BigTV English
Advertisement

Offbeat Destinations: ఈ రహస్య ప్రదేశాలకు లైఫ్‌లో.. ఒక్కసారైనా వెళ్లాలి !

Offbeat Destinations: ఈ రహస్య ప్రదేశాలకు లైఫ్‌లో.. ఒక్కసారైనా వెళ్లాలి !

Offbeat Destinations: మనం ఒక హిల్ స్టేషన్‌ చూడాలని అనుకున్నప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే పేరు సిమ్లా-మనాలీ. సిమ్లా మనాలి చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు. ఈ ప్రదేశాలు దాదాపు ఏడాది పొడవునా పర్యాటకులతో సందడిగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో.. ప్రశాంతమైన వాతావరణంలో పర్వతాల సౌందర్యాన్ని, సహజత్వాన్ని ఆస్వాదించడం సాధ్యం కాదు. అలాగే.. ఈ ప్రదేశాలకు వెళ్లడానికి కూడా ప్రయాణ ఖర్చు ఇతర పర్యాటక ప్రదేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ అవుతుంది. కానీ సిమ్లా-మనాలి వంటి అందమైన ప్రదేశాలను తక్కువ డబ్బుతో.. ప్రశాంతమైన వాతావరణంలో కూడా చూసి రావొచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లోనే మీరు రూ.2000 లోపు చూసే అనేక ఆఫ్‌బీట్ ప్రదేశాలు ఉన్నాయి.


సిమ్లా-మనాలీ వంటి రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా నిశ్శబ్దంగా, ఖర్చు లేకుండా, అందమైన ప్రదేశాలను సందర్శించాలనుకుంటే.. హిమాచల్ ప్రదేశ్‌లో అనేక అద్భుతమైన ప్రదేశాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ధరంకోట్ :
హిమాచల్ ప్రదేశ్‌లోని ధరంకోట్‌ను శాంతి , ధ్యాన కేంద్రంగా పరిగణిస్తారు. ధరంకోట్‌ ప్రయాణించడానికి.. మీరు మెక్లియోడ్ గంజ్‌కు బస్సు ద్వారా చేరుకోవాలి. అక్కడి నుండి టాక్సీ లేదా చిన్న ట్రెక్కింగ్ ద్వారా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తికి రోజుకు ఖర్చు దాదాపు 500 నుండి 1500 రూపాయలు ఉంటుంది. ధర్మశాలలో సందర్శించడానికి ధ్యాన కేంద్రాలు, అందమైన కేఫ్‌లు, ధౌలాధర్ శ్రేణి యొక్క అద్భుతమైన దృశ్యాలు ఉంటాయి.


షాంగర్ :
పచ్చని పొలాల మధ్య ప్రశాంతతను అనుభవించడానికి షాంఘర్‌ను తప్పకుండా చూడండి. ఇక్కడికి చేరుకోవడానికి.. ఢిల్లీ నుండి ఓట్‌కు రాత్రిపూట బస్సులో వెళ్ళండి. తరువాత టాక్సీ లేదా స్థానిక బస్సులో షాంఘర్‌కు వెళ్లండి. షాంఘర్ ప్రయాణ ఖర్చు రోజుకు దాదాపు రూ.1000 నుండి 2000 వరకు ఉంటుంది. ఈ కొండ ప్రాంతంలో పచ్చని పర్వతాలు, సాంప్రదాయ ఇళ్ళు, ఏకాంత వాతావరణాన్ని కూడా మీరు ఆస్వాదించవచ్చు.

చిట్కుల్:
ఈ ప్రదేశాన్ని భారతదేశపు చివరి గ్రామం అని పిలుస్తారు. చిట్కుల్ చేరుకోవడానికి.. మీరు సిమ్లా నుండి సాంగ్లాకు బస్సు లేదా టాక్సీలో వెళ్లవచ్చు. ఇక్కడి నుండి చిట్కుల్‌కు కూడా ప్రయాణించవచ్చు. ఇక్కడ రోజువారీ ఖర్చు దాదాపు రూ. 800 నుండి రూ. 1500 వరకు ఉంటుంది. చిట్కుల్‌లో.. సాంప్రదాయ చెక్క ఇళ్ళు, ప్రశాంతమైన నదీ తీర దృశ్యాలు, పట్టణ ప్రాంతానికి చాలా దూరంగా ఉంటాయి.

షోజా:
మీరు జలపాతాలు, అడవుల మధ్య ప్రశాంతతను పొందాలనుకుంటే.. మీరు షోజాను సందర్శించవచ్చు.భుంతర్ నుండి బర్షైని వరకు ట్రెక్కింగ్ ద్వారా షోజా చేరుకోవచ్చు. షోజాకు ప్రయాణ ఖర్చు కూడా రూ. 2,000 లోపే అవుతుంది. హిమాచల్‌లోని ఈ ప్రదేశంలో..దమైన జలపాతాలు, దట్టమైన అడవులు,పర్వతాల నుండి అద్భుతమైన సూర్యాస్తమయాన్ని చూడవచ్చు.

Also Read: ఏపీలో అందమైన బీచ్‌లు ఇవే.. అస్సలు మిస్సవ్వొద్దు !

కాజా:
హిమాచల్ ప్రదేశ్ లోని కాజాలో టిబెటన్ సంస్కృతి, ఠం యొక్క అద్భుతమైన సంగమాన్ని మీరు చూడవచ్చు. కాజాకు ప్రయాణించడానికి..బస్సు రెకాంగ్ పియో చేరుకోవచ్చు. టాక్సీ లేదా బస్సులో మరింత దూరం ప్రయాణించండి. ఈ ప్రత్యేకమైన పర్యాటక ప్రదేశంలో ఒక రోజు గడపడానికి దాదాపు 1000 నుండి 2000 రూపాయలు ఖర్చవుతుంది. ఇక్కడ మీరు పురాతన ఆరామాలు, ప్రత్యేకమైన టిబెటన్ సంస్కృతి,స్పితి లోయ అందాలను దగ్గరగా చూడవచ్చు.

Related News

Mumbai Train: మరో రైలు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

IRCTC – New Year 2026: IRCTC క్రేజీ న్యూ ఇయర్ టూర్ ప్యాకేజీ, ఏకంగా 6 రోజులు ఫారిన్ ట్రిప్!

IRCTC TN Temples Tour: హైదరాబాదు నుండి తమిళనాడు ఆలయాల యాత్ర.. 7 రోజుల ఆధ్యాత్మిక పర్యటన వివరాలు

Train Food: రైలులో వెజ్ బిర్యానీ కొన్న ప్రయాణికుడు.. రూ.25 వేలు చెల్లించిన రైల్వే, ఎందుకంటే?

Lower Currency Countries: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!

Monorail Derails: ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు.. మరి ప్రయాణికులు?

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Big Stories

×