E-Paper
Advertisement

IRCTC Rameswaram Trip: IRCTC రామేశ్వరం ట్రిప్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

IRCTC Rameswaram Trip: IRCTC రామేశ్వరం ట్రిప్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?
Advertisement

IRCTC Rameswaram Tour Package: సమ్మర్ వేళ IRCTC మరో క్రేజీ టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది. సౌత్ ఇండియాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామేశ్వరాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ టూర్ బెంగళూరు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీ ఛార్జ్ ఎంత? ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఏ సదుపాయాలు కల్పిస్తారు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రామేశ్వరం టూర్ ప్యాకేజీ గురించి..  

ఈ టూర్ ప్యాకేజీ బెంగళూరు, నాగర్‌ కోయిల్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు బోర్డింగ్ స్టేషన్ల నుంచి టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీ 4 రాత్రులు, 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ టూర్ ప్రతి గురువారం ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీలో కన్యాకుమారి, రామేశ్వరం పర్యటన ఉంటుంది. పర్యాటక ప్రదేశంలో క్యాబ్‌ లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇది షేర్డ్ పద్ధతిలో ఉంటుంది.  ఈ ప్యాకేజీ పేరు బెంగళూరు – కన్యాకుమారి – రామేశ్వరం – మదురై టూర్ ప్యాకేజీ.

రామేశ్వరం టూర్ ప్యాకేజీ ఛార్జ్

Advertisement

ఇక ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి సింగిల్ టూరిస్టులకు టూర్ ప్యాకేజీ రూ. 25,090 ఉంటుంది. కుటుంబంతో కలిసి ప్రయాణిస్తుంటే, ఈ ప్యాకేజీ మరింత లాభాన్ని కలిగిస్తుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి వెళ్తే,  ఒక్కొక్కరు రూ. 13,480 చెల్లించాలి. ముగ్గురు వ్యక్తులు కలిసి వెళ్తే, ఒక్కొక్కరికి రూ.10,120 ఛార్జ్ చేస్తారు. పిల్లలకు రూ. 6,820 పే చేయాల్సి ఉంటుంది.

ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు

రామేశ్వరం టూర్ లో భాగంగా 3AC,  స్టాండర్డ్ ప్యాకేజీలకు SLలో రానుపోను రైలు ప్రయాణం ఉంటుంది. కన్యాకుమారి,  రామేశ్వరంలో ఒక రాత్రి హోటల్ వసతి లభిస్తుంది. స్టాండర్డ్, కంఫర్ట్ ప్యాకేజీలు AC  క్యాబ్‌ లో ప్రయాణాన్ని అందిస్తుంది. యాత్ర సమయంలో అన్ని పర్యాటక ప్రదేశాలను సందర్శించే సౌకర్యం కల్పించబడుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి ఇండియన్ రైల్వే అధికారిక వెబ్ సైట్, యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also:  జస్ట్ లక్షకే ఫారిన్ టూర్, IRCTC అదిరిపోయే ఆఫర్!

టిక్కెట్ బుక్ చేసుకునే ముందు ఇవి తెలుసుకోండి!

ఈ ప్యాకేజీ ప్రయాణికులకు మూడు గమ్యస్థానాలను సందర్శించే అవకాశాన్ని అందిస్తుంది. టిక్కెట్‌ ను బుక్ చేసుకునే ముందు, ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలు, క్యాన్సిల్ ఛార్జీల గురించి  తెలుసుకోవాలి. తరచుగా, ప్రయాణికులు ఏదో ఒక కారణం చేత తమ టూర్ ప్యాకేజీలను రద్దు చేసుకుంటారు. చాలా ప్యాకేజీ ఆపరేటర్లు రీఫండ్‌ల విషయంలో సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది. రైల్వే టూర్ ప్యాకేజీల విషయంలో ఇది వర్తించదు. నిబంధనల ప్రకారం పని చేస్తుంది. అనుకోని కారణాలతో రద్దు చేసుకున్నప్పుడు లభించే రీఫండ్ మొత్తం ముందుగానే తెలియజేస్తుంది.

Read Also:  తక్కువ ఖర్చుతో లడాఖ్ టూర్ ప్యాకేజీ, IRCTC సూపర్ ఆఫర్!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×