E-Paper
Advertisement

Sabarimala Special Buses: అయ్యప్ప స్వాములకు ఆర్టీసీ గుడ్ న్యూస్, శబరిమలకు 200 అద్దె బస్సులు!

Sabarimala Special Buses: అయ్యప్ప స్వాములకు ఆర్టీసీ గుడ్ న్యూస్, శబరిమలకు 200 అద్దె బస్సులు!
Advertisement

TGSRTC Sabarimala Special Buses:

తెలంగాణ నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులు ఇబ్బంది లేకుండా అయ్యప్ప స్వామిని దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వ్యక్తిగత వాహనాలు లేని భక్తులు ఇప్పటికే రైళ్లు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో వెళ్లేందుకు రెడీ కాగా, ఆర్టీసీ కూడా భక్తులకు ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. తెలంగాణ నుంచి శబరిమలకు 200 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్కో డిపో నుంచి కనీసం రెండు బస్సులను శబరిమలకు కేటాయించాలని ఆర్టీసీ అధికారులకు సర్క్యులర్ జారీ అయ్యింది.

లక్ష మంది భక్తులకు రవాణా సౌకర్యం

ఈ ప్రత్యేక బస్సులను అద్దె ప్రాతిపదికన నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ బస్సుల ద్వారా సుమారు లక్ష మంది అయ్యప్ప భక్తులకు రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులలో ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులు ఉంటాయని ప్రకటించారు. ఇక ఈ బస్సులకు సంబంధించి ఛార్జీలను ఖరారు చేశారు. బస్సు రకం, ప్రయాణ దూరాన్ని బట్టి కిలో మీటరుకు ఇంత అని ఛార్జ్ వసూళు చేస్తారు. బస్సులు ఆగిన సమయానికి వెయిటింగ్ ఛార్జీ గంటకు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు సూపర్ లగ్జరీ బస్సును బుక్ చేసుకుంటే.. ఆ బస్సు రానుపోను 3000 కి.మీ తిరిగినట్లు అయితే, ప్రయాణ సమయం 6 రోజులు పడితే, బేస్ ఛార్జ్, వెయిటింగ్ ఛార్జ్, పర్మిట్ ఛార్జ్, జీఎస్టీ లాంటి అన్ని ఖర్చులు కలిపి సుమారు రూ. 1, 97, 000 అవుతుంది. గురు స్వామి పేరుతో బస్సు బుక్ చేసుకుంటే ఓ వ్యక్తికి ఉచితంగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది.

బస్సును ఎలా బుక్ చేసుకోవాలంటే?

Advertisement

శబరిమలకు బస్సును బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా రూ. 10 వేల కాషన్ డిపాజిట్ చెల్లించాలి. ఈ మొత్తాన్ని యాత్ర పూర్తి అయిన తర్వాత ఆర్టీసీ తిరిగి చెల్లిస్తుంది. ఛార్జీల విషయానికి వస్తే రాజధాని బస్సుల్లో 40 సీట్లు ఉంటాయి. కిలో మీటరకు రూ. 77 వసూళు చేస్తారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 36 సీట్లు ఉంటాయి. కిలో మీటరకు రూ. 59 వసూళు చేస్తారు. డీలక్స్ బస్సుల్లో 40 సీట్లు ఉంటాయి. కిలో మీటరుకు రూ. 57 వసూళు చేస్తారు. ఎక్స్ ప్రెస్ బస్సులో 50 సీట్లు ఉంటాయి. కిలో మీటరుకు రూ. 62 వసూళు చేస్తారు. ఆయా రాష్ట్రాల రవాణాశాఖ వసూళు చేసే ఛార్జీలను కూడా భక్తులే చెల్లించాల్సి ఉంటుంది.

శబరిమల బస్సుల్లో కల్పించే సౌకర్యాలు

శబరిమలకు వెళ్లే బస్సు బుక్ చేసుకున్న గురుస్వామికి భక్తులతో పాటు అదే బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. భక్తులతో పాటు వచ్చే లగేజ్‌ అటెండెంట్లు, వంట మనుషులు ఉచితంగా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, వీరికి సీట్లు ఉండవు. ప్రయాణ సమయంలో వినోదం కోసం ఆడియో, వీడియో సిస్టమ్ ఏర్పాటు చేస్తారు.

Advertisement

Read Also: రైల్లో పిల్లలకు టికెట్ ఉచితమేనా.. కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×