావరణాన్ని కలుషితం చేయడమే కాక, ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. నీళ్లు చల్లడం వల్ల ధూళి తడిగా మారి ఎగరకుండా ఉంటుంది.

⦿ భద్రత

బొగ్గు ధూళి గాలిలో ఎగిరితే, అది రైలు యంత్రాంగం, సమీపంలోని విద్యుత్ లైన్లలో చేరి సాంకేతిక సమస్యలను సృష్టించవచ్చు. నీళ్లు చల్లడం దీనిని నివారిస్తుంది.

⦿ మంటల నివారణ

బొగ్గు సహజంగా మండే పదార్థం. అధిక ఉష్ణోగ్రతల్లో లేదంటే ఘర్షణ వల్ల బొగ్గు మంటలు చెలరేగే అవకాశం ఉంది. నీళ్లు చల్లడం వల్ల బొగ్గు తడిగా ఉండి, మంటలు రాకుండా నిరోధిస్తుంది.

Read Also: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

⦿ నష్టం తగ్గించడం

బొగ్గు ఎగిరిపోవడం వల్ల రవాణా సమయంలో కొంత బొగ్గు నష్టపోతుంది. నీళ్లు చల్లడం ద్వారా ఈ నష్టాన్ని తగ్గించవచ్చు.  సాధారణంగా ఈ ప్రక్రియ పర్యావరణ రక్షణ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. రవాణా సమయంలో భద్రతను పెంచుతుంది.

Read Also: రైల్వే టికెట్ తో ఇన్ని ఫ్రీ సదుపాయాలా? అస్సలు ఊహించి ఉండరు!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×