E-Paper
Advertisement

Vande Bharat AC Coach: వందేభారత్ స్లీపర్ ఏసీ కోచ్.. చూస్తే వావ్ అనాల్సిందే!

Vande Bharat AC Coach: వందేభారత్ స్లీపర్ ఏసీ కోచ్.. చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Vande Bharat Sleeper Train First AC Coach:

భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారల్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించిన రూట్ల రైల్వే బోర్డు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వందేభారత్ స్లీపర్ రైలు కోసం ఉపయోగించే ఏసీ కోచ్ లను రష్యన్ కంపెనీ కైనెట్ రైల్వే సొల్యూషన్స్ ఆవిష్కరించింది. నాలుగు బెర్త్ కంపార్ట్‌ మెంట్లు, USB పోర్ట్‌ లు, ప్రైవసీ లేఅవుట్లు, ఆకట్టుకునే ఇంటీరియర్‌ తో వావ్ అనిపిస్తున్నాయి. ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించేలా ఈ కోచ్ లను తీర్చిదిద్దింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన 2025లో కైనెట్ రైల్వే సొల్యూషన్స్ వందే భారత్ స్లీపర్ రైలు కోసం మొదటి AC కోచ్ డిజైన్‌ను ఆవిష్కరించింది.

ఇండో-రష్యన్ జాయింట్ వెంచర్  

వందేభారత్ స్లీపర్ రైళ్ల కోచ్ ల తయారీ ప్రాజెక్ట్ కు సంబంధించి కైనెట్ రైల్వే సొల్యూషన్స్ తో పాటు TMH, RVNL కీలక ఒప్పందాలు చేసుకున్నాయి.  ఈ ఒప్పందం ప్రకారం 120 వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ సెట్లను తయారు చయనున్నాయి. మొత్తం 1920 కోచ్‌ ల తయారీకి సంబంధించి BEML కైనెట్, టిటాగఢ్ BHEL కన్సార్టియం ఒప్పందాలు జరిగాయి.

ఆకట్టుకునేలా ఇంటీరియర్ డిజైన్ ఫీచర్లు  

Advertisement

ఫస్ట్ AC కోచ్‌ లో ప్రైవసీ, సౌకర్యానికి క్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నాలుగు బెర్త్ ల కంపార్ట్‌ మెంట్ ఉంది. ఇన్ బిల్ట్  USB పోర్ట్‌ లతో పాటు పర్సనల్ రీడింగ్ లైట్లు ఉన్నాయి. ఇవి ప్రయాణీకుల సౌలభ్యాన్ని మరింత పెంచనున్నాయి. ఈ కోచ్ లో పై బెర్తులకు ఎక్కేలా మెట్లు ఉన్నాయి. ఇవి కింది వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించవు. మెట్ల క్రింద ఉన్న స్థలాన్ని కూడా వ్యక్తిగత వస్తువులను ఉంచుకునేలా ఏర్పాటు చేశారు.

Read Also: వావ్.. 7 వేల కిలోమీటర్ల బుల్లెట్ రైలు కారిడార్, అదిరిపోయే న్యూస్ చెప్పిన అశ్విని వైష్ణవ్!

ఆకట్టుకునేలా కోచ్ డిజైన్

Advertisement

ఇంటీరియర్ డిజైన్ సాఫ్ట్ టోన్‌ లను కలిగి ఉంది. చూడగానే ఆకట్టుకునే లుక్ తో వావ్ అనిపిస్తున్నాయి.  గోధుమ, ఆరెంజ్ కలర్ కూడిన కోచ్ అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక AC కోచ్ నమూనా జూన్ 2026 నాటికి ఆవిష్కరించబడుతుందని భావిస్తున్నారు. లాతూర్‌ లోని ఫ్యాక్టరీతో పాటు మరాఠ్వాడ రైల్ కోచ్‌ లో వీటిని తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు యూనిట్లు పూర్తిగా సిద్ధమైన తర్వాత ఒకేసారి రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని భారతీయ రైల్వే భావిస్తోంది. దీర్ఘకాలిక కార్యకలాపాలకు మద్దతుగా ఢిల్లీ, బెంగళూరులో శాటిలైట్ సౌకర్యాలతో జోధ్‌ పూర్‌ లో మెయింటెనెన్స్  డిపోలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: రాపిడో ఇక సరికొత్తగా.. ఇకపై బస్సు, రైలు, విమాన, హోటల్ బుకింగ్ చేసుకోవచ్చు!

Related News

ఇండియన్ బుల్లెట్ రైల్ రెడీ.. ఇక పట్టాలు ఎక్కుడే తరువాయి..

భూగర్భంలో వింత నగరం.. ఏకంగా 20 వేల మంది హ్యాపీగా ఉండొచ్చు.. ఇంతకి ఎక్కడుందో తెలుసా?

భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు, అక్టోబర్ 27 నుంచి మరొక దేశానికి, వారానికి రెండు సార్లు

శ్రీకృష్ణుడి ద్వారకా తరహాలో.. సముద్ర గర్భంలో దాగి ఉన్న.. టాప్-5 ప్రాచీన నగరాలు ఇవే!

నాగార్జునసాగర్ టూర్ ఇక మరింత థ్రిల్లింగ్.. సరికొత్త అడ్వెంచర్ స్పాట్ గా ఎత్తిపోతల జలపాతం!

ఓరి దేవుడా.. కుక్కను వెతుక్కుంటూ వెళ్తే.. 17 వేల ఏళ్ల నాటి అద్భుతాలు బయటపడ్డాయ్!

ఉప్పునీటి సరస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లిన వందే భారత్.. చూస్తే కళ్ళు చెదిరి పోవాల్సిందే!

అడవిలో పారేసిన 12 టన్నుల నారింజ వ్యర్థాలు.. 15 ఏళ్ల తర్వాత జరిగింది చూసి.. యావత్ ప్రపంచమే షాక్!

Big Stories

Advertisement
×