E-Paper
Advertisement

South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన మీకోసమే!

South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన మీకోసమే!

South Central Railway: మీరు నిరంతరం రైలులో ప్రయాణిస్తుంటారా.. అయితే మీకోసం దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. జనవరి 1, 2025 నుండి తీసుకోబోతున్న కీలక నిర్ణయంపై దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది. ఈ విషయాన్ని గమనించకపోతే మాత్రం రైలు ప్రయాణానికి మీరు దూరం కాక తప్పదు. ఈ మార్పుల వివరాలను రైల్వే స్టేషన్స్ వద్ద ప్రదర్శించినట్లు, ప్రయాణికులు గమనించాలని కూడా కోరింది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే ప్రయాణికుల కోసం ఓ ప్రకటన వెలువడింది. రైళ్ల సమయాల్లో జనవరి1, 2025 నుండి అమల్లోకి వస్తుందని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది. అందుకై జనవరి 1 నుండి ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, రైళ్ల సమయాలను తనిఖీ చేయాలని సూచించింది.

రైళ్లకు సంబంధించిన సమాచారం, సంబంధిత స్టేషన్లలో సమయాల్లో మార్పులను ఐ.ఆర్.సి.టి.సి వెబ్‌సైట్ (www.irctc.co.in)ను కానీ , నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్.టి.ఈ.ఎస్)ను సందర్శించాలని ప్రకటించింది. అంతేకాకుండ నేరుగా సంబంధిత రైల్వే స్టేషన్లలోని స్టేషన్ మేనేజర్, విచారణ కేంద్రాన్ని సంప్రదించి సరైన సమయాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించి సహకరించాలని దక్షిణమధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

Also Read: TTD News: తిరుమలలో 10 రోజుల పాటు ఆ దర్శనాలు రద్దు.. టీటీడీ కీలక ప్రకటన

ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల్లోనూ మార్పులు..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల్లో మార్పులు కూడ జనవరి 1 నుండి అమలులోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తమ పరిధిలో మొత్తం 88 ఎంఎంటీఎస్ సర్వీసుల ద్వార సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ కొత్త సబర్బన్ విభాగం – మేడ్చల్, ఫలక్‌నుమా – ఉమ్దానగర్, ఘట్కేసర్ – లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల్లో మార్పులు జరిగాయి. ప్రయాణికుల సమయాలను దృష్టిలో ఉంచుకుని, రైళ్ల వేళలు మార్చినట్లు ప్రయాణికులకు సూచించింది. మారిన సమయాన్ని తెలుపుతూ.. వివిధ స్టేషన్లలో మార్పుల వివరాలను ప్రదర్శించడం జరిగిందని, ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×