E-Paper
Advertisement

Black Vande Bharat: నల్ల రంగులో వందే భారత్.. బీజేపీ మంత్రి ట్వీట్ చూసి అంతా షాక్, అసలు విషయం ఏమిటంటే?

Black Vande Bharat: నల్ల రంగులో వందే భారత్.. బీజేపీ మంత్రి ట్వీట్ చూసి అంతా షాక్, అసలు విషయం ఏమిటంటే?

అత్యాధునిక వసతులు, అత్యధిక వేగంతో అందుబాటులోకి వచ్చిన వందేభారత్ రైళ్లు భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి. భారతీయ ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 150కి పైగా వందేభారత్ రైళ్లు పలు మార్గాల్లో సర్వీసులు అందిస్తున్నాయి. త్వరలోనే మరింత వేగంతో రాత్రి ప్రయాణాలకు అనుగుణంగా తయారు చేసిన వందేభారత్ స్లీపర్ రైళ్లకు కూడా కమర్షియల్ ఆపరేషన్స్ మొదలు పెట్టబోతున్నాయి. ఇప్పటికే ఈ రైళ్లు అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే వీటిని అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

వందేభారత్ స్లీపర్ నలుపు రంగులోకి మారనుందా?

ప్రస్తుతం దేశంలో నడుస్తున్న వందేభారత్ రైళ్లు మొదట్లో తెలుపు- నీలం రంగు కాంబినేషన్ లో వచ్చాయి. ఆ తర్వాత ఆరెంజ్- బ్లాక్ రంగును అద్దుకున్నాయి. రీసెంట్ గా ట్రయల్స్ జరుపుకున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా ఆరెంజ్- బ్లాక్ కాంబినేషన్ లోనే కనిపించాయి. అయితే, తాజాగా నలుపు రంగులో ఉన్న వందే భారత్ రైలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అయిన సత్య కుమార్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను షేర్ చేశారు. ఆ తర్వాత ఈ రైలు డిజైన్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ఇంతకీ ఆ వీడియో నిజమైనదేనా?

ఇక ఈ వీడియోను నిశితంగా పరిశీలించి పలు సందేహాలు వ్యక్తం చేశారు నెటిజన్లు. ఇది డిజిటల్ మానిప్యులేషన్ కు సంబంధించి స్పష్టమైన సంకేతాలను అందిస్తుంది. వీడియోలో చిత్రీకరించబడిన రైలు యూరోపియన్ శైలి స్లీపర్ కోచ్ డిజైన్, దానిపై  రాసిన రాతలు, AI  జనరేటెడ్ వీడియోగా కనిపిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, రైలు ముందు భాగంలో వందే భారత్ పేరుతో పాటు మినీ కూపర్ లోగో కనిపిస్తుంది. కొత్త రైలుకు సంబంధించి నిజమైన వివరాల కంటే, కంప్యూటర్-జనరేట్ చేయబడిందని సూచించే విషయాలే ఎక్కువగా కనపిస్తున్నాయి.

Read Also:  చైనా కొత్త బుల్లెట్ రైలు వచ్చేసింది, వామ్మో ఇదేం స్పీడ్ గురూ!

ప్రస్తుత వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ ను బ్లాక్, ఆరెంజ్ కాంబోలో అద్భుతంగా రూపొందించారు. చక్కటి లుక్ తో పాటు  ఏరోడైనమిక్ కోచ్‌ లను కలిగి ఉంది. డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది. రాత్రిపూట ప్రయాణాల కోసం రూపొందించబడిన ఈ రైళ్లు.. మల్టీ ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ కోచ్‌ లతో నడుస్తాయి. త్వరలో అందుబాటులోకి రానున్న వందే భారత్ స్లీపర్ వెర్షన్, దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన భారతీయ సౌందర్యాన్ని కొనసాగిస్తూ సౌకర్యం, సాంకేతికతపై దృష్టి పెట్టనుంది. నల్లటి వందే భారత్ అనేది నిజమైన వీడియో కాదని చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also:  IRCTC వెబ్‌ సైట్ మళ్లీ డౌన్.. కారణం ఇదేనట, మీకు ఓపెన్ అవుతోందా?

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×