E-Paper
Advertisement

నాగార్జునసాగర్ టూర్ ఇక మరింత థ్రిల్లింగ్.. సరికొత్త అడ్వెంచర్ స్పాట్ గా ఎత్తిపోతల జలపాతం!

నాగార్జునసాగర్ టూర్ ఇక మరింత థ్రిల్లింగ్.. సరికొత్త అడ్వెంచర్ స్పాట్ గా ఎత్తిపోతల జలపాతం!
Advertisement

Nagarjuna Sagar New Adventure Experience: నాగార్జునసాగర్‌కు వచ్చే పర్యాటకులు మరో అడ్వెంచర్ ఎక్స్ పీరియెన్స్ పొందే అవకాశం అందుబాటులోకి రాబోతోంది. సాగర్‌కు సమీపంలోని పల్నాడు జిల్లా పరిధిలో ఉన్న ఎత్తిపోతల జలపాతం  దగ్గర అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహించేలా కొత్త ఏర్పాట్లు చేశారు. జలపాతం అందాలను ఆస్వాదించడంతో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్అనుభూతిని పొందే అవకాశం ఇకపై పర్యాటకులకు లభించనుంది.

రూ.1.71 కోట్లతో కొత్త సదుపాయాలు

ఎత్తిపోతల జలపాతం దగ్గర జిప్‌లైన్, జిప్ సైక్లింగ్ ఏర్పాటు కోసం ఏపీ సర్కారు సుమారు రూ.1.71 కోట్లను వెచ్చించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, అమరావతికి చెందిన రెయిన్‌బో ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. సదుపాయాల ఏర్పాట్లు పూర్తికావడంతో నిర్వాహకులు ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. ఇందులో కొందరు పర్యాటకులు పాల్గొని కొత్త అనుభూతిని ఆస్వాదించారు. ఈ నెల 9వ తేదీ నుంచి జిప్‌లైన్, జిప్ సైక్లింగ్‌ను అధికారికంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

100 అడుగుల ఎత్తులో ప్రయాణం

Advertisement

ఎత్తిపోతల జలపాతం ప్రకృతి అందాలను పై నుంచి చూసే అవకాశం జిప్‌లైన్ ద్వారా లభిస్తుంది. దాదాపు 100 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ జలపాతం, చుట్టుపక్కల ప్రాంతాల అందాలను చూసే అవకాశం ఉంటుంది. సాధారణంగా జలపాతాన్ని కింద నుంచి చూస్తే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. అయితే, గాల్లో ముందుకు సాగుతున్న సమయంలో కనిపించే దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా  అడ్వెంచర్ స్పోర్ట్స్ ను ఇష్టపడేవారికి ఈ కొత్త సదుపాయం మరింతగా ఆకట్టుకోనుంది.

సైకిల్‌పై గాల్లో ప్రయాణం

జిప్ సైక్లింగ్ ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేక ఆకర్షణ. ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన మార్గంపై సైకిల్ తొక్కుతూ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. నేలపై సైకిల్ తొక్కడం సాధారణమే అయినా.. గాల్లో ఎత్తులో సైకిల్ ప్రయాణం చేయడం మాత్రం పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. జిప్‌లైన్ మార్గం సుమారు 260 మీటర్ల పొడవు ఉంటుంది. వెళ్లి తిరిగి రావడానికి దాదాపు రెండు నిమిషాల సమయం పడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఒకేసారి ఇద్దరు వ్యక్తులు వెళ్లొచ్చు.

ధరలు, టైమింగ్స్ గురించి..

Advertisement

జిప్‌లైన్, జిప్ సైక్లింగ్‌లో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటే ఒక్కొక్కరికి రూ.600 చెల్లించాలి. రెండూ కావాలంటే  రూ.1,000 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. పర్యాటకుల సంఖ్య పెరిగితే సమయాన్ని మరో గంట పొడిగించే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్పారు.

నాగార్జునసాగర్‌కు మరింత లాభం   

ఎత్తిపోతల జలపాతం, నాగార్జునసాగర్ సమీపంలో ఉండటంతో కొత్త అడ్వెంచర్ టూరిజం సదుపాయాలు సాగర్ పర్యాటక రంగానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జలపాతం చూసేందుకు వచ్చే వారిలో మరికొందరు నాగార్జునసాగర్‌ను కూడా సందర్శించే అవకాశం ఉంది.

Read Also: నాగార్జునసాగర్ లో రంగు మారుతున్న నీళ్లు, అసలేం జరుగుతోంది?

Tags

Related News

భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు, అక్టోబర్ 27 నుంచి మరొక దేశానికి, వారానికి రెండు సార్లు

శ్రీకృష్ణుడి ద్వారకా తరహాలో.. సముద్ర గర్భంలో దాగి ఉన్న.. టాప్-5 ప్రాచీన నగరాలు ఇవే!

ఓరి దేవుడా.. కుక్కను వెతుక్కుంటూ వెళ్తే.. 17 వేల ఏళ్ల నాటి అద్భుతాలు బయటపడ్డాయ్!

ఉప్పునీటి సరస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లిన వందే భారత్.. చూస్తే కళ్ళు చెదిరి పోవాల్సిందే!

అడవిలో పారేసిన 12 టన్నుల నారింజ వ్యర్థాలు.. 15 ఏళ్ల తర్వాత జరిగింది చూసి.. యావత్ ప్రపంచమే షాక్!

చిన్న తెగ నుంచి IAS వరకు.. దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!

రూ.7 కోట్ల బంగారు శవపేటికలో అంత్యక్రియలు.. ఆశ్చర్యపోతున్న ప్రపంచం!

Big Stories

Advertisement
×