E-Paper
Advertisement

Black Vande Bharat: నల్ల రంగులో వందే భారత్.. బీజేపీ మంత్రి ట్వీట్ చూసి అంతా షాక్, అసలు విషయం ఏమిటంటే?

Black Vande Bharat: నల్ల రంగులో వందే భారత్.. బీజేపీ మంత్రి ట్వీట్ చూసి అంతా షాక్, అసలు విషయం ఏమిటంటే?
Advertisement

అత్యాధునిక వసతులు, అత్యధిక వేగంతో అందుబాటులోకి వచ్చిన వందేభారత్ రైళ్లు భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి. భారతీయ ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 150కి పైగా వందేభారత్ రైళ్లు పలు మార్గాల్లో సర్వీసులు అందిస్తున్నాయి. త్వరలోనే మరింత వేగంతో రాత్రి ప్రయాణాలకు అనుగుణంగా తయారు చేసిన వందేభారత్ స్లీపర్ రైళ్లకు కూడా కమర్షియల్ ఆపరేషన్స్ మొదలు పెట్టబోతున్నాయి. ఇప్పటికే ఈ రైళ్లు అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే వీటిని అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

వందేభారత్ స్లీపర్ నలుపు రంగులోకి మారనుందా?

ప్రస్తుతం దేశంలో నడుస్తున్న వందేభారత్ రైళ్లు మొదట్లో తెలుపు- నీలం రంగు కాంబినేషన్ లో వచ్చాయి. ఆ తర్వాత ఆరెంజ్- బ్లాక్ రంగును అద్దుకున్నాయి. రీసెంట్ గా ట్రయల్స్ జరుపుకున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా ఆరెంజ్- బ్లాక్ కాంబినేషన్ లోనే కనిపించాయి. అయితే, తాజాగా నలుపు రంగులో ఉన్న వందే భారత్ రైలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అయిన సత్య కుమార్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను షేర్ చేశారు. ఆ తర్వాత ఈ రైలు డిజైన్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Advertisement

ఇంతకీ ఆ వీడియో నిజమైనదేనా?

ఇక ఈ వీడియోను నిశితంగా పరిశీలించి పలు సందేహాలు వ్యక్తం చేశారు నెటిజన్లు. ఇది డిజిటల్ మానిప్యులేషన్ కు సంబంధించి స్పష్టమైన సంకేతాలను అందిస్తుంది. వీడియోలో చిత్రీకరించబడిన రైలు యూరోపియన్ శైలి స్లీపర్ కోచ్ డిజైన్, దానిపై  రాసిన రాతలు, AI  జనరేటెడ్ వీడియోగా కనిపిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, రైలు ముందు భాగంలో వందే భారత్ పేరుతో పాటు మినీ కూపర్ లోగో కనిపిస్తుంది. కొత్త రైలుకు సంబంధించి నిజమైన వివరాల కంటే, కంప్యూటర్-జనరేట్ చేయబడిందని సూచించే విషయాలే ఎక్కువగా కనపిస్తున్నాయి.

Advertisement

Read Also:  చైనా కొత్త బుల్లెట్ రైలు వచ్చేసింది, వామ్మో ఇదేం స్పీడ్ గురూ!

ప్రస్తుత వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ ను బ్లాక్, ఆరెంజ్ కాంబోలో అద్భుతంగా రూపొందించారు. చక్కటి లుక్ తో పాటు  ఏరోడైనమిక్ కోచ్‌ లను కలిగి ఉంది. డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది. రాత్రిపూట ప్రయాణాల కోసం రూపొందించబడిన ఈ రైళ్లు.. మల్టీ ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ కోచ్‌ లతో నడుస్తాయి. త్వరలో అందుబాటులోకి రానున్న వందే భారత్ స్లీపర్ వెర్షన్, దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన భారతీయ సౌందర్యాన్ని కొనసాగిస్తూ సౌకర్యం, సాంకేతికతపై దృష్టి పెట్టనుంది. నల్లటి వందే భారత్ అనేది నిజమైన వీడియో కాదని చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also:  IRCTC వెబ్‌ సైట్ మళ్లీ డౌన్.. కారణం ఇదేనట, మీకు ఓపెన్ అవుతోందా?

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×