ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాతా వైష్ణోదేవిని దర్శించుకోవాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ఖర్యులో సౌకర్యవంతంగా వెళ్లే అవకాశం కల్పిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలను IRCTC సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ప్రయాణం ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. పర్యాటకులు వారి అవసరాలకు అనుగుణంగా వివిధ ఎంపికలను అందిస్తుంది.
ప్రయాణికులకు రెండు ప్రధాన ఎంపికలు అందబాటులో ఉంచినట్లు IRCTC వెల్లడించింది.
⦿ 4 పగళ్లు/3 రాత్రుల ప్లాన్: ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి రూ.6,990 నుంచి రూ. 8,420 వరకు ఉంటాయి.
⦿ వందే భారత్ ప్రత్యేక ప్యాకేజీ (2 పగళ్ళు/1 రాత్రి): ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి ఛార్జ్ రూ. 7,360 నుంచి ప్రారంభం అవుతుంది. ప్రయాణికులు వారి సౌలభ్యం ప్రకారం వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చు.
ఆదివారం నుంచి గురువారం వరకు ప్రయాణానికి వర్తించే 4-రోజులు, 3-రాత్రి ప్యాకేజీ (MATA VAISHNODEVI EX DELHI – WEEKDAY) IRCTC ఛార్జీల వివరాలను కూడా ప్రకటించింది.
కంఫర్ట్ క్లాస్ (3AC)
ట్రిపుల్ ఆక్యుపెన్సీ- 6,990
డబుల్ ఆక్యుపెన్సీ- రూ.8,100
సింగిల్ ఆక్యుపెన్సీ- రూ.10,770
పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్తో)- రూ.6,320
పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్ లేకుండా)- రూ.5,255
ట్రిపుల్ ఆక్యుపెన్సీ- రూ.8,220
డబుల్ ఆక్యుపెన్సీ- 9,330
సింగిల్ ఆక్యుపెన్సీ- రూ.11,995
పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్తో)- రూ.7,550
పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్ లేకుండా)- రూ.6,485
పర్యాటకులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని బుక్ చేసుకోవడానికి IRCTC అధికారిక వెబ్ సైట్ ను చూడాలని కోరింది. ప్రయాణికులు తమ సౌలభ్యం ప్రకారం యాత్రను ప్లాన్ చేసుకోవడానికి, బుక్ చేసుకోవడానికి మరింత సమాచారం కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ ను చూడాలని చెప్పింది. మాతా వైష్ణోదేవి యాత్రకు సంబంధించిన ఇతర టూర్ ప్యాకేజీల గురించి పూర్తి వివరాలను రైల్వే టికెట్ బుకింగ్ కేంద్రాల దగ్గర తెలుసుకోవచ్చన్నారు రైల్వే అధికారులు.
Your path to divinity begins with IRCTC’s all-inclusive Mata Vaishnodevi tour packages. Departing from Delhi, travel in comfort with 3N/4D plans (₹6,990*–₹8,420*) or take the convenient Vande Bharat 1N/2D package (₹7,360*). Frequent departures ensure your spiritual journey… pic.twitter.com/kQLLWUCun8
— IRCTC (@IRCTCofficial) October 24, 2025
Read Also: నల్ల రంగులో వందే భారత్.. బీజేపీ మంత్రి ట్వీట్ చూసి అంతా షాక్, అసలు విషయం ఏమిటంటే?