Indian Railway Stations: దేశంలో 7300 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిలో కొన్నిఅద్భుతమైన నిర్మాణం, చారిత్రక విలువ, సహజ సౌందర్యంతో కనువిందు చేస్తున్నాయి. దేశంలో ప్రసిద్ధ రైల్వే స్టేషన్లలో టాప్ 10 స్టేషన్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
⦿ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), ముంబై
ఈ రైల్వే స్టేషన్ ను 1887లో నిర్మించారు. దీనిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్ ఈ రైల్వే స్టేషన్ ను డిజైన్ చేశారు. విక్టోరియన్ గోతిక్ రివైవల్, ఇండో-సరసెనిక్ శైలిలో నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ గోపురాలు, చెక్కడాలు, శిల్పాలు దీనిని ప్రత్యేకం ఆకర్షణగా నిలిపాయి.
⦿ చార్బాగ్ రైల్వే స్టేషన్, లక్నో
ఈ రైల్వే స్టేషన్ ను 1914లో నిర్మించారు. అవధీ, రాజపుత్ర, మొఘల్ శైలుల మిశ్రమంతో రూపొందించబడింది. చార్బాగ్ అంటే నాలుగు తోటలు అని అర్థం. ఈ స్టేషన్ నాలుగు తోటల నడుమ ఉంటుంది. పైనుంచి చూస్తే ఈ స్టేషన్ చదరంగం బోర్డులా కనిపిస్తుంది. స్తంభాలు, గోపురాలు చదరంగంలో పావుల మాదిరిగా ఉంటాయి.
⦿ హౌరా జంక్షన్, కోల్కతా
దేశంలోని అత్యంత పురాతనమైన, అతిపెద్ద రైల్వే స్టేషన్. దీనిని 1854లో నిర్మించారు. హుగ్లీ నది ఒడ్డున ఉన్న ఈ స్టేషన్ నియో-క్లాసికల్ శైలిలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హాల్సీ రికార్డో డిజైన్ చేశారు. ప్రస్తుతం 23 ప్లాట్ ఫామ్ లతో రోజుకు ఇక్కడి నుంచి 10 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు.
⦿ ఘుమ్ రైల్వే స్టేషన్, డార్జిలింగ్
దేశంలోని అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ ఇది. 2,258 మీటర్ల ఎత్తులో ఉంటుంది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలో భాగంగా కొనసాగుతోంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్టేషన్ చుట్టూ ఉన్న పొగమంచు కొండలు, టీ గార్డెన్లు ఆకట్టుకుంటాయి.
⦿ దూధ్సాగర్ రైల్వే స్టేషన్, గోవా
దూధ్సాగర్ జలపాతం సమీపంలో ఉన్న ఈ స్టేషన్ సహజ సౌందర్యంతో ప్రసిద్ధి చెందింది. దట్టమైన అడవులు, జలపాతం దృశ్యం పర్యాటక ఆకర్షణగా మార్చాయి. ‘చెన్నై ఎక్స్ప్రెస్’ సినిమా తర్వాత ఇది బాగా పాపులర్ అయింది.
⦿ విజయవాడ జంక్షన్, ఆంధ్రప్రదేశ్
1888లో నిర్మితమై ఈ రైల్వే స్టేషన్ సౌత్ ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఆధునిక, సాంప్రదాయ డిజైన్ మిశ్రమంతో ఆకట్టుకుంటుంది.
⦿ చెన్నై సెంట్రల్, తమిళనాడు
1873లో నిర్మితమైన ఈ స్టేషన్ గోతిక్ రివైవల్ శైలిలో అలరిస్తోంది. ఎరుపు ఇటుకలతో, 136 అడుగుల ఎత్తైన గడియార స్తంభం దీని ప్రత్యేకత.
⦿ కటక్ రైల్వే స్టేషన్, ఒడిషా
14వ శతాబ్దంలో నిర్మితమైన బరాబతి కోట ఆకారంలో రూపొందించబడింది. ఈ ఫోర్ట్ స్టైల్ ఆర్కిటెక్చర్ ప్రయాణీకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
⦿ జైసల్మేర్ రైల్వే స్టేషన్, రాజస్థాన్
తార్ ఎడారిలో ఉన్న ఈ స్టేషన్ బంగారు వర్ణంలో ఆకట్టకుంటుంది. రాజస్థాన్ రాజపుత్ర శైలి డిజై న్తో నిర్మించారు. ఈ స్టేషన్ లో లగ్జరీ రైళ్లు ఆగుతాయి.
⦿ బరోగ్ రైల్వే స్టేషన్, హిమాచల్ ప్రదేశ్
కల్కా-షిమ్లా రైల్వేలో భాగమైన ఈ చిన్న స్టేషన్ టన్నెల్ నంబర్ 33 సమీపంలో ఉంది. చుట్టూ హిమాలయ కొండలు, సహజ సౌందర్యం దీనిని మరింత అందంగా మార్చాయి.
Read Also: వామ్మో.. ఇండియన్ రైల్వే ఇన్ని ఆఫర్లు అందిస్తుందా? అస్సలు తెలియదే!