E-Paper
Advertisement

IRCTC Tour Package: మాతా వైష్ణోదేవిని దర్శించుకోవాలనుందా? అయితే, మీకో గుడ్ న్యూస్!

IRCTC Tour Package: మాతా వైష్ణోదేవిని దర్శించుకోవాలనుందా? అయితే, మీకో గుడ్ న్యూస్!
Advertisement

IRCTC Mata Vaishnodevi Tour Package:

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాతా వైష్ణోదేవిని దర్శించుకోవాలనుకునే పర్యాటకుల కోసం  ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ఖర్యులో సౌకర్యవంతంగా వెళ్లే అవకాశం కల్పిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలను IRCTC సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ప్రయాణం ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. పర్యాటకులు వారి అవసరాలకు అనుగుణంగా వివిధ ఎంపికలను అందిస్తుంది.

టూర్ ప్యాకేజీ ఆప్షన్స్, ఛార్జీ వివరాలు

ప్రయాణికులకు రెండు ప్రధాన ఎంపికలు అందబాటులో ఉంచినట్లు IRCTC వెల్లడించింది.

Advertisement

⦿ 4 పగళ్లు/3 రాత్రుల ప్లాన్: ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి రూ.6,990 నుంచి రూ. 8,420 వరకు ఉంటాయి.

⦿ వందే భారత్ ప్రత్యేక ప్యాకేజీ (2 పగళ్ళు/1 రాత్రి): ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి ఛార్జ్ రూ. 7,360 నుంచి ప్రారంభం అవుతుంది. ప్రయాణికులు వారి సౌలభ్యం ప్రకారం వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చు.

MATA VAISHNODEVI EX DELHI ప్యాకేజీ వివరాలు

Advertisement

ఆదివారం నుంచి గురువారం వరకు ప్రయాణానికి వర్తించే 4-రోజులు, 3-రాత్రి ప్యాకేజీ (MATA VAISHNODEVI EX DELHI – WEEKDAY) IRCTC ఛార్జీల వివరాలను కూడా ప్రకటించింది.

⦿ క్లాస్ ఆక్యుపెన్సీ ఛార్జీ (ఒక్కొక్కరికి)

కంఫర్ట్ క్లాస్ (3AC)

ట్రిపుల్ ఆక్యుపెన్సీ-  6,990

డబుల్ ఆక్యుపెన్సీ- రూ.8,100

సింగిల్ ఆక్యుపెన్సీ- రూ.10,770

పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్‌తో)- రూ.6,320

పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్ లేకుండా)- రూ.5,255

⦿ సుపీరియర్ క్లాస్ (2AC)

ట్రిపుల్ ఆక్యుపెన్సీ- రూ.8,220

డబుల్ ఆక్యుపెన్సీ- 9,330

సింగిల్ ఆక్యుపెన్సీ- రూ.11,995

పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్‌తో)- రూ.7,550

పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్‌ లేకుండా)- రూ.6,485

టూర్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?

పర్యాటకులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని బుక్ చేసుకోవడానికి IRCTC అధికారిక వెబ్ సైట్ ను చూడాలని కోరింది.  ప్రయాణికులు తమ సౌలభ్యం ప్రకారం యాత్రను ప్లాన్ చేసుకోవడానికి, బుక్ చేసుకోవడానికి మరింత సమాచారం కోసం IRCTC అధికారిక వెబ్‌ సైట్‌ ను చూడాలని చెప్పింది. మాతా వైష్ణోదేవి యాత్రకు సంబంధించిన ఇతర టూర్ ప్యాకేజీల గురించి పూర్తి వివరాలను రైల్వే టికెట్ బుకింగ్ కేంద్రాల దగ్గర తెలుసుకోవచ్చన్నారు రైల్వే అధికారులు.

Read Also:  నల్ల రంగులో వందే భారత్.. బీజేపీ మంత్రి ట్వీట్ చూసి అంతా షాక్, అసలు విషయం ఏమిటంటే?

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×