Assembly Tragedy: తెలంగాణ శాసనసభ ఆవరణలో నేడు తీంవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన నవీన్ మిట్టల్ పర్సనల్ కార్యదర్షి అయిన(PA) రాజు మరణించారు. అయితే శాసనసభ సమావేశాలు నడుస్తన్నందున విధి నిర్వహణలో ఉన్న రాజు అసెంబ్లీ ఆవకణంలో ఓక్క సారిగా కుప్పకూలి పోయారు. దీంతో వెంటనే అతన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చురుకున్న మంత్రి వాకిటి శ్రీహరి రాజుకు సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అనతరం మెకరుగైన చికిత్స కోసం ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీంతో రాజు మార్గమద్యంలోనే మరణించినట్టు వైద్యులు దృవీక రించారు. రాజుకు అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటువలనే మరణించారని వైద్యులు తెలిపారు.
Also read: ఓరి దేవుడా.. కుక్కను వెతుక్కుంటూ వెళ్తే.. 17 వేల ఏళ్ల నాటి అద్భుతాలు బయటపడ్డాయ్!
అసెంబ్లీలో ఈ ఘటన చోటుచేసుకోడంతో అక్కడి అధికారులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విధిలో ఉన్న ఉద్యోగి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపాన్ని వ్యక్తం చేసారు. దీంతో అక్కడి ప్రాతామంతా కొంత సేపు విషాద చాయలు అలుముకున్నాయి.
Also read: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్కు చెక్ పెట్టేలా సీఎం స్ట్రాటజీ!
కుప్పకూలిన ఐఏఎస్ పీఎస్.. సీపీఆర్ చేసిన మంత్రి
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మంత్రి వాకిటి శ్రీహరి సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. ఐఏఎస్ అధికారి నవీన్ మిత్తల్ పర్సనల్ సెక్రటరీ రాజు అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోగా, వెంటనే గమనించిన మంత్రి ఆయనకు CPR చేసి ప్రథమ చికిత్స అందించారు.… pic.twitter.com/vNTa2PFxET
— BigTV APP (@BigtvApp) September 8, 2026