E-Paper
Advertisement

Train Tickets: కౌంటర్ టికెట్ ఛార్జీతో పోల్చితే, ఆన్ లైన్ లో కాస్ట్ ఎక్కువ? ఇదీ అసలు కథ!

Train Tickets: కౌంటర్ టికెట్ ఛార్జీతో పోల్చితే, ఆన్ లైన్ లో కాస్ట్ ఎక్కువ? ఇదీ అసలు కథ!
Advertisement

Indian Railway Tickets Booking: రోజూ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరలో ఆహ్లాదకర ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది రైలు ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. రైల్లో ప్రయాణించాలంటే టికెట్ తప్పనిసరిగా కావాల్సిందే. చాలా మంది ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. కొంత మంది ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే, మరికొంత మంది రైల్వే స్టేషన్ కౌంటర్ లో టికెట్లు తీసుకుంటారు. అయితే, కౌంటర్ లో టికెట్ తీసుకునే వారితో పోల్చితే ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకునే వారికి ఎక్కువ కాస్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటో తాజాగా రైల్వేశాఖ వివరణ ఇచ్చింది.

ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఎందుకు కాస్ట్ అంటే?

Advertisement

IRCTC ద్వారా ఆన్‌ లైన్‌ లో టికెట్ బుక్ చేసుకునే ప్రయాణీకులు కన్వినియన్స్ ఫీజు, లావాదేవీలకు సంబంధించిన ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కారణంగానే రైల్వే కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకునే వారితో పోల్చితే ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వాళ్లు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని వెల్లడించింది. IRCTC టికెట్ ధరలలో వ్యత్యాసాల గురించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ లేవనెత్తిన ప్రశ్నలకు..  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం చెప్పారు. “ఆన్‌ లైన్ టికెటింగ్ సౌకర్యాన్ని అందించడంలో IRCTC కీలకపాత్ర పోషిస్తుంది. టికెటింగ్ కు సంబంధించిన మౌలిక సదుపాయాల నిర్వహణ కోసం IRCTC ద్వారా అదనపు ఛార్జీలు వసూలు చేయబడుతాయి. ఆన్ లైన్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకునే వాళ్లు అదనంగా బ్యాంకులకు లావాదేవీ ఛార్జీలను కూడా చెల్లిస్తారు. ఈ కారణంగా ఆన్ లైన్ ద్వారా టికెట్లు పొందే వాళ్లు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది” అని రైల్వే మంత్రి తెలిపారు.

Read Also: 158 ఏండ్ల క్రితం పట్టాలెక్కిన రైలు, ఇప్పటికీ నడుస్తోంది, ఎక్కడో తెలుసా?

Advertisement

టికెట్ల ధర వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించిన రౌత్

అంతకు ముందు IRCTC టికెట్ల బుకింగ్ గురించి సంజయ్ రౌత్ కీలక ప్రశ్నను లేవనెత్తారు. ఆన్‌ లైన్‌ లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులు రైల్వే కౌంటర్లలో భౌతికంగా టికెట్లు కొనుగోలు చేసే వారి కంటే ఎక్కువ చెల్లించడానికి గల కారణాలు ఏంటో చెప్పాలన్నారు. ఈ ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. “IRCTC అందించే ఆన్‌ లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం, రిజర్వ్ చేయబడిన టికెట్లలో 80 శాతానికి పైగా ఆన్‌ లైన్‌ లో బుక్ చేయబడుతున్నాయి. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ విధానం వల్ల  ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకోవడానికి రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లాల్సిన ఇబ్బంది ఉండదు. ప్రయాణీకు సమయం, రవాణా ఖర్చులు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది” అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు, ఎన్ని కిలో మీటర్లు ఉంటుందో తెలుసా?

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×