Kakanmath Temple: మధ్యప్రదేశ్లోని మొరీనా జిల్లాలోని సిహోనియా అనే చిన్న గ్రామంలో ఓ ప్రమాదకరమైన ఆలయం ఉంది. దీన్ని నిర్మించడానికి కేవలం ఒక్క రాత్రే పట్టిందట. అది కూడా అతీంద్రియ శక్తుల సహాయంతో..! అయితే ఈ ఆలయం కాస్త ప్రమాదకరమైనదని చాలా మంది చెబుతారు. అసలు ఆలయం ప్రమాదకరంగా ఎందుకు మారింది? దీని వెనకున్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దెయ్యాలు నిర్మించిన ఆలయం..!
ఇది11వ శతాబ్దంలో శివుడి కోసం నిర్మించిన ఈ ఆలయం, అద్భుతమైన రాతి చెక్కడాలు, 115 అడుగుల ఎత్తైన గోపురంతో చరిత్రకారులను, ఆధ్యాత్మిక యాత్రికులను ఆకర్షిస్తోంది. అంతేకాదు, ఒక్క రాత్రిలో దేవతలు, దెయ్యాల సాయంతో ఈ ఆలయం నిర్మాణం జరిగిందనే స్థానిక కథ దీని రహస్యాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తుంది.
కచ్ఛపఘాట రాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం, అద్దం లేకుండా రాళ్లను ఖచ్చితంగా అమర్చి రూపొందించారు. ఈ బలమైన నిర్మాణం తుఫానులను, దాడులను సైతం తట్టుకొని నిలిచింది. ఆలయంలోని శివలింగం భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటూ, దాని గొప్ప చరిత్రను చెప్పకనే చెబుతోంది.
ALSO READ: శివరాత్రి సమయంలోనే కనిపించే లింగాలు.. ఆ ప్రదేశం అంత శక్తివంతమైనదా?
స్థానికులు చెప్పే కథ ప్రకారం, కచ్ఛపఘాట రాజు శివుడి కోసం గొప్ప ఆలయం కట్టాలని కలలు కన్నాడు. కానీ, నిర్మాణంలో సమస్యలు రావడంతో దైవ సాయం కోరాడు. ఒక రాత్రి, శివుడు కలలో కనిపించి, దెయ్యాలు, అతీంద్రియ శక్తుల సాయంతో ఒక్క రాత్రిలో ఆలయాన్ని పూర్తి చేస్తానని చెప్పాడు. కానీ, ఎవరూ దీన్ని చూడకూడదని శరతు పెడతాడు. రాజు అంగీకరించి, గ్రామస్తులందరినీ ఇళ్లలోనే ఉండమని చెప్పాడు.
ఒక చిన్న పిల్లాడు, ఆసక్తి ఆపుకోలేక, రహస్యంగా నిర్మాణం చూశాడు. దీంతో దైవ ఒప్పందం భంగమై, నిర్మాణం ఆగిపోయింది. ఆలయం దాదాపు పూర్తయినా, కొన్ని చిన్న లోపాలు మిగిలాయి. ఈ కథను స్థానికులు, సందర్శకులు ఇప్పటికీ చెప్పుకుంటూ, ఆలయ రాళ్లను చూసి ఆశ్చర్యపోతారు.
ఫిరంగి గుండ్లు కూడా కూల్చలేని ఆలయం..
ఈ ఆలయం నిర్మాణం నిజంగా అద్భుతం. అద్దం లేకుండా రాళ్లను అమర్చిన డిజైన్ ఆధునిక ఇంజనీర్లను కూడా ఆశ్చర్యపరుస్తుంది. దేవతలు, పురాణ జీవులు, ఖగోళ చిత్రాలతో కూడిన చెక్కడాలు మధ్యయుగ భారత కళను చూపిస్తాయి. దాడి చేసినవారు, ముస్లిం పాలకులు ఫిరంగి గుండ్లతో కూడా ఈ ఆలయాన్ని కూల్చలేకపోయారని చెబుతారు. అంత బలంగా నిలిచిన ఈ ఆలయం సిహోనియా ఆధ్యాత్మిక వారసత్వానికి సాక్షంగా నిలుస్తోంది.
ఈ ఆలయం కాకన్వతి రాణితో కూడా ముడిపడి ఉంది. ఆమె శివభక్తి ఈ ఆలయ నిర్మాణానికి స్ఫూర్తి అని చెబుతారు. కొందరు ఆలయం పేరు ఆమె నుండి వచ్చిందని కూడా నమ్ముతారు.
సాయంత్రం నీడలు ఆలయ రాళ్లపై పడినప్పుడు, ఒక్క రాత్రిలో దేవతలు నిర్మించిన ఈ అద్భుతాన్ని చూస్తే, రహస్యమైన చరిత్రలోకి లాగినట్లు అనిపిస్తుంది. కాకన్మఠ్ ఆలయం, చరిత్రకు, భక్తికి, రహస్యానికి ఒక అద్దం లాంటిది.
ఎందుకు ప్రమాదకరం?
ఇది శివుడికి అంకితంగా ఇచ్చిన ఆలయమే అయినప్పటికీ కొంచం ప్రమాదకరమైనదని కొందరు చెబుతారు. దెయ్యాలు, అతీంద్రియ శక్తులు నిర్మించాయని కథలు తరచుగా వినిపిస్తాయి కాబట్టి ప్రమాదకరమని కొందరు నమ్ముతారు. ఎవరైనా ఆలయంలో పేర్చిన రాళ్లను తొలగిస్తే కూలిపోయి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి డేంజర్ అని అంటారని మరికొందరు చెబుతారు.