E-Paper
Advertisement

వందే భారత్‌లో ‘ఫుడ్’ దందా.. నిలదీస్తే ఏం చేశారో తెలుసా?

వందే భారత్‌లో ‘ఫుడ్’ దందా.. నిలదీస్తే ఏం చేశారో తెలుసా?

Vande Bharat Overcharge Incident: భారతీయ రైల్వేలోకి అత్యాధునిక రైలుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ అడుగు పెట్టింది. అత్యధిక వేగం, అధునాతన సౌకర్యాలు ప్రయాణికులకు మంచి ట్రావెల్ ఎక్స్ పీరియెన్స్ ను అందించడంలో ముందుంటున్నాయి. చక్కటి మెయింటెనెన్స్ తో ప్యాసింజర్స్ ను ఈ రైళ్లు ఆకట్టుకుంటున్నాయి. కానీ, గత కొద్ది రోజులుగా వందేభారత్ రైళ్ల ఫుడ్ గురించి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అన్నంలో నాణ్యత లేకపోవడం, పెరుగులో పురుగులు లాంటి ఘటనలు ప్రయాణికులలో ఆందోళన కలిగించాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది.

వందేభారత్ లో ఫుడ్ దందా!

తాజాగా వందేభారత్ లో ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఆయన రైలులో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఇందుకోసం రూ. 150 ఛార్జ్ చేశారు. అయితే, బిల్లు మాత్రం రూ. 220 ఇచ్చారు. ఎందుకు ఇలా ఎక్కువ వసూలు చేస్తున్నారో అడిగితే, రొటీ వేరు ఐటమ్ అని, దానికి అదనంగా రూ. 70 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.  ఇది విన్న వెంటనే ఆయనకు ఏదో సరిగా లేదనే అనిపించింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ, సదరు ప్రయాణికుడు అలా చేయలేదు. వెంటనే రైల్వే అధికారిక హెల్ప్‌ లైన్ అయిన 139 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు చేసిన కాసేపటికి ఏం జరిగిందంటే?

ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే పరిస్థితి మారిపోయింది. రైలులోని క్యాటరింగ్ మేనేజర్ స్వయంగా ఆయన దగ్గరికి వచ్చారు. సమస్యను పరిష్కరించేందుకు మాట్లాడారు. అయితే, ఆయన చెప్పిన మాటలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. “మీరు ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే, నేను మీకు రూ. 70 తిరిగి ఇస్తాను. లేదంటే మాకు పెద్ద సమస్యలు వస్తాయి. సుమారు రూ. 50,000 వరకు నష్టం జరుగుతుంది”  అన్నారు.

ఈ మాటలు వినగానే, ఈ వ్యవహారం ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతుంది. ఒక చిన్న మొత్తాన్ని వసూలు చేసినా, అది బయటపడితే సంస్థకు పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అంటే, ఇలాంటి తప్పులు చాలా మంది క్యాటరర్స్ చేస్తున్నారని, వారిపైనా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అర్థం అవుతోంది. ఈ ఘటనలో సదరు ప్రయాణికుడు సైలెంట్ గా ఉండకపోవడం వల్ల ఎంతో మంది మోసానికి గురయ్యే అవకాశం తగ్గింది. ఎవరో ఒకరు ప్రశ్నించాలి, అప్పుడు మాత్రమే మార్పు మొదలవుతుందని ఈ ఘటనతో తేలిపోయింది.

చిన్న రియాక్షన్.. పెద్ద ఇంపాక్ట్!

ఈ ఘటన ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. కానీ, పెద్ద మెసేజ్ ఇస్తుంది. ఎక్కడైనా మనకు అనుమానం కలిగితే, అది చిన్న విషయం అయినా సరే, నిర్లక్ష్యం చేయకూడదు.  వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా  మోసాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. అటు ఈ ఘటనపై IRCTC కూడా విచారణ జరిపి, తగిన యాక్షన్ తీసుకోనున్నట్లు వెల్లడించింది.

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×