E-Paper
Advertisement

South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన మీకోసమే!

South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన మీకోసమే!
Advertisement

South Central Railway: మీరు నిరంతరం రైలులో ప్రయాణిస్తుంటారా.. అయితే మీకోసం దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. జనవరి 1, 2025 నుండి తీసుకోబోతున్న కీలక నిర్ణయంపై దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది. ఈ విషయాన్ని గమనించకపోతే మాత్రం రైలు ప్రయాణానికి మీరు దూరం కాక తప్పదు. ఈ మార్పుల వివరాలను రైల్వే స్టేషన్స్ వద్ద ప్రదర్శించినట్లు, ప్రయాణికులు గమనించాలని కూడా కోరింది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే ప్రయాణికుల కోసం ఓ ప్రకటన వెలువడింది. రైళ్ల సమయాల్లో జనవరి1, 2025 నుండి అమల్లోకి వస్తుందని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది. అందుకై జనవరి 1 నుండి ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, రైళ్ల సమయాలను తనిఖీ చేయాలని సూచించింది.

Advertisement

రైళ్లకు సంబంధించిన సమాచారం, సంబంధిత స్టేషన్లలో సమయాల్లో మార్పులను ఐ.ఆర్.సి.టి.సి వెబ్‌సైట్ (www.irctc.co.in)ను కానీ , నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్.టి.ఈ.ఎస్)ను సందర్శించాలని ప్రకటించింది. అంతేకాకుండ నేరుగా సంబంధిత రైల్వే స్టేషన్లలోని స్టేషన్ మేనేజర్, విచారణ కేంద్రాన్ని సంప్రదించి సరైన సమయాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించి సహకరించాలని దక్షిణమధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

Also Read: TTD News: తిరుమలలో 10 రోజుల పాటు ఆ దర్శనాలు రద్దు.. టీటీడీ కీలక ప్రకటన

Advertisement

ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల్లోనూ మార్పులు..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల్లో మార్పులు కూడ జనవరి 1 నుండి అమలులోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తమ పరిధిలో మొత్తం 88 ఎంఎంటీఎస్ సర్వీసుల ద్వార సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ కొత్త సబర్బన్ విభాగం – మేడ్చల్, ఫలక్‌నుమా – ఉమ్దానగర్, ఘట్కేసర్ – లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల్లో మార్పులు జరిగాయి. ప్రయాణికుల సమయాలను దృష్టిలో ఉంచుకుని, రైళ్ల వేళలు మార్చినట్లు ప్రయాణికులకు సూచించింది. మారిన సమయాన్ని తెలుపుతూ.. వివిధ స్టేషన్లలో మార్పుల వివరాలను ప్రదర్శించడం జరిగిందని, ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

Related News

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

35 ఏళ్ల క్రితం ల్యాండ్ అయింది.. ఇప్పటికీ కదల్లేదు! ఈ విమానం వింత కథేంటో తెలుసా?

దక్షిణ అయోధ్యకు ఇక ఫాస్ట్ జర్నీ.. భద్రాచలానికి నేరుగా హైస్పీడ్ రైలు!

న్యూక్లియర్ రియాక్టర్ వేడితో హైడ్రోజన్ ఉత్పత్తి.. భారత టెక్నాలజీకి ప్రపంచం షాక్!

పాదరక్షలు లేకుండా 32 కి.మీ నడక.. సింహాచల గిరి ప్రదక్షిణ విశిష్టత ఇదే!

Big Stories

Advertisement
×