BigTV English

Mahakumbh-2025: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఎన్ని వేల రైళ్లు కేటాయించిందంటే?

Mahakumbh-2025: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఎన్ని వేల రైళ్లు కేటాయించిందంటే?

Indian Railways: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళా వేడుకలకు ఉత్తరప్రదేశ్ సర్కారు కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్‌ రాజ్‌ లో జరిగే ఈ వేడుకలకు యోగీ సర్కారు ఇప్పటికే పనులు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది (2025) జనవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు జరిగే ఈ మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 13 వేల రైళ్లను   భక్తుల కోసం కేటాయించింది.


భక్తుల విశ్రాంతికి IRTC ప్రత్యేక ఏర్పాట్లు

అటు రైళ్లలో వచ్చే భక్తుల కోసం IRTC ప్రయాగ్ రాజ్ లో ప్రత్యేక డేరాలలో కూడిన విశ్రాంతి గదులను  నిర్మిస్తున్నది.  భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తుగా నిర్వహించే మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేలో తరలి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డేరాలలో గదులను కేటాయించనుంది. ఇందుకోసం ప్రయాగ్ రాజ్ లో డేరాలతో కూడిన విశ్రాంతి గదులను ఏర్పాటు చేస్తున్నది. ఈ డేరా సిటీ పుష్కర ఘాట్లకు సమీపంలోనే ఉంటుంది. ఇందులో బస చేసే వారికి ఫస్ట్ క్లాస్ సౌకర్యాలను కనిపించనుంది. ఇందులో విశ్రాంతి పొందే ఒక్కో భక్తుడికి రోజుకు 6 వేల చొప్పున ఛార్జీ వసూళు చేయనుంది. ఇందులో బస చేసే వారికి రైల్వే సంస్థ బ్రేక్ ఫాస్ట్ అందిస్తుంది. అటు ప్రయాగ్ రాజ్ చివరలో నదికి ఇరువైపులా ప్రత్యేకమైన ఎగ్జిక్యూటివ్ లాంజ్ లను సైతం ఏర్పాటు చేశారు అధికారులు.


రైల్వేశాఖ ప్రత్యేక మానిటరింగ్

మహా కుంభమేళా వేడుకలు జనవరి 13 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు మకర సంక్రాంతి(జనవరి 14), ఫిబ్రవరి 3న ముని-అమావాస్య, ఫిబ్రవరి 12న మాఘి పూర్ణిమ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి నాడు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఈ రోజుల్లో భక్తుల తాడికి విపరీతంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. తొలిసారి రైల్వే క్రౌడ్ మానిటరింగ్ కోసం  ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం  వీడియో అనలిటిక్స్ ఆధారిత FRS కెమెరాలు,  డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నది. ప్రయాణీకుల భద్రత కోసం RPFతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నది. యూపీ ప్రభుత్వం AI టెక్నాలజీతో ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థను రైల్వేశాఖ వినియోగించనుంది. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నది.

13 వేల ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

అటు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరిగే మహాకుంభ మేళా వేడుకల కోసం 3,124 ప్రత్యేక రైళ్లు, 10,100 సాధారణ రైళ్లను షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్ లో ఏకంగా 278 టికెటింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. యుటిఎస్‌తో సహా అన్ని మోడ్‌లలో రోజుకు 10,15,200 మంది ప్రయాణీకులకు టికెటింగ్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: గంటకు 1000 కిలో మీటర్ల వేగంతో నడిచే రైలు.. జస్ట్ 45 నిమిషాల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకోవచ్చు!

Related News

Vande Bharat Trains: ఇవాళ 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం, తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అంటే?

Vande Bharat Sleeper: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!

Dasara Special Trains: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!

Sunrise Express: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Big Stories

×