E-Paper
Advertisement

Beautiful Railway Stations: దేశంలో అత్యంత అందమైన 10 రైల్వే స్టేషన్లు, ఒక్కసారైనా చూసి తీరాల్సిందే!

Beautiful Railway Stations: దేశంలో అత్యంత అందమైన 10 రైల్వే స్టేషన్లు, ఒక్కసారైనా చూసి తీరాల్సిందే!
Advertisement

Indian Railway Stations: దేశంలో 7300 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిలో కొన్నిఅద్భుతమైన నిర్మాణం, చారిత్రక విలువ, సహజ సౌందర్యంతో కనువిందు చేస్తున్నాయి. దేశంలో ప్రసిద్ధ రైల్వే స్టేషన్లలో టాప్ 10 స్టేషన్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

⦿ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), ముంబై

Advertisement

ఈ రైల్వే స్టేషన్ ను 1887లో నిర్మించారు. దీనిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్ ఈ రైల్వే స్టేషన్ ను డిజైన్ చేశారు. విక్టోరియన్ గోతిక్ రివైవల్, ఇండో-సరసెనిక్ శైలిలో నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ గోపురాలు, చెక్కడాలు, శిల్పాలు దీనిని ప్రత్యేకం ఆకర్షణగా నిలిపాయి.

⦿ చార్‌బాగ్ రైల్వే స్టేషన్, లక్నో

Advertisement

ఈ రైల్వే స్టేషన్ ను 1914లో నిర్మించారు. అవధీ, రాజపుత్ర, మొఘల్ శైలుల మిశ్రమంతో రూపొందించబడింది. చార్‌బాగ్  అంటే నాలుగు తోటలు అని అర్థం. ఈ స్టేషన్ నాలుగు తోటల నడుమ ఉంటుంది. పైనుంచి చూస్తే ఈ స్టేషన్ చదరంగం బోర్డులా కనిపిస్తుంది. స్తంభాలు, గోపురాలు చదరంగంలో పావుల మాదిరిగా ఉంటాయి.

⦿ హౌరా జంక్షన్, కోల్‌కతా

దేశంలోని అత్యంత పురాతనమైన, అతిపెద్ద రైల్వే స్టేషన్. దీనిని 1854లో నిర్మించారు. హుగ్లీ నది ఒడ్డున ఉన్న ఈ స్టేషన్ నియో-క్లాసికల్ శైలిలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హాల్సీ రికార్డో డిజైన్ చేశారు. ప్రస్తుతం 23 ప్లాట్‌ ఫామ్‌ లతో రోజుకు ఇక్కడి నుంచి 10 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు.

⦿ ఘుమ్ రైల్వే స్టేషన్, డార్జిలింగ్

దేశంలోని అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ ఇది. 2,258 మీటర్ల ఎత్తులో ఉంటుంది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలో భాగంగా కొనసాగుతోంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్టేషన్ చుట్టూ ఉన్న పొగమంచు  కొండలు, టీ గార్డెన్‌లు ఆకట్టుకుంటాయి.

⦿ దూధ్‌సాగర్ రైల్వే స్టేషన్, గోవా

దూధ్‌సాగర్ జలపాతం సమీపంలో ఉన్న ఈ స్టేషన్ సహజ సౌందర్యంతో ప్రసిద్ధి చెందింది. దట్టమైన అడవులు, జలపాతం దృశ్యం పర్యాటక ఆకర్షణగా మార్చాయి. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా తర్వాత ఇది బాగా పాపులర్ అయింది.

⦿ విజయవాడ జంక్షన్, ఆంధ్రప్రదేశ్

1888లో నిర్మితమై ఈ రైల్వే స్టేషన్ సౌత్ ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఆధునిక, సాంప్రదాయ డిజైన్ మిశ్రమంతో ఆకట్టుకుంటుంది.

⦿ చెన్నై సెంట్రల్, తమిళనాడు

1873లో నిర్మితమైన ఈ స్టేషన్ గోతిక్ రివైవల్ శైలిలో అలరిస్తోంది. ఎరుపు ఇటుకలతో, 136 అడుగుల ఎత్తైన గడియార స్తంభం దీని ప్రత్యేకత.

⦿ కటక్ రైల్వే స్టేషన్, ఒడిషా

14వ శతాబ్దంలో నిర్మితమైన బరాబతి కోట ఆకారంలో రూపొందించబడింది. ఈ ఫోర్ట్ స్టైల్ ఆర్కిటెక్చర్ ప్రయాణీకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.

⦿ జైసల్మేర్ రైల్వే స్టేషన్, రాజస్థాన్

తార్ ఎడారిలో ఉన్న ఈ స్టేషన్ బంగారు వర్ణంలో ఆకట్టకుంటుంది. రాజస్థాన్ రాజపుత్ర శైలి డిజై న్‌తో నిర్మించారు. ఈ స్టేషన్ లో లగ్జరీ రైళ్లు ఆగుతాయి.

⦿ బరోగ్ రైల్వే స్టేషన్, హిమాచల్ ప్రదేశ్

కల్కా-షిమ్లా రైల్వేలో భాగమైన ఈ చిన్న స్టేషన్ టన్నెల్ నంబర్ 33 సమీపంలో ఉంది. చుట్టూ హిమాలయ కొండలు, సహజ సౌందర్యం దీనిని మరింత అందంగా మార్చాయి.

Read Also:  వామ్మో.. ఇండియన్ రైల్వే ఇన్ని ఆఫర్లు అందిస్తుందా? అస్సలు తెలియదే!

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×