SL vs PAK 2025: సౌత్ ఆఫ్రికా తో పరిమిత ఓవర్ల సిరీస్ ని సొంతం చేసుకున్న పాకిస్తాన్.. ఇప్పుడు స్వదేశంలో శ్రీలంకతో 3 వన్డేల సిరీస్ ని ప్రారంభించింది. ఇందులో మొదటి వన్డేలో శుభారంభం చేసింది పాకిస్తాన్. మంగళవారం రోజు జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ 6 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన 300 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు చివరిదాకా పోరాడిన శ్రీలంక.. 50 ఓవర్లలో 9 వికెట్లకు 293 పరుగులు చేసి ఓడిపోయింది.
Also Read: BCCI: నోరు మూసుకుని, మేం చెప్పినట్లే ఆడాలి.. కోహ్లీ, రోహిత్ పరువు తీసిన బీసీసీఐ
శ్రీలంకపై మొదటి వన్డేలో విజయం సాధించిన పాకిస్తాన్ జట్టుపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వెలువడుతున్నాయి. ఇండియా పై గెలవడం చేతకాదు కానీ.. శ్రీలంక పై ప్రతాపం చూపిస్తున్నారని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజెన్లు. భారత్ – పాక్ జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన వన్డే మ్యాచ్ లను పరిశీలిస్తే భారత్ దే పైచేయిగా ఉంది. విశాఖపట్నంలో 2005 ఏప్రిల్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ అత్యధిక స్కోరు 356/9 పరుగులు సాధించింది. అలాగే 2023 సెప్టెంబర్ 10న కొలంబోలో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. 2023 సెప్టెంబర్ 10న పాకిస్తాన్ పై భారత్ 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇక 2023 సెప్టెంబర్ 10న పాకిస్తాన్ పై భారత్ 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వికెట్ల పరంగా చూస్తే 2018 సెప్టెంబర్ 23న దుబాయిలో జరిగిన మ్యాచ్ లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇలా వన్డేల విషయంలో పాకిస్తాన్ పై భారత్ దే పైచేయి.
ఇప్పటివరకు భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన అన్ని ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్ పై ఎప్పుడు భారత్ పై చేయి సాధించింది. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ – పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు ఎనిమిది వన్డే మ్యాచ్ లు జరిగాయి. ఇందులో భారత్ ఎనిమిది మ్యాచ్లలో విజయం సాధించింది. అలాగే 7 టి-20 మ్యాచ్ లు కూడా జరిగాయి. ఇందులో భారత్ ఆరు మ్యాచ్లలో విజయం సాధిస్తే.. పాకిస్తాన్ ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది.
ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఐదు మ్యాచ్ లు జరిగితే భారత్ ఇందులో రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. పాకిస్తాన్ మూడింట విజయం సాధించింది. 2017 ఫైనల్ లో పాకిస్తాన్ విజయం సాధించింది ఒకసారి మాత్రమే. ఇలా మొత్తం ఐసీసీ టోర్నమెంట్ల రికార్డులలో భారత్ – పాకిస్తాన్ మధ్య 20 మ్యాచ్ లు జరిగితే.. 16 మ్యాచ్ లలో భారత్ గెలుపొందగా.. పాకిస్తాన్ కేవలం నాలుగు మ్యాచ్ లలో మాత్రమే గెలుపొందింది.