E-Paper
Advertisement

Tirupati tour package: IRCTC స్పెషల్ ప్యాకేజ్.. లింగంపల్లి నుంచి తిరుపతి వరకు.. భక్తులకు బంపర్ ఆఫర్!

Tirupati tour package: IRCTC స్పెషల్ ప్యాకేజ్.. లింగంపల్లి నుంచి తిరుపతి వరకు.. భక్తులకు బంపర్ ఆఫర్!

Tirupati tour package: రోజు ఒక్కసారి దైవ దర్శనం జరగాలి అనేది ఎంతోమంది మనసులో కోరిక. కానీ జీవన పోరాటం, ప్రయాణ భారం, హోటల్ ఏర్పాట్లు, టైమ్ మేనేజ్‌మెంట్ సమస్యల వల్ల ఆ కోరిక కలలోనే మిగిలిపోతుంటుంది. అలాంటి భక్తుల కోసం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది ఒక అద్భుతమైన ప్యాకేజీ.. అదే IRCTC ప్రవేశపెట్టిన TIRUPATI BY NARAYANADRI EXPRESS.

ఇది హైదరాబాద్‌ నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు ప్రయాణం సాగించే 3 నైట్లు, 4 రోజుల సౌకర్యవంతమైన యాత్ర ప్యాకేజీ. రైలు ప్రయాణం, హోటల్ బస, బస్ లేదా క్యాబ్ ద్వారా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్, ఒక బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి అన్ని సేవలు ఇందులో కలిపి ఇవ్వబడతాయి. కానీ, ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే.. ఈ ప్యాకేజీలో తిరుమల దర్శన టిక్కెట్ మాత్రం కలిపి ఉండదు. భక్తులు స్వయంగా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలి.

ఈ ప్యాకేజీని IRCTC అందిస్తుంది. ఇది ప్రతి రోజు అందుబాటులో ఉంటుంది. అంటే, మీరు ఎప్పుడు వెళ్లాలనుకున్నా.. మీకు అవకాశం ఉంటుంది. ప్రయాణం హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి సాయంత్రం 5:30 గంటలకు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ ద్వారా ప్రారంభమవుతుంది. ఇందులో మీకు SL (స్లీపర్ క్లాస్) లేదా 3AC (ఎయిర్ కండిషన్డ్) క్లాస్ ఎంపికలు లభిస్తాయి. ప్రయాణానికి తగిన విధంగా మీరు ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. మీరు ఏ తరహాలో షేరింగ్ చేస్తారు అనేది బట్టి టారిఫ్ ధర మారుతుంది.

ఒకవేళ మీరు 3AC కంఫర్ట్ కేటగిరీలో ఒంటరిగా ప్రయాణించాలనుకుంటే రూ. 13,950 ఖర్చు అవుతుంది. ఇద్దరు కలిసి తీసుకుంటే ఒక్కొక్కరికి రూ. 10,860 ఉంటుంది. ముగ్గురు కలిసి షేర్ చేసుకుంటే ఒక్కరికి రూ. 9,080. పిల్లలకు బెడ్‌తో ఉంటే రూ. 6,620, బెడ్ లేకుండా ఉంటే రూ. 5,560, అదే స్లీపర్ క్లాస్ స్టాండర్డ్ కేటగిరీలో ఒంటరిగా రూ.12,080, ఇద్దరు కలిసి అయితే ఒక్కొక్కరికి రూ. 8,990, ముగ్గురైతే రూ. 7,210, పిల్లలకు బెడ్‌తో రూ. 4,750, బెడ్ లేకుండా రూ.3,690 మాత్రమే. మొత్తం చూస్తే ఈ ధరలకి ఈ స్థాయి ప్యాకేజీ రావడం అంటే నిజంగా భక్తులకి గుడ్ న్యూస్‌ అనే చెప్పాలి.

ఈ ప్యాకేజీలో భాగంగా తిరుపతి, శ్రీకాళహస్తి క్షేత్రాలే కాదు, అదనంగా కాణిపాకం వినాయకుని దర్శనం కూడా ఉంటుంది. కాణిపాకం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే.. ఇక్కడి గర్భగుడిలోని విగ్రహం రోజురోజుకీ పెరుగుతున్నదనే విశ్వాసం ఉంది. వినాయకుని గుడి దగ్గరికి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఒక అరవైపు ప్రశాంతతను, మరోవైపు శక్తిని పొందుతారు.

ప్రయాణానికి హోటల్ బస కూడా ఈ ప్యాకేజీలో కలిపి ఉంది. రాత్రి బసలకు అదనంగా శుభ్రత, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అలాగే ఒక బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్యాకేజీలో భాగం. ప్రయాణికుల బీమా కూడా ఉండటంతో మీ ప్రయాణం మరింత భద్రతగా ఉంటుంది.

Also Read: Railway new line: 30 ఏళ్ల తర్వాత వచ్చిన రైలు.. ఏపీలో ఇక అందరూ ఆ స్టేషన్ల వైపే!

అయితే ఇందులోని ముఖ్యమైన విషయం ఏంటంటే.. తిరుమల దర్శన టిక్కెట్లు ఇందులో లేవు. కావున మీరు స్వయంగా www.ttdsevaonline.com వెబ్‌సైట్ ద్వారా ముందుగానే దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. లేకపోతే అక్కడి కౌంటర్ల ద్వారా కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కొంత అసౌకర్యంగా అనిపించినా, మొత్తం ప్యాకేజీ ఖర్చు తగ్గించడానికి ఇది అవసరమైంది.

ఈ ప్యాకేజీకి మార్చి 2025కి ధరలు ప్రకటించబడ్డాయి. ఇకపై పర్యటన తేదీల ఆధారంగా మారవచ్చు. ఉదాహరణకు, 10 ఆగస్టు 2025 తేది నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. కాబట్టి మీరు ముందుగా బుక్ చేసుకుంటే, రైలు టిక్కెట్లు కూడా లభించేందుకు వీలవుతుంది.

ఇలా రైలు టిక్కెట్, హోటల్ బుకింగ్, బస్ ట్రాన్స్‌పోర్ట్, భోజనం అన్నీ కలిపి మీరు భక్తితో సులభంగా స్వామివారి దర్శనం పొందగలిగేలా రూపొందించబడింది ఈ ప్యాకేజీ. కుటుంబ సమేతంగా వెళ్లాలనుకునేవాళ్లకు ఇది ఓ వరం లాంటిది. ఇక ఆలస్యం ఎందుకు? తిరుపతి బాలాజీ దర్శనానికి ఈసారి భద్రతతో కూడిన, సౌకర్యవంతమైన యాత్రకు సిద్ధమవ్వండి.

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×