E-Paper
Advertisement

IRCTC Rameswaram Trip: IRCTC రామేశ్వరం ట్రిప్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

IRCTC Rameswaram Trip: IRCTC రామేశ్వరం ట్రిప్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

IRCTC Rameswaram Tour Package: సమ్మర్ వేళ IRCTC మరో క్రేజీ టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది. సౌత్ ఇండియాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామేశ్వరాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ టూర్ బెంగళూరు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీ ఛార్జ్ ఎంత? ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఏ సదుపాయాలు కల్పిస్తారు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రామేశ్వరం టూర్ ప్యాకేజీ గురించి..  

ఈ టూర్ ప్యాకేజీ బెంగళూరు, నాగర్‌ కోయిల్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు బోర్డింగ్ స్టేషన్ల నుంచి టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీ 4 రాత్రులు, 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ టూర్ ప్రతి గురువారం ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీలో కన్యాకుమారి, రామేశ్వరం పర్యటన ఉంటుంది. పర్యాటక ప్రదేశంలో క్యాబ్‌ లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇది షేర్డ్ పద్ధతిలో ఉంటుంది.  ఈ ప్యాకేజీ పేరు బెంగళూరు – కన్యాకుమారి – రామేశ్వరం – మదురై టూర్ ప్యాకేజీ.

రామేశ్వరం టూర్ ప్యాకేజీ ఛార్జ్

ఇక ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి సింగిల్ టూరిస్టులకు టూర్ ప్యాకేజీ రూ. 25,090 ఉంటుంది. కుటుంబంతో కలిసి ప్రయాణిస్తుంటే, ఈ ప్యాకేజీ మరింత లాభాన్ని కలిగిస్తుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి వెళ్తే,  ఒక్కొక్కరు రూ. 13,480 చెల్లించాలి. ముగ్గురు వ్యక్తులు కలిసి వెళ్తే, ఒక్కొక్కరికి రూ.10,120 ఛార్జ్ చేస్తారు. పిల్లలకు రూ. 6,820 పే చేయాల్సి ఉంటుంది.

ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు

రామేశ్వరం టూర్ లో భాగంగా 3AC,  స్టాండర్డ్ ప్యాకేజీలకు SLలో రానుపోను రైలు ప్రయాణం ఉంటుంది. కన్యాకుమారి,  రామేశ్వరంలో ఒక రాత్రి హోటల్ వసతి లభిస్తుంది. స్టాండర్డ్, కంఫర్ట్ ప్యాకేజీలు AC  క్యాబ్‌ లో ప్రయాణాన్ని అందిస్తుంది. యాత్ర సమయంలో అన్ని పర్యాటక ప్రదేశాలను సందర్శించే సౌకర్యం కల్పించబడుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి ఇండియన్ రైల్వే అధికారిక వెబ్ సైట్, యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Read Also:  జస్ట్ లక్షకే ఫారిన్ టూర్, IRCTC అదిరిపోయే ఆఫర్!

టిక్కెట్ బుక్ చేసుకునే ముందు ఇవి తెలుసుకోండి!

ఈ ప్యాకేజీ ప్రయాణికులకు మూడు గమ్యస్థానాలను సందర్శించే అవకాశాన్ని అందిస్తుంది. టిక్కెట్‌ ను బుక్ చేసుకునే ముందు, ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలు, క్యాన్సిల్ ఛార్జీల గురించి  తెలుసుకోవాలి. తరచుగా, ప్రయాణికులు ఏదో ఒక కారణం చేత తమ టూర్ ప్యాకేజీలను రద్దు చేసుకుంటారు. చాలా ప్యాకేజీ ఆపరేటర్లు రీఫండ్‌ల విషయంలో సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది. రైల్వే టూర్ ప్యాకేజీల విషయంలో ఇది వర్తించదు. నిబంధనల ప్రకారం పని చేస్తుంది. అనుకోని కారణాలతో రద్దు చేసుకున్నప్పుడు లభించే రీఫండ్ మొత్తం ముందుగానే తెలియజేస్తుంది.

Read Also:  తక్కువ ఖర్చుతో లడాఖ్ టూర్ ప్యాకేజీ, IRCTC సూపర్ ఆఫర్!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×