BigTV English
Advertisement

South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన మీకోసమే!

South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన మీకోసమే!

South Central Railway: మీరు నిరంతరం రైలులో ప్రయాణిస్తుంటారా.. అయితే మీకోసం దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. జనవరి 1, 2025 నుండి తీసుకోబోతున్న కీలక నిర్ణయంపై దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది. ఈ విషయాన్ని గమనించకపోతే మాత్రం రైలు ప్రయాణానికి మీరు దూరం కాక తప్పదు. ఈ మార్పుల వివరాలను రైల్వే స్టేషన్స్ వద్ద ప్రదర్శించినట్లు, ప్రయాణికులు గమనించాలని కూడా కోరింది.


దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే ప్రయాణికుల కోసం ఓ ప్రకటన వెలువడింది. రైళ్ల సమయాల్లో జనవరి1, 2025 నుండి అమల్లోకి వస్తుందని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది. అందుకై జనవరి 1 నుండి ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, రైళ్ల సమయాలను తనిఖీ చేయాలని సూచించింది.

రైళ్లకు సంబంధించిన సమాచారం, సంబంధిత స్టేషన్లలో సమయాల్లో మార్పులను ఐ.ఆర్.సి.టి.సి వెబ్‌సైట్ (www.irctc.co.in)ను కానీ , నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్.టి.ఈ.ఎస్)ను సందర్శించాలని ప్రకటించింది. అంతేకాకుండ నేరుగా సంబంధిత రైల్వే స్టేషన్లలోని స్టేషన్ మేనేజర్, విచారణ కేంద్రాన్ని సంప్రదించి సరైన సమయాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించి సహకరించాలని దక్షిణమధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.


Also Read: TTD News: తిరుమలలో 10 రోజుల పాటు ఆ దర్శనాలు రద్దు.. టీటీడీ కీలక ప్రకటన

ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల్లోనూ మార్పులు..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల్లో మార్పులు కూడ జనవరి 1 నుండి అమలులోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తమ పరిధిలో మొత్తం 88 ఎంఎంటీఎస్ సర్వీసుల ద్వార సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ కొత్త సబర్బన్ విభాగం – మేడ్చల్, ఫలక్‌నుమా – ఉమ్దానగర్, ఘట్కేసర్ – లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల్లో మార్పులు జరిగాయి. ప్రయాణికుల సమయాలను దృష్టిలో ఉంచుకుని, రైళ్ల వేళలు మార్చినట్లు ప్రయాణికులకు సూచించింది. మారిన సమయాన్ని తెలుపుతూ.. వివిధ స్టేషన్లలో మార్పుల వివరాలను ప్రదర్శించడం జరిగిందని, ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

Related News

Train Food: రైలులో వెజ్ బిర్యానీ కొన్న ప్రయాణికుడు.. రూ.25 వేలు చెల్లించిన రైల్వే, ఎందుకంటే?

Lower Currency Countries: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!

Monorail Derails: ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు.. మరి ప్రయాణికులు?

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Big Stories

×