E-Paper
Advertisement

Railway New Rules: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై జర్నీ తేదీని మార్చేసుకోవచ్చు

Railway New Rules: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై జర్నీ తేదీని మార్చేసుకోవచ్చు
Advertisement

Railway New Rules: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు తమ రైలు రిజర్వేషన్లను ఎలాంటి రుసుము లేకుండా మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. టికెట్ కన్ఫార్మ్ అయితే తర్వాత జర్నీ వాయిదా పడితే.. ప్రయాణి తేదీని మార్చుకోవచ్చు.

అయితే కేవలం రుసుములో తేడాను మాత్రమే చెల్లించి జర్నీ తేదీని మార్చుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. దీనిని ముందుగా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ ద్వారా అమలు చేయాలని భావిస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని సమాచారం.

జర్నీ డేట్ మార్చుకోవచ్చు

Advertisement

ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలను మార్చుకోడానికి అవకాశం లేదు. ఆ టికెట్ ను రద్దు చేసుకుని, ఆ తర్వాత కావాల్సిన తేదీకి బుక్ చేసుకోవాల్సి ఉండేది. ప్రయాణ తేదీలను షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉండేది కాదు.

అయితే కొత్త వ్యవస్థలో ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయి బుక్ చేసుకున్న టికెట్‌ను… సీట్లు అందుబాటులో ఉన్నంత వరకు వేరే ప్రయాణ తేదీ లేదా రైలును మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రయాణ ఛార్జీలలో వ్యత్యాసం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

దక్షిణ మధ్య రైల్వే కొత్త టైమింగ్స్

Advertisement

జనవరి 1వ తేదీ నుండి రైలు ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను చెక్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. నేటి నుంచి రైళ్ల ప్రయాణ సమయాలలో మార్పు చేశారు. రైళ్లకు సంబంధించి.. మార్పుల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ద్వారా తెలుసుకోవచ్చు.

సికింద్రాబాద్ లేదా కాచిగూడలో ప్రారంభమయ్యే లేదా ముగిసే 25 రైళ్లలో 8 రైళ్ల సమయాలను స్వల్పంగా మార్పులు చేశారు. రైళ్ల సమయాల్లో 5 నుంచి 30 నిమిషాల వ్యత్యాసం ఉండనుంది. అందుకే జనవరి 1 నుంచి రైలు ప్రయాణికులు ప్రయాణ సమయాలను ముందుగా చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

కొత్త టైమ్ టేబుల్

జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త టైమ్‌ టేబుల్‌ అమల్లోకి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది. వివిధ స్టేషన్లలో 61 రైళ్లకు కొత్త స్టాప్‌లు రానున్నాయి. దీంతో మరింత మందికి రైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది.

Also Read: సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు.. టైమింగ్స్, స్టేషన్ల సమాచారం ఇదిగో

అలాగే ట్రాక్ డబ్లింగ్, ఇంటర్‌లాకింగ్, నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు, సిగ్నలింగ్ అప్‌గ్రేడేషన్, కరెంట్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. రెండు రైళ్లను మెయిల్/ఎక్స్‌ప్రెస్ నుంచి సూపర్‌ఫాస్ట్‌గా మార్చారు. 89 రైళ్లకు వేగం పెంచారు. వివిధ స్టేషన్లలో 66 రైళ్ల రాక, బయలుదేరే సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×